కేకే సర్వే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం నోళ్ళలో బాగా నానిన పేరిది. అటు లోక్ సభ ఫలితాలతో పాటుగా ఇటు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేయడంలో ఈ సంస్థ సత్తా చాటింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. సీట్లతో పాటుగా ఏ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని సీట్లు.. ఏ ఏ పార్టీలకు వస్తాయన్న విషయాన్నీ కూడా ఈ సంస్థ ముందే చెప్పేసింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చాలా మంది నమ్మలేదు. ఇదేదో టీడీపీ, జనసేనలకు అనుకూలంగా పని చేస్తున్న సంస్థ అంటూ దీనిపై చాలా మంది ఓ ముద్ర వేశారు. 151 సెట్లు ఉన్న వైసీపీకి 10-15 సీట్లు ఏమిటంటూ అంతా పెదవి విరిచారు. కేకే సంస్థ ఎగ్జిట్ పోల్స్ శుద్ధ అబద్దమని కూడా నమ్మారు. అయితే… ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేకే సంస్థ పేరు తలచుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
అలంటి మంచి పేరున్న కేకే సంస్థ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తేలిపోయాయి. కేకే సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో అధికార ఆప్ 44 సీట్లు దక్కించుకుని తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పింది. అదే సమయంలో విపక్ష బీజేపీ.. కేవలం 26 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పింది. అయితే… నేడు విడుదల అయినా ఫలితాలు కేకే సర్వే అంచనాలు తప్పని తేల్చాయి. అధికార ఆప్ 23 సీట్లకు పరిమితం కాగా… బీజేపీ రికార్డు విక్టరీ కొట్టి ఏకంగా 47 సీట్లు దక్కించుకుంది. ఈ రెండు పార్టీల విషయంలో కేకే సర్వే అంచనా తప్పినా.. కాంగ్రెస్ కు సింగల్ సీటు కూడా రాదని కేకే సర్వే చెప్పిన మాట మాత్రం నిజమేనని తేలింది.
This post was last modified on February 8, 2025 4:29 pm
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ…
వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఎన్నికలు పూర్తయి ఏడాది అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. నోరు…
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…