Political News

జైలుకెళితే సీఎం అయినట్టే… ఢిల్లీలో కుదర్లేదు

క్రియాశీలక రాజకీయాల్లో ఉన్ననేతలు జైలుకు వెళ్ళారా?.. ఇక వారికి రాజయోగం పట్టినట్టేనని తెలుగు నేల అనుహావాలు చెబుతున్నాయి. ఈ మాట నిజమేనని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనూ రుజువు అయ్యింది. ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా సీఎం కుర్చీల్లో కూర్చున్నారు. అయితే.. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. ఢిల్లీ లో ఇది వర్క్ అవుట్ కాలేదు.

అవినీతి కేసుల్లో ఇటీవలే అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజా ఎన్నికల్లో సీఎం కాలేకపోయారు. అంతేకాదండోయ్.. జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాగా.. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీ జెడ్పీ నేత పర్వేశ్ వర్మ చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తెలుగు నేలలో కొనసాగిన సంప్రదాయం ఢిల్లీలో పని చేయలేదు.

ఇదిలా ఉంటే… అధికారంలో ఉంటూ జైలుకు వెళ్లిన కేజ్రీ ఎన్నికల్లో ఓడిపోగా… ఆయనతో పాటుగా.. జైలుకు వెళ్లిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేన్ద్ర జైన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో కేజ్రీ జైలుకు వెళ్లగా,.. ఆయన స్థానంలో సీఎం పదవి చేపట్టిన ఆతిశి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా… చివరి రౌండ్లలో పుంజుకుని ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వెరసి జైలుకు వెళ్లిన నేతలంతా సీఎంలు పీఎంలు అయిపోతారన్న మాటలు ఇకపై చెల్లవని చెప్పాలి.

This post was last modified on February 8, 2025 4:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago