ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో చిరంజీవిది చెరగని స్థానమని పేర్కొన్నారు. ఆయన అనుభవాలు, సూచనలు, సలహాలు..తమకు ఎంతో అవసరమని కూడా పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హీరోలతో ప్రధాని వీడియో మాధ్యమంలో సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో `ప్రపంచ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్` సదస్సును నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల నుంచి స్వయంగా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన ప్రధాని.. దక్షిణాది సినీ రంగం దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాంటి సినీ రంగంలో 40 ఏళ్లు చిరు రారాజులా వెలుగుతున్నారని కొనియాడారు.
ఆయన నుంచి సలహాలు తీసుకునేందుకు దేశం ఎదురు చూస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిరంజీవి.. మోడీ నేతృత్వంలో నిర్వ హించనున్న సదస్సులో తాను భాగం కావడం.. తన సలహాలను ప్రధాని స్వీకరించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మోడీ అడ్వైజరీ బోర్డులో తనకు కూడా చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని కూడా.. చిరు ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదని చెప్పారు. కాగా.. కొన్నాళ్ల కిందట చిరంజీవి ప్రత్యేకంగా మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలుగు నటుల్లో చిరంజీవి, నాగార్జునలకు మాత్రమే అవకాశం చిక్కింది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…