ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు… వెరసి జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఫై ఓ పెద్ద రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఇదే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాయల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. . తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై జనసేన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ పూర్తీ ఆయ్యేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ రాయల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ తరఫున ఆదివారం ఓ కీలక ప్రకటన జారీ అయ్యింది. ఈ ప్రకటనలో కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మాటతో రాయల్ ఫై విధించిన ఈ నిషేదాజ్ఞలు తాత్కాలికమేనని పార్టీ చెప్పినట్టు అయ్యింది. విచారణ పూర్తి కాగానే రాయల్ యధావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
రాయల్ ఫై రేగిన ఈ వివాదం నేపథ్యంలో.. పార్టీ శ్రేణులకు అధిష్టానం కీలక సూచనలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మాత్రమే దృష్ఠి సారించాలని … ఇతరత్రా విషయాలను ఏమాత్రం పట్టించుకోరాదని సూచించింది. సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేయాలని కూడా సూచించింది. అటు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఇటు పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉంచాలని కూడా స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
This post was last modified on February 10, 2025 9:58 am
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..?…
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం…
ఈ రోజుల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లకు వచ్చే జనం…
ఇండియన్ క్రికెట్లోనే ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్…
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను తప్పు చేసినట్టుగా ఒప్పేసుకున్నారు. జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం…