Political News

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ పథకం కింద… గుండె పోటు వచ్చిన పేదలకు చికిత్స అందేవరకు వారి ప్రాణాలను నిలబెట్టేలా సర్కారు చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా… గుండెపోటు వచ్చిన తోలి గంటలో రోగికి ఇవ్వాల్సిన టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఇంజక్షన్ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. ఇంత ఖరీదు చేసే ఇంజక్షన్ ను కూడా పేదలకు ఉచితంగానే ఇవ్వాలని చంద్రబాబు సర్కారు తీర్మానించింది.

ఇటీవలి కాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఓ స్థాయి ఆర్ధిక స్తొమత ఉన్న వారు అయితే ఫరవా లేదు గానీ.. పేదలకు గుండె పోటు వస్తే ప్రాణాంతకమే. సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలంటే…సమయం పడుతుంది. ఈ లోగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుండెపోటు వస్తే సకాలంలో చికిత్స అందితే… పెద్దగా ముప్పేమీ ఉండదు. అయితే ఆ చికిత్స సకాలంలో అందడమన్నది అన్ని ప్రాంతాలకు సాధ్యం అయ్యే పని కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ అత్యంత కీలకమని చెప్పాలి. ప్రభుత్వం ఈ ఇంజక్షన్ ను ఉచితంగానే అందిస్తే… పేదల ప్రాణాలకు భరోసా దక్కినట్టే.

సాధారణంగా గుండెపోటు వస్తే… క్షణాల్లో డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టమే. ఓ వైపు ఆర్ధిక స్తొమత, మరోవైపు ఆసుపత్రుల దూరాభారం పేదలకు ప్రాణాంతకంగా మారింది. ఈ పరిస్థితులపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గుండె పోటు వచ్చినా కూడా పేదలు భయపడకూడదన్న భావనతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. చంద్రబాబు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పేదల ఆరోగ్య పరిరక్షణలో ఓ కీలక మైలు రాయిగా పరిగణించవచ్చు. గుండెపోటు మరణాలు కూడా ఈ నిర్ణయం వల్ల భారీగా తగ్గుతాయని చెప్పాలి.

This post was last modified on February 7, 2025 6:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

12 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago