క్రియాశీలక రాజకీయాల్లో ఉన్ననేతలు జైలుకు వెళ్ళారా?.. ఇక వారికి రాజయోగం పట్టినట్టేనని తెలుగు నేల అనుహావాలు చెబుతున్నాయి. ఈ మాట నిజమేనని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… చివరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనూ రుజువు అయ్యింది. ఈ ముగ్గురు నేతలు జైలుకు వెళ్లి వచ్చాక నేరుగా సీఎం కుర్చీల్లో కూర్చున్నారు. అయితే.. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. ఢిల్లీ లో ఇది వర్క్ అవుట్ కాలేదు.
అవినీతి కేసుల్లో ఇటీవలే అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజా ఎన్నికల్లో సీఎం కాలేకపోయారు. అంతేకాదండోయ్.. జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీ కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాగా.. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీ జెడ్పీ నేత పర్వేశ్ వర్మ చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తెలుగు నేలలో కొనసాగిన సంప్రదాయం ఢిల్లీలో పని చేయలేదు.
ఇదిలా ఉంటే… అధికారంలో ఉంటూ జైలుకు వెళ్లిన కేజ్రీ ఎన్నికల్లో ఓడిపోగా… ఆయనతో పాటుగా.. జైలుకు వెళ్లిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేన్ద్ర జైన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో కేజ్రీ జైలుకు వెళ్లగా,.. ఆయన స్థానంలో సీఎం పదవి చేపట్టిన ఆతిశి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా… చివరి రౌండ్లలో పుంజుకుని ఎమ్మెల్యే గా విజయం సాధించారు. వెరసి జైలుకు వెళ్లిన నేతలంతా సీఎంలు పీఎంలు అయిపోతారన్న మాటలు ఇకపై చెల్లవని చెప్పాలి.
This post was last modified on February 8, 2025 4:36 pm
అక్కినేని నాగచైతన్య కెరీర్లో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన చిత్రం.. తండేల్. చైతూ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ.. ఈ సినిమా…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్ళ అనంతరం ఢిల్లీ గడ్డపై…
కేకే సర్వే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం నోళ్ళలో బాగా నానిన పేరిది. అటు లోక్ సభ ఫలితాలతో…
నిన్న విడుదలైన తండేల్ గురించి కొంత మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా మంచి వసూళ్లతో ఓపెనైన వైనం స్పష్టంగా…
విదేశీ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన తాజా…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్…