ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో చిరంజీవిది చెరగని స్థానమని పేర్కొన్నారు. ఆయన అనుభవాలు, సూచనలు, సలహాలు..తమకు ఎంతో అవసరమని కూడా పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హీరోలతో ప్రధాని వీడియో మాధ్యమంలో సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో `ప్రపంచ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్` సదస్సును నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల నుంచి స్వయంగా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన ప్రధాని.. దక్షిణాది సినీ రంగం దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాంటి సినీ రంగంలో 40 ఏళ్లు చిరు రారాజులా వెలుగుతున్నారని కొనియాడారు.
ఆయన నుంచి సలహాలు తీసుకునేందుకు దేశం ఎదురు చూస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిరంజీవి.. మోడీ నేతృత్వంలో నిర్వ హించనున్న సదస్సులో తాను భాగం కావడం.. తన సలహాలను ప్రధాని స్వీకరించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మోడీ అడ్వైజరీ బోర్డులో తనకు కూడా చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని కూడా.. చిరు ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదని చెప్పారు. కాగా.. కొన్నాళ్ల కిందట చిరంజీవి ప్రత్యేకంగా మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలుగు నటుల్లో చిరంజీవి, నాగార్జునలకు మాత్రమే అవకాశం చిక్కింది.
This post was last modified on February 8, 2025 2:01 pm
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…
సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…