Political News

వైసీపీలో ‘నా కార్యకర్తలు- నా కుటుంబం’

రాజకీయాల్లో వైసీపీది సరికొత్త పంథా. ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా.. ఈ మాట అక్షర సత్యం. గడపగడపకు వైసీపీ కార్యక్రమం ఆ పార్టీకి ఎంతగా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైసీపీకి ఏకంగా అధికారాన్ని కట్టబెట్టింది. ఎప్పుడైతే అధికారం చేతికి అందిందో… ఇక తమకు తిరుగే లేదన్నట్టుగా జగన్, ఆయన అనుచర వర్గం వ్యవహరించిన తీరు వైసీపీని గద్దె దించింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా ఆ పార్టీకి దక్కకుండా చేసింది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు జగన్ తో పాటు వైసీపీ శ్రేణులను షాక్ కు గురి చేశాయి. జగన్ కు అయితే నోటా మాట రాలేదు. ఎదో కారణం చెప్పాలి కాబట్టి ఈవీఎం ల మీద నెపం వేసిన జగన్… ఓటమిని జీర్ణించుకునేందుకు చాలా సమయాన్నే తీసుకున్నారు. ఇప్పటికి కూడా జగన్ ఓటమి నుంచి తేరుకోలేదనే చెప్పాలి. అయితే.. ఎంతోకాలం దాక్కుని రాజకీయాలు చేయలేరు కదా. అందుకే ఓటమికి కారణాలను వెలికితీసిన జగన్… కార్యకర్తలను పట్టించుకోని కారణంగానే ఎన్నికల్లో ఓటమి తప్పలేదన్న నిజాన్ని గ్రహించారు. ఈ తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఓ సరికొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.

‘నా కార్యకర్తలు – నా కుటుంబం’ పేరిట జగన్ రూపుదిద్దిన కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం తన పరిధిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా.. పార్టీలో గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల కార్యకర్తలు ఒకింత ఇబ్బంది పడ్డారని ఆయన ఒప్పుకున్నారు. అయితే… ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడేందుకే ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో తమకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా నింపుతామని రాజా చెప్పారు.

This post was last modified on February 8, 2025 10:23 pm

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

1 hour ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

10 hours ago