వైస్సార్సీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని శనివారం న్యూటన్ థియరీతో ఓ రేంజిలో ఫైర్ అయిపోయిన సంగతి తెలిసిందే. తనపైనా, తన కుటుంబ సభ్యుల పైనా అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే గా ఉన్న టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఆమె ఒంటికాలిపై లేచిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా అధికారుల పైన కూడా రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అందరికి బదులు ఇచ్చి తీరతామని హెచ్చరికలు జారీ చేశారు.
రజిని వ్యాఖ్యలు విన్నంతనే,…ప్రత్తిపాటి ఆగ్రహోదగ్రులయ్యారు.మహిళ అని చెప్పుకుంటున్న రజిని.. ఓ మహిళగా ప్రవర్తిస్తున్నారా అంటూ రివర్స్ ఎటాక్ చేశారు. రజిని వ్యాఖ్యలపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రత్తిపాటి… చిలకలూరిపేటకు, బీసీలకు రజిని చేసింది తీరని అన్యాయమేనని ఆరోపించారు. ఐదేళ్లకే దిక్కులేని రజినీకి 30 ఏళ్ల రాజకీయం సాధ్యమేనా అని కూడా ఆయన ప్రశ్నిచారు. అన్నేసి ఏళ్లు రజిని అసలు రాజకీయాల్లో ఉంటారా? అని ఆయన ఎద్దేవా చేశారు.
ఆ తర్వాత రజినీని మరింతగా టార్గెట్ చేసిన ప్రత్తిపాటి… ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”ఓటేసిన ప్రజలను మోసం చేశావు. నమ్ముకుని పనిచేసిన నాయకుల్ని మోసం చేశావు. 2019 ఎన్నికల్లో నాన్న, బాబాయ్ అని పిలిచి వాళ్ళిద్దర్నీ మోసం చేసావు. తీరా ఇక్కడ ఓడిపోతావు అని తెలిసి వీళ్ళందర్నీ గాలికి వదిలేసి గుంటూరు పారిపోయావు. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక బీసీని, ఒక మహిళని అని మాట్లాడుతున్నావు. సమాజంలో ఎంతో గౌరవంగా బతికే బీసీలు చేసే పనేనా నువ్వు చేసేది? గౌరవనీయ మహిళగా మహిళలు చేసే పనులేనా నువ్వు చేసింది? నువ్వు అసలు మహిళవేనా?” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలుచేశారు.
This post was last modified on February 9, 2025 11:30 am
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…