స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను పక్కన పెట్టింది. ఇక నుంచి ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా న్యాయ శాఖ కూడా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ చేసినట్టయింది.
ఇప్పటివరకు.. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఇది పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం అనుసరిస్తున్న నిబంధన. రాజ్యాంగంలో ఈ మేరకు ఎక్కడా ప్రత్యేక క్లాజ్ లేకపోవడం గమనార్హం. ఇదే నిబంధనను 1973 నుంచి ఉమ్మడిఏపీలోనూ అనుసరిస్తున్నారు. దీంతో చాలా మంది అభ్యర్థులు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతున్నారు.
దీనిపై గ్రామీణ స్థాయిలో ఎప్పటికప్పుడు.. చర్చ జరుగుతూనే ఉంది. అయితే.. దీనిని సవరించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా.. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగానే గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై స్వల్పకాలిక చర్చ చేపట్టి సభలో ఆమోదించారు. అనంతరం.. ప్రభుత్వం ఈ విషయాన్ని న్యాయశాఖకు రిఫర్ చేసింది. దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా.. నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పగించారు.
దీనిపై సమగ్ర అధ్యయనం చేసిన న్యాయ శాఖ.. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. ఏపీలో వచ్చే 2026-27లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పోటీ చేసేందుకు అర్హత లభించనుంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…