క్రియాశీలక రాజకీయాల్లో ఉన్ననేతలు జైలుకు వెళ్ళారా?.. ఇక వారికి రాజయోగం పట్టినట్టేనని తెలుగు నేల అనుహావాలు చెబుతున్నాయి. ఈ మాట నిజమేనని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనూ రుజువు అయ్యింది. ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా సీఎం కుర్చీల్లో కూర్చున్నారు. అయితే.. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. ఢిల్లీ లో ఇది వర్క్ అవుట్ కాలేదు.
అవినీతి కేసుల్లో ఇటీవలే అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజా ఎన్నికల్లో సీఎం కాలేకపోయారు. అంతేకాదండోయ్.. జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాగా.. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీ జెడ్పీ నేత పర్వేశ్ వర్మ చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తెలుగు నేలలో కొనసాగిన సంప్రదాయం ఢిల్లీలో పని చేయలేదు.
ఇదిలా ఉంటే… అధికారంలో ఉంటూ జైలుకు వెళ్లిన కేజ్రీ ఎన్నికల్లో ఓడిపోగా… ఆయనతో పాటుగా.. జైలుకు వెళ్లిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేన్ద్ర జైన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో కేజ్రీ జైలుకు వెళ్లగా,.. ఆయన స్థానంలో సీఎం పదవి చేపట్టిన ఆతిశి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా… చివరి రౌండ్లలో పుంజుకుని ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వెరసి జైలుకు వెళ్లిన నేతలంతా సీఎంలు పీఎంలు అయిపోతారన్న మాటలు ఇకపై చెల్లవని చెప్పాలి.
This post was last modified on February 8, 2025 4:36 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…