ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో చిరంజీవిది చెరగని స్థానమని పేర్కొన్నారు. ఆయన అనుభవాలు, సూచనలు, సలహాలు..తమకు ఎంతో అవసరమని కూడా పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హీరోలతో ప్రధాని వీడియో మాధ్యమంలో సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో `ప్రపంచ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్` సదస్సును నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల నుంచి స్వయంగా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన ప్రధాని.. దక్షిణాది సినీ రంగం దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాంటి సినీ రంగంలో 40 ఏళ్లు చిరు రారాజులా వెలుగుతున్నారని కొనియాడారు.
ఆయన నుంచి సలహాలు తీసుకునేందుకు దేశం ఎదురు చూస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిరంజీవి.. మోడీ నేతృత్వంలో నిర్వ హించనున్న సదస్సులో తాను భాగం కావడం.. తన సలహాలను ప్రధాని స్వీకరించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మోడీ అడ్వైజరీ బోర్డులో తనకు కూడా చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని కూడా.. చిరు ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదని చెప్పారు. కాగా.. కొన్నాళ్ల కిందట చిరంజీవి ప్రత్యేకంగా మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలుగు నటుల్లో చిరంజీవి, నాగార్జునలకు మాత్రమే అవకాశం చిక్కింది.
This post was last modified on February 8, 2025 2:01 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ…
అరవింద్ కేజ్రీవాల్... దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న…
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్…
రెండేళ్ల కిందట తమిళంలో లవ్ టుడే అనే చిన్న సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింద తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్…
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. 699 మంది అభ్యర్తులు..…