అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కాబట్టి సమావేశాలకు తాను హాజరు కావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల మీడియా సమావేశం పెట్టిన జగన్..
మీడియా ముందు మాట్లాడినంత సమయం తనకు అసెంబ్లీలో కూడా కావాలని…అలా సమయం ఇవ్వడం లేదు కాబట్టే సభకు వెళ్లడం లేదని తేల్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
సభలోని మొత్తం స్థానాలలో 10 శాతం..అంటే ఏపీ అసెంబ్లీ ప్రకారం కనీసం 18 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పేశారు. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని, వరుసగా 60 రోజుల పాటు అనుమతి లేకుండా శాసన సభకు డుమ్మా కొడితేఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190/4 లో స్పష్టంగా రాసుందని రఘురామ అన్నారు.
రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సభాపతి, ఉప సభాపతిపై ఉందని, చట్ట ప్రకారం తాము నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే, 60 రోజులు దాటిన తర్వాత కూడా సెలవులు కావాల్సి వస్తే సెలవు పొడిగింపు కోరుతూ మరో లెటర్ ఇవ్వాలని అన్నారు. కానీ,జగన్ అసలు ఒక్క లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
అయితే, ఇదే విషయంపై జగన్ ను ఓ విలేఖరి ప్రశ్నించగా..ఏం చేసుకుంటారో చేసుకోనీయబ్బా…అని జగన్ తనదైన శైలిలో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని రఘురామ గుర్తు చేశారు. జగన్ కు లీవ్ పెట్టే ఉద్దేశ్యం ఉందో లేదో తనకు తెలీదని అన్నారు.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…