టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్గా ఉన్న ప్రభాకర్రెడ్డి.. బీజే పీ నాయకురాలు..మాధవీలతపై నోరు చేసుకున్నారు. ఈ క్రమంలో మాధవీలత కొన్నాళ్ల కిందట ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. వాస్తవానికి మాధవీలత పోక్సో కేసు పెట్టాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, క్రమినల్ కేసు నమోదు చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
గత ఏడాది డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకలను జేసీ తన ఫామ్ హౌస్లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు యువతులను కూడా తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మాధవీ లత.. మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించారంటూ.. అప్పట్లోనే జేసీపై విమర్శలు చేశారు. తాడిపత్రిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇలాంటి నృత్యాలతో మహిళల పరువు తీస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు.
దీనిపై ఆ వెంటనే జేసీ స్పందించారు. మాధవీ లతపై నోరు చేసుకున్నారు. దూషించారు. ఈ వివాదం తారస్థాయికి చేరింది. దీంతో చివరకు.. జేసీ మరోసారి మీడియా ముందుకు వచ్చి మాధవీలతకు క్షమాప ణలు చెప్పారు. పొరపాటున తాను పరుషంగా వ్యాఖ్యానించానని చెప్పారు. అయితే.. అప్పటి వరకు ప్రసాంతంగానే సాగిపోయినా.. తర్వాత ఏపీకి చెందిన ఓ పార్టీ కీలక నేత ఒకరు రంగంలోకి దిగి.. జేసీపై కేసు పెట్టేందుకు పురిగొల్పారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లోని సైబర్ క్రైం పోలీసులు భారతీయన న్యాయ సంహిత సెక్షన్లు 351, 352 కింద జేసీపై కేసు నమోదు చేశారు. ఇవి క్రిమినల్ చట్టాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై ఎఫ్ ఐఆర్ కూడా నమోదు కావడంతో పోలీసులు ఆయనకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన వివరణ తీసుకున్న తర్వాత.. అరెస్టు చేసినా చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on February 15, 2025 11:55 am
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…