ఏపీ సీఎం చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. వీటిలో కొన్ని కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన, బీజేపీ నాయకులకు కూడా ఇచ్చారు. అయితే.. ఎన్నికలకుముందు ఆయా పార్టీల తరఫున బలంగా పోరాటం చేసిన వారికి.. వైసీపీపై పోరాడి కేసులు ఎదుర్కొన్న వారికి కీలక పదవులు కట్టబెట్టారు. అదేవిధంగా ఫైర్ బ్రాండ్స్గా పేరు తెచ్చు కున్నవారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, పార్టీ తరఫున, సామాజిక వర్గాల వారీగా పోరాటం చేసిన వారికి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇంకొన్ని రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూడా ఇచ్చారు. అయితే.. వారి వారి స్థాయిలు.. చేసిన పోరాటాలను బట్టి.. ఈపదవులు దక్కాయి. అయితే..ఇప్పుడు వీరికి ఇచ్చే జీతాల విషయంలోనూ అదే విధంగా ఫిక్స్ చేశారు. బాగా పనిచేసిన వారికి ఎలా అయితే.. కీలక పదవులు దక్కాయో.. వారికి అంతే మొత్తంలో చెల్లింపులు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.
మొత్తం నామినేటెడ్ పదవులను ఏ-బీ కేటగిరీలుగా విభజించారు. వీటిలో జనసేన దక్కించుకున్నవి, బీజేపీ దక్కించుకున్నవి కూడా ఉన్నాయి. ఇలా విభజించిన వారికి.. ఏ కేటగిరీలో ఉన్న వారికి లక్షా 25 వేల నికర జీతాన్ని ఫిక్స్ చేశారు. ఇక, బీ కేటగిరీలో ఉన్న పదవులకు నికరంగా 60 వేల చొప్పున ఫిక్స్ చేశారు. దీంతో బాగా పనిచేసిన వారు సంతోషిస్తున్నారు. తమకు తగిన గుర్తింపుతో పాటు వేతనం కూడా లభిస్తున్నట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇతర విషయాలైన.. భత్యాలు, రవాణా, గదుల అద్దె, సర్వెంట్లు, డ్రైవర్లు, కార్లు వంటి వాటి విషయంలో అందరికీ సమానంగా ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఏ కేటగిరిలో ఉన్నవారికి.. 2 లక్షల పైచిలుకు వస్తుంటే .. బీ కేటగిరీలో ఉన్నవాకి 1.93 లక్షలు వస్తున్నాయి. వేతనాల రూపంలో కొంత వ్యత్యాసం కనిపిస్తున్నా.. ఇతర భత్యాలు, అలవెన్సుల విషయంలో సమానంగా ఉండడంతో ఎవరినీ నొప్పించని విధంగా చంద్రబాబు లౌక్యం ప్రదర్శించారు. దీంతో నామినేటెడ్ పర్వంలో కీలక ఘట్టం ముగిసింది.
This post was last modified on February 10, 2025 8:16 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…