Political News

వర్మ నోట ఆ పదాలే వినిపించలేదట

నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనను తాను ఓ దర్శకుడిగానే నిరూపించుకున్నాడు. వైసీపీతో ఎంతగా అంటకాగుతున్నా కూడా తానూ ఓ సినిమా మనిషినేనని.. రాజకీయాల్లో ఆరితేరిన నేతను అయితే కాదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియా అసభ్య పోస్టుల వ్యవహారాల్లో శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సందర్బంగా ఆయన దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో 90 శాతం ప్రశ్నలకు వర్మ సమాధానాలు ఇచ్చారట.

హై ప్రొఫైల్ వ్యక్తులు సాధారణంగా విచారణలో పోలీసులకు పెద్దగా సహకరించరు. అదే సదరు హై ప్రొఫైల్ వ్యక్తులు రాజకీయ నేతలు అయితే… పోలీసులు తలలు పట్టుకోవాల్సిందే. విచారణకు హాజరయ్యే ముందు వైసీపీకి చెందిన చాలా మంది నేతలు ఆయనకు ధైర్యం చెప్పి మరీ పంపించారు. అయినా కూడా వర్మ తన తెలివితేటలను పోలీసుల వద్ద ప్రదర్శించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ సందర్బంగా చాలా మంది నేతలు చెప్పే ‘తెలియదు, గుర్తు లేదు, మరిచిపోయాను’ వంటి సమాధానాలు అస్సలే వినిపించలేదట.

అంతేకాదండోయి… చంద్రబాబు, లోకేష్, పవన్ లఫై అసభ్య పోస్టులు పెట్టింది తానేనని కూడా వర్మ ఒప్పుకున్నారట. తానూ తీసిన సినిమా ప్రమోషన్ లో భాగంగానే సదరు పోస్టులు పెట్టినట్టుగా వర్మ ఒప్పుకున్నారట. ఈ విషయంలో వైసీపీ నేతల ప్రమేయం ఏమీ లేదని కూడా ఆయన చెప్పారట. అయినా ఒకరు చెబితే తానూ వైన్ మనిషినేనా అన్నట్టుగా వర్మ సమాధానం ఇచ్చారట. ఇక వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని… ఆ కారణంగానే వారు తనను ఒంగోలు లో కలిశారని వర్మ చెప్పారట.

This post was last modified on February 8, 2025 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago