క్రియాశీలక రాజకీయాల్లో ఉన్ననేతలు జైలుకు వెళ్ళారా?.. ఇక వారికి రాజయోగం పట్టినట్టేనని తెలుగు నేల అనుహావాలు చెబుతున్నాయి. ఈ మాట నిజమేనని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనూ రుజువు అయ్యింది. ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా సీఎం కుర్చీల్లో కూర్చున్నారు. అయితే.. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. ఢిల్లీ లో ఇది వర్క్ అవుట్ కాలేదు.
అవినీతి కేసుల్లో ఇటీవలే అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజా ఎన్నికల్లో సీఎం కాలేకపోయారు. అంతేకాదండోయ్.. జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాగా.. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీ జెడ్పీ నేత పర్వేశ్ వర్మ చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తెలుగు నేలలో కొనసాగిన సంప్రదాయం ఢిల్లీలో పని చేయలేదు.
ఇదిలా ఉంటే… అధికారంలో ఉంటూ జైలుకు వెళ్లిన కేజ్రీ ఎన్నికల్లో ఓడిపోగా… ఆయనతో పాటుగా.. జైలుకు వెళ్లిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేన్ద్ర జైన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో కేజ్రీ జైలుకు వెళ్లగా,.. ఆయన స్థానంలో సీఎం పదవి చేపట్టిన ఆతిశి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా… చివరి రౌండ్లలో పుంజుకుని ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వెరసి జైలుకు వెళ్లిన నేతలంతా సీఎంలు పీఎంలు అయిపోతారన్న మాటలు ఇకపై చెల్లవని చెప్పాలి.
This post was last modified on February 8, 2025 4:36 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…