ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుకురిపించారు. దక్షిణాది సినీ రంగానికి చిరంజీవి ఐకాన్.. అని పేర్కొన్నారు. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో చిరంజీవిది చెరగని స్థానమని పేర్కొన్నారు. ఆయన అనుభవాలు, సూచనలు, సలహాలు..తమకు ఎంతో అవసరమని కూడా పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హీరోలతో ప్రధాని వీడియో మాధ్యమంలో సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో `ప్రపంచ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్ మెంట్` సదస్సును నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల నుంచి స్వయంగా ప్రధాని మోడీ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన ప్రధాని.. దక్షిణాది సినీ రంగం దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాంటి సినీ రంగంలో 40 ఏళ్లు చిరు రారాజులా వెలుగుతున్నారని కొనియాడారు.
ఆయన నుంచి సలహాలు తీసుకునేందుకు దేశం ఎదురు చూస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిరంజీవి.. మోడీ నేతృత్వంలో నిర్వ హించనున్న సదస్సులో తాను భాగం కావడం.. తన సలహాలను ప్రధాని స్వీకరించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మోడీ అడ్వైజరీ బోర్డులో తనకు కూడా చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని కూడా.. చిరు ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదని చెప్పారు. కాగా.. కొన్నాళ్ల కిందట చిరంజీవి ప్రత్యేకంగా మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలుగు నటుల్లో చిరంజీవి, నాగార్జునలకు మాత్రమే అవకాశం చిక్కింది.
This post was last modified on February 8, 2025 2:01 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…