Political News

రాయల్ ఫై జనసేన విచారణ… కీలక ఆదేశాలు జారీ

ఓ మహిళతో వివాహేతర బంధం ఆమెతో ఆర్థికపరమైన సంబంధాలు.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు… వెరసి జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ ఫై ఓ పెద్ద రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఇదే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాయల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. . తనకు సంబంధించిన వీడియోలు ఎవరు విడుదల చేస్తున్నారో కనుక్కోవాలని… వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై జనసేన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విచారణ పూర్తీ ఆయ్యేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ రాయల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ తరఫున ఆదివారం ఓ కీలక ప్రకటన జారీ అయ్యింది. ఈ ప్రకటనలో కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. విచారణను నిస్పక్షపాతంగా చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మాటతో రాయల్ ఫై విధించిన ఈ నిషేదాజ్ఞలు తాత్కాలికమేనని పార్టీ చెప్పినట్టు అయ్యింది. విచారణ పూర్తి కాగానే రాయల్ యధావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

రాయల్ ఫై రేగిన ఈ వివాదం నేపథ్యంలో.. పార్టీ శ్రేణులకు అధిష్టానం కీలక సూచనలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై మాత్రమే దృష్ఠి సారించాలని … ఇతరత్రా విషయాలను ఏమాత్రం పట్టించుకోరాదని సూచించింది. సమాజానికి ఉపయోగపడని వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేయాలని కూడా సూచించింది. అటు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఇటు పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉంచాలని కూడా స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

This post was last modified on February 10, 2025 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

37 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

45 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago