శనివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. జనసేనకు చెందిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్.. నగరానికి చెందిన ఓ మహిళతో సాగించిన వివాహేతర సంబంధం, ఆ మహిళ నుంచి ఆయన తీసుకున్న డబ్బు, బంగారం తదితరాలపై.. బాధిత మహిళ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినంతనే.. ఈ వ్యవహారంపై రచ్చ మొదలైంది. ప్రత్యేకించి వైసీపీ శ్రేణులు ఈ వీడియోను క్షణాల్లో వైరల్ చేసేశారు. అంతేకాకుండా… ఈ వ్యవహారానికి సంబంధిన మరిన్ని వీడియోలు బయటకు తీస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పెడుతూ సాగుతున్నారు. వెరసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే రచ్చ సాగుతోంది.
తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళతో కిరణ్ ఏళ్ల తరబడి వివాహేతర సంబంధాన్ని నెరిపారు. ఈ విషయాన్నీ ఇటు బాధిత మహిళతో పాటుగా అటు కిరణ్ కూడా ధృవీకరించారు. అయితే లక్ష్మి నుంచి కిరణ్ విడతలవారీగా రూ.1.20 కోట్లు తీసుకున్నారని.. ఆ సొమ్మును ఆయన తనకు తిరిగి ఇవ్వడం లేదని లక్ష్మి ఆరోపిస్తున్నారు, అయితే… అందులో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చానని… ఇంకొంత ఇవ్వాల్సి ఉందని కిరణ్ తప్పుకున్నట్టుగా వీడియోలు చెబుతున్నాయి. ఈ మొత్తం కోసం లక్ష్మి అడగగా.. కిరణ్ ఆమెపై బెదిరింపులకు దిగారని సమాచారం. అంతేకాకుండా లక్ష్మితో సంబంధాన్ని కొనసాగిస్తూనే.. ఇంకో మహిళతో కిరణ్ సన్నిహితంగా మెలుగుతున్న వైనాన్ని తెలుసుకున్న లక్ష్మి.. ఆయనను నిలదీయడంతో ఈ వివాదం రచ్చకెక్కినట్టుగా తెలుస్తోంది. కారణం ఏదైనా… కిరణ్ ఫై సోషల్ మీడియాలో ఓ రేంజిలో రచ్చ సాగుతోంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ పెద్దగా ఎవరికీ టార్గెట్ కాలేదనే చెప్పాలి. అయితే.. ఎన్నికల్లో కూటమి గెలవకపోతే… విశాఖ నుంచి తిరుపతి దాకా జగన్ ఫ్లెక్సీలు కడతానంటూ ఓ ప్రకటన చేసిన రాయల్ అందరి దృష్టిని ఆకర్షించారు. కిరణ్ చెప్పినట్టుగానే కూటమి విజయం సాధించడంతో… తిరుపతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో వైసీపీని కిరణ్ మరింతగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా వైసీపీకి కూడా కిరణ్ మూకుమ్మడిగా టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ఓ మహిళతో వివాదం.. అది కూడా వివాహేతర సంభంధం, ఆపై ఆమె వద్ద భారీ ఎత్తున డబ్బు తీసుకుని బెదిరింపులకు దిగిన వీడియోలు దొరకడంతో… కిరణ్ ను వైసీపీ ఓ రేంజిలో టార్గెట్ చేసింది. ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందోనన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
This post was last modified on February 9, 2025 1:54 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…