Political News

‘సైబర్ క్రైమ్’కు పృథ్వీరాజ్.. ఇంటరెస్టింగ్ కామెంట్స్

సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఫోన్ మెసేజ్ లతో వైసీపీ యాక్టివిస్టులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ యాక్టివిస్టులపై ఫిర్యాదు చేసినట్టు ఆయన ఆ తర్వాత వెల్లడించారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. 11 నెంబర్ వింటేనే వైసీపీ నేతలు హడలిపోతున్నారని ఆయన అన్నారు. తానేమీ వైసీపీని ఉద్దేశించి 11 నెంబరును పలకలేదని తెలిపారు. తానేదో ఓ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన సందర్భంగా ఈ నెంబర్ ను గుర్తు చేసుకున్నానని తెలిపారు. తాను మద్దతు పలికిన క్రికెట్ జట్టులోని 11 మంది క్రీడాకారుడు మంచిగా ఆడారని కూడా ఆయన అన్నారు. అయినా వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయాలంటే తనకు సినిమా ఈవెంట్లు అవసరం లేదని, వేరే వేదికల మీదే ఆ వ్యాఖ్యలు చేయగలనని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే… టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా పృథ్వీరాజ్… 150 గొర్రెలని, చివరలో 11 గొర్రెలే మిగిలాయని సెటైరిక్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు విన్నంతనే వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పృథ్వీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టాయి. ఇక విశ్వక్ సేన్ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ… ఆసుపత్రి నుంచే నేరుగా సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కట్టిన హ్యాండ్ బ్యాండేజీలతోనే పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చారు.

This post was last modified on February 12, 2025 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

3 minutes ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

29 minutes ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

2 hours ago

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

3 hours ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

3 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

4 hours ago