స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను పక్కన పెట్టింది. ఇక నుంచి ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా న్యాయ శాఖ కూడా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ చేసినట్టయింది.
ఇప్పటివరకు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఇది పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం అనుసరిస్తున్న నిబంధన. రాజ్యాంగంలో ఈ మేరకు ఎక్కడా ప్రత్యేక క్లాజ్ లేకపోవడం గమనార్హం. ఇదే నిబంధనను 1973 నుంచి ఉమ్మడిఏపీలోనూ అనుసరిస్తున్నారు. దీంతో చాలా మంది అభ్యర్థులు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతున్నారు.
దీనిపై గ్రామీణ స్థాయిలో ఎప్పటికప్పుడు.. చర్చ జరుగుతూనే ఉంది. అయితే.. దీనిని సవరించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా.. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగానే గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై స్వల్పకాలిక చర్చ చేపట్టి సభలో ఆమోదించారు. అనంతరం.. ప్రభుత్వం ఈ విషయాన్ని న్యాయశాఖకు రిఫర్ చేసింది. దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా.. నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పగించారు.
దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన న్యాయ శాఖ.. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. ఏపీలో వచ్చే 2026-27లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పోటీ చేసేందుకు అర్హత లభించనుంది.
This post was last modified on February 14, 2025 12:34 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…