Political News

విశాఖలో విసారెడ్డి విరాళాల దందా: ఉమ

కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా విపత్తు సమయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు సెలబ్రిటీలు స్వచ్ఛందంగా విరాళాలిస్తున్నారు.

ఎవరికి తోచినంత వారు సాయం చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అయితే, విశాఖలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత బలవంతపు విరాళాల వసూళ్లకు పాల్పడుతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో కథనాలు వెలువడ్డాయి.

విశాఖలోని పలువురు పారిశ్రామిక వేత్తలకు సదరు నేత, ఆయన అనుచరులు ఫోన్లు చేసి మరీ విరాళాలు ఇవ్వవలసిందేనని ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫలానా సంవత్సరం ఇంత మొత్తం ఆదాయపు పన్ను కట్టారు కదా…అంటూ లెక్కలతో సహా చందాల దందా నడుస్తోందని కథనాలు వచ్చాయి. నెల రోజులుగా వ్యాపారాలు లేవని…ఇప్పటికే తోచినంత విరాళం ఇచ్చామని చెబుతున్నా….వేరే ఏదో ఒక పేరు చెప్పి వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

పేదలందరికీ సాయం చేసేందుకు రూ.15 కోట్లు అవసరమని, ఆ ‘టార్గెట్‌’ రీచ్ కావాలంటే విరాళాలివ్వాల్సిందేనని…ఆ తర్వాత విరాళాలకు పన్ను మినహాయింపులు వస్తాయని కూడా ఉచిత సలహా ఇస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ కీలక వైసీపీ నేత ఎవరా అని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ కథనాలలోని నేత ఎవరన్న సస్పెన్స్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెరదించారు.

విశాఖలో విరాళాల పేరిట చందాల దందాకు పాల్పడుతున్నది వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంటూ దేవినేని ఉమ పరోక్షంగా విమర్శించారు. విశాఖలో చందాల దందాలతో ట్రస్టులతో వ్యాపారవేత్తలని బెదిరించి కోట్లు కొల్లగొడుతున్నది విసా రెడ్డి అని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి దేవినేని ఉమ పరోక్షంగా ట్వీట్ చేశారు.

తన సహచరుడు విసా రెడ్డి మీద చర్యలు తీసుకునే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. విశాఖని భాగస్వామ్య సదస్సులతో అంతర్జాతీయ పెట్టుబడులతో ప్రపంచపటం మీద గర్వంగా మాజీ సీఎం చంద్రబాబు గారు నిలబెట్టారని ఉమ అన్నారు. ప్రభుత్వానికి వలసకూలీలు, కార్మికులు, పేదవాడి ఆకలిపరుగులు కనిపించడంలేదని, మూడుపూటలా పేదవాడి ఆకలితీర్చిన అన్నక్యాంటీన్ లు రద్దుచేసిందని ఉమ విమర్శించారు.

తాడేపల్లి రాజప్రసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారు పేదవాడి ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేమిటో రికార్డెడ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పగలరా అంటూ ఉమ ప్రశ్నించారు. మరి, ఉమ ప్రశ్నలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారన్నది వేచి చూడాలి.

This post was last modified on April 29, 2020 4:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

23 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

2 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

4 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

11 hours ago