టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్గా ఉన్న ప్రభాకర్రెడ్డి.. బీజే పీ నాయకురాలు..మాధవీలతపై నోరు చేసుకున్నారు. ఈ క్రమంలో మాధవీలత కొన్నాళ్ల కిందట ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. వాస్తవానికి మాధవీలత పోక్సో కేసు పెట్టాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, క్రమినల్ కేసు నమోదు చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
గత ఏడాది డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకలను జేసీ తన ఫామ్ హౌస్లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు యువతులను కూడా తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మాధవీ లత.. మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించారంటూ.. అప్పట్లోనే జేసీపై విమర్శలు చేశారు. తాడిపత్రిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇలాంటి నృత్యాలతో మహిళల పరువు తీస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు.
దీనిపై ఆ వెంటనే జేసీ స్పందించారు. మాధవీ లతపై నోరు చేసుకున్నారు. దూషించారు. ఈ వివాదం తారస్థాయికి చేరింది. దీంతో చివరకు.. జేసీ మరోసారి మీడియా ముందుకు వచ్చి మాధవీలతకు క్షమాప ణలు చెప్పారు. పొరపాటున తాను పరుషంగా వ్యాఖ్యానించానని చెప్పారు. అయితే.. అప్పటి వరకు ప్రసాంతంగానే సాగిపోయినా.. తర్వాత ఏపీకి చెందిన ఓ పార్టీ కీలక నేత ఒకరు రంగంలోకి దిగి.. జేసీపై కేసు పెట్టేందుకు పురిగొల్పారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని సైబర్ క్రైం పోలీసులు భారతీయన న్యాయ సంహిత సెక్షన్లు 351, 352 కింద జేసీపై కేసు నమోదు చేశారు. ఇవి క్రిమినల్ చట్టాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై ఎఫ్ ఐఆర్ కూడా నమోదు కావడంతో పోలీసులు ఆయనకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన వివరణ తీసుకున్న తర్వాత.. అరెస్టు చేసినా చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on February 15, 2025 11:55 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…