అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కాబట్టి సమావేశాలకు తాను హాజరు కావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల మీడియా సమావేశం పెట్టిన జగన్..
మీడియా ముందు మాట్లాడినంత సమయం తనకు అసెంబ్లీలో కూడా కావాలని…అలా సమయం ఇవ్వడం లేదు కాబట్టే సభకు వెళ్లడం లేదని తేల్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
సభలోని మొత్తం స్థానాలలో 10 శాతం..అంటే ఏపీ అసెంబ్లీ ప్రకారం కనీసం 18 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పేశారు. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని, వరుసగా 60 రోజుల పాటు అనుమతి లేకుండా శాసన సభకు డుమ్మా కొడితేఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190/4 లో స్పష్టంగా రాసుందని రఘురామ అన్నారు.
రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సభాపతి, ఉప సభాపతిపై ఉందని, చట్ట ప్రకారం తాము నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే, 60 రోజులు దాటిన తర్వాత కూడా సెలవులు కావాల్సి వస్తే సెలవు పొడిగింపు కోరుతూ మరో లెటర్ ఇవ్వాలని అన్నారు. కానీ,జగన్ అసలు ఒక్క లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
అయితే, ఇదే విషయంపై జగన్ ను ఓ విలేఖరి ప్రశ్నించగా..ఏం చేసుకుంటారో చేసుకోనీయబ్బా…అని జగన్ తనదైన శైలిలో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని రఘురామ గుర్తు చేశారు. జగన్ కు లీవ్ పెట్టే ఉద్దేశ్యం ఉందో లేదో తనకు తెలీదని అన్నారు.
This post was last modified on February 10, 2025 8:56 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…