Political News

వైసీపీలో ‘నా కార్యకర్తలు- నా కుటుంబం’

రాజకీయాల్లో వైసీపీది సరికొత్త పంథా. ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా.. ఈ మాట అక్షర సత్యం. గడపగడపకు వైసీపీ కార్యక్రమం ఆ పార్టీకి ఎంతగా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వైసీపీకి ఏకంగా అధికారాన్ని కట్టబెట్టింది. ఎప్పుడైతే అధికారం చేతికి అందిందో… ఇక తమకు తిరుగే లేదన్నట్టుగా జగన్, ఆయన అనుచర వర్గం వ్యవహరించిన తీరు వైసీపీని గద్దె దించింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా ఆ పార్టీకి దక్కకుండా చేసింది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు జగన్ తో పాటు వైసీపీ శ్రేణులను షాక్ కు గురి చేశాయి. జగన్ కు అయితే నోటా మాట రాలేదు. ఎదో కారణం చెప్పాలి కాబట్టి ఈవీఎం ల మీద నెపం వేసిన జగన్… ఓటమిని జీర్ణించుకునేందుకు చాలా సమయాన్నే తీసుకున్నారు. ఇప్పటికి కూడా జగన్ ఓటమి నుంచి తేరుకోలేదనే చెప్పాలి. అయితే.. ఎంతోకాలం దాక్కుని రాజకీయాలు చేయలేరు కదా. అందుకే ఓటమికి కారణాలను వెలికితీసిన జగన్… కార్యకర్తలను పట్టించుకోని కారణంగానే ఎన్నికల్లో ఓటమి తప్పలేదన్న నిజాన్ని గ్రహించారు. ఈ తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఓ సరికొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు.

‘నా కార్యకర్తలు – నా కుటుంబం’ పేరిట జగన్ రూపుదిద్దిన కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లో ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం తన పరిధిలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా.. పార్టీలో గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల కార్యకర్తలు ఒకింత ఇబ్బంది పడ్డారని ఆయన ఒప్పుకున్నారు. అయితే… ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడేందుకే ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో తమకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా నింపుతామని రాజా చెప్పారు.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

45 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago