కేకే సర్వే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం నోళ్ళలో బాగా నానిన పేరిది. అటు లోక్ సభ ఫలితాలతో పాటుగా ఇటు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పక్కాగా అంచనా వేయడంలో ఈ సంస్థ సత్తా చాటింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. సీట్లతో పాటుగా ఏ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని సీట్లు.. ఏ ఏ పార్టీలకు వస్తాయన్న విషయాన్నీ కూడా ఈ సంస్థ ముందే చెప్పేసింది. కేకే సర్వే చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చాలా మంది నమ్మలేదు. ఇదేదో టీడీపీ, జనసేనలకు అనుకూలంగా పని చేస్తున్న సంస్థ అంటూ దీనిపై చాలా మంది ఓ ముద్ర వేశారు. 151 సెట్లు ఉన్న వైసీపీకి 10-15 సీట్లు ఏమిటంటూ అంతా పెదవి విరిచారు. కేకే సంస్థ ఎగ్జిట్ పోల్స్ శుద్ధ అబద్దమని కూడా నమ్మారు. అయితే… ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కేకే సంస్థ పేరు తలచుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
అలంటి మంచి పేరున్న కేకే సంస్థ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తేలిపోయాయి. కేకే సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో అధికార ఆప్ 44 సీట్లు దక్కించుకుని తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని చెప్పింది. అదే సమయంలో విపక్ష బీజేపీ.. కేవలం 26 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పింది. అయితే… నేడు విడుదల అయినా ఫలితాలు కేకే సర్వే అంచనాలు తప్పని తేల్చాయి. అధికార ఆప్ 23 సీట్లకు పరిమితం కాగా… బీజేపీ రికార్డు విక్టరీ కొట్టి ఏకంగా 47 సీట్లు దక్కించుకుంది. ఈ రెండు పార్టీల విషయంలో కేకే సర్వే అంచనా తప్పినా.. కాంగ్రెస్ కు సింగల్ సీటు కూడా రాదని కేకే సర్వే చెప్పిన మాట మాత్రం నిజమేనని తేలింది.
This post was last modified on February 8, 2025 4:29 pm
నిన్న విడుదలైన తండేల్ గురించి కొంత మిశ్రమ స్పందన వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా మంచి వసూళ్లతో ఓపెనైన వైనం స్పష్టంగా…
విదేశీ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన తాజా…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఎగ్జిట్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ…