Political News

విశాఖలో విసారెడ్డి విరాళాల దందా: ఉమ

కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా విపత్తు సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా విరాళాలిస్తున్నారు.

ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అయితే, విశాఖలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత బలవంతపు విరాళాల వసూళ్లకు పాల్పడుతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి.

విశాఖలోని పలువురు పారిశ్రామిక వేత్తలకు సదరు నేత, ఆయన అనుచరులు ఫోన్లు చేసి మరీ విరాళాలు ఇవ్వవలసిందేనని ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫలానా సంవత్సరం ఇంత మొత్తం ఆదాయపు పన్ను కట్టారు కదా…అంటూ లెక్కలతో సహా చందాల దందా నడుస్తోందని కథనాలు వచ్చాయి. నెల రోజులుగా వ్యాపారాలు లేవని…ఇప్పటికే తోచినంత విరాళం ఇచ్చామని చెబుతున్నా….వేరే ఏదో ఒక పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

పేదలందరికీ సాయం చేసేందుకు రూ.15 కోట్లు అవసరమని, ఆ ‘టార్గెట్‌’ రీచ్ కావాలంటే విరాళాలివ్వాల్సిందేనని…ఆ తర్వాత విరాళాలకు పన్ను మినహాయింపులు వస్తాయని కూడా ఉచిత సలహా ఇస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ కీలక వైసీపీ నేత ఎవరా అని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కథనాలలోని నేత ఎవరన్న సస్పెన్స్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెరదించారు.

విశాఖలో విరాళాల పేరిట చందాల దందాకు పాల్పడుతున్నది వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంటూ దేవినేని ఉమ పరోక్షంగా విమర్శించారు. విశాఖలో చందాల దందాలతో ట్రస్టులతో వ్యాపారవేత్తలని బెదిరించి కోట్లు కొల్లగొడుతున్నది విసా రెడ్డి అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి దేవినేని ఉమ పరోక్షంగా ట్వీట్ చేశారు.

తన సహచరుడు విసా రెడ్డి మీద చర్యలు తీసుకునే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. విశాఖని భాగస్వామ్య సదస్సులతో అంతర్జాతీయ పెట్టుబడులతో ప్రపంచపటం మీద గర్వంగా మాజీ సీఎం చంద్రబాబు గారు నిలబెట్టారని ఉమ అన్నారు. ప్రభుత్వానికి వలసకూలీలు, కార్మికులు, పేదవాడి ఆకలిపరుగులు కనిపించడంలేదని, మూడుపూటలా పేదవాడి ఆకలితీర్చిన అన్నక్యాంటీన్ లు రద్దుచేసిందని ఉమ విమర్శించారు.

తాడేపల్లి రాజప్రసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారు పేదవాడి ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేమిటో రికార్డెడ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పగలరా అంటూ ఉమ ప్రశ్నించారు. మరి, ఉమ ప్రశ్నలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారన్నది వేచి చూడాలి.

This post was last modified on April 29, 2020 4:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago