శనివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. జనసేనకు చెందిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్.. నగరానికి చెందిన ఓ మహిళతో సాగించిన వివాహేతర సంబంధం, ఆ మహిళ నుంచి ఆయన తీసుకున్న డబ్బు, బంగారం తదితరాలపై.. బాధిత మహిళ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినంతనే.. ఈ వ్యవహారంపై రచ్చ మొదలైంది. ప్రత్యేకించి వైసీపీ శ్రేణులు ఈ వీడియోను క్షణాల్లో వైరల్ చేసేశారు. అంతేకాకుండా… ఈ వ్యవహారానికి సంబంధిన మరిన్ని వీడియోలు బయటకు తీస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పెడుతూ సాగుతున్నారు. వెరసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే రచ్చ సాగుతోంది.
తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళతో కిరణ్ ఏళ్ల తరబడి వివాహేతర సంబంధాన్ని నెరిపారు. ఈ విషయాన్నీ ఇటు బాధిత మహిళతో పాటుగా అటు కిరణ్ కూడా ధృవీకరించారు. అయితే లక్ష్మి నుంచి కిరణ్ విడతలవారీగా రూ.1.20 కోట్లు తీసుకున్నారని.. ఆ సొమ్మును ఆయన తనకు తిరిగి ఇవ్వడం లేదని లక్ష్మి ఆరోపిస్తున్నారు, అయితే… అందులో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చానని… ఇంకొంత ఇవ్వాల్సి ఉందని కిరణ్ తప్పుకున్నట్టుగా వీడియోలు చెబుతున్నాయి. ఈ మొత్తం కోసం లక్ష్మి అడగగా.. కిరణ్ ఆమెపై బెదిరింపులకు దిగారని సమాచారం. అంతేకాకుండా లక్ష్మితో సంబంధాన్ని కొనసాగిస్తూనే.. ఇంకో మహిళతో కిరణ్ సన్నిహితంగా మెలుగుతున్న వైనాన్ని తెలుసుకున్న లక్ష్మి.. ఆయనను నిలదీయడంతో ఈ వివాదం రచ్చకెక్కినట్టుగా తెలుస్తోంది. కారణం ఏదైనా… కిరణ్ ఫై సోషల్ మీడియాలో ఓ రేంజిలో రచ్చ సాగుతోంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ పెద్దగా ఎవరికీ టార్గెట్ కాలేదనే చెప్పాలి. అయితే.. ఎన్నికల్లో కూటమి గెలవకపోతే… విశాఖ నుంచి తిరుపతి దాకా జగన్ ఫ్లెక్సీలు కడతానంటూ ఓ ప్రకటన చేసిన రాయల్ అందరి దృష్టిని ఆకర్షించారు. కిరణ్ చెప్పినట్టుగానే కూటమి విజయం సాధించడంతో… తిరుపతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో వైసీపీని కిరణ్ మరింతగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా వైసీపీకి కూడా కిరణ్ మూకుమ్మడిగా టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ఓ మహిళతో వివాదం.. అది కూడా వివాహేతర సంభంధం, ఆపై ఆమె వద్ద భారీ ఎత్తున డబ్బు తీసుకుని బెదిరింపులకు దిగిన వీడియోలు దొరకడంతో… కిరణ్ ను వైసీపీ ఓ రేంజిలో టార్గెట్ చేసింది. ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందోనన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
This post was last modified on February 9, 2025 1:54 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…