Political News

విశాఖలో విసారెడ్డి విరాళాల దందా: ఉమ

కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా విపత్తు సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా విరాళాలిస్తున్నారు.

ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అయితే, విశాఖలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత బలవంతపు విరాళాల వసూళ్లకు పాల్పడుతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి.

విశాఖలోని పలువురు పారిశ్రామిక వేత్తలకు సదరు నేత, ఆయన అనుచరులు ఫోన్లు చేసి మరీ విరాళాలు ఇవ్వవలసిందేనని ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫలానా సంవత్సరం ఇంత మొత్తం ఆదాయపు పన్ను కట్టారు కదా…అంటూ లెక్కలతో సహా చందాల దందా నడుస్తోందని కథనాలు వచ్చాయి. నెల రోజులుగా వ్యాపారాలు లేవని…ఇప్పటికే తోచినంత విరాళం ఇచ్చామని చెబుతున్నా….వేరే ఏదో ఒక పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

పేదలందరికీ సాయం చేసేందుకు రూ.15 కోట్లు అవసరమని, ఆ ‘టార్గెట్‌’ రీచ్ కావాలంటే విరాళాలివ్వాల్సిందేనని…ఆ తర్వాత విరాళాలకు పన్ను మినహాయింపులు వస్తాయని కూడా ఉచిత సలహా ఇస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ కీలక వైసీపీ నేత ఎవరా అని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కథనాలలోని నేత ఎవరన్న సస్పెన్స్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెరదించారు.

విశాఖలో విరాళాల పేరిట చందాల దందాకు పాల్పడుతున్నది వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంటూ దేవినేని ఉమ పరోక్షంగా విమర్శించారు. విశాఖలో చందాల దందాలతో ట్రస్టులతో వ్యాపారవేత్తలని బెదిరించి కోట్లు కొల్లగొడుతున్నది విసా రెడ్డి అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి దేవినేని ఉమ పరోక్షంగా ట్వీట్ చేశారు.

తన సహచరుడు విసా రెడ్డి మీద చర్యలు తీసుకునే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. విశాఖని భాగస్వామ్య సదస్సులతో అంతర్జాతీయ పెట్టుబడులతో ప్రపంచపటం మీద గర్వంగా మాజీ సీఎం చంద్రబాబు గారు నిలబెట్టారని ఉమ అన్నారు. ప్రభుత్వానికి వలసకూలీలు, కార్మికులు, పేదవాడి ఆకలిపరుగులు కనిపించడంలేదని, మూడుపూటలా పేదవాడి ఆకలితీర్చిన అన్నక్యాంటీన్ లు రద్దుచేసిందని ఉమ విమర్శించారు.

తాడేపల్లి రాజప్రసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారు పేదవాడి ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేమిటో రికార్డెడ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పగలరా అంటూ ఉమ ప్రశ్నించారు. మరి, ఉమ ప్రశ్నలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారన్నది వేచి చూడాలి.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

27 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

12 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago