Political News

జగన్ కు సాయిరెడ్డి గట్టిగా ఇచ్చేశారుగా…!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలే ఎంపీ పదవితో పాటుగా… వైసీపీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై గురువారం నాటి మీడియా సమావేశంలో జగన్ స్పందించారు. పార్టీని వీడిన వారు తమ క్యారెక్టర్ ను పోగొట్టుకున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క సాయి రెడ్డికె కాకుండా పార్టీ మరీనా అందరికీ ఇదే వర్తిస్తుందని కూడా జగన్ అన్నారు.

జగన్ వ్యాఖ్యలపై సాయిరెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. “వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.” అంటూ సాయిరెడ్డి ఒకింత ఘాటుగానే జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. సాయి రెడ్డి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి జగన్, సాయిరెడ్డి ల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. వై ఎస్ ఫ్యామిలీతో సాయి రెడ్డికి ఏళ్ల తరబడి బంధాలు ఉన్నాయి. రాజారెడ్డి కాలం నుంచి సాయి రెడ్డి వై ఎస్ ఫ్యామిలీకి ఆడిటింగ్ సేవలు అందిస్తున్నారు. అదే క్రమంలో జగన్ కు కూడా సాయి రెడ్డి ఆడిటింగ్ సేవలు అందించారు. ఈ కారణంగానే జగన్ కేసుల్లో సాయి రెడ్డి కూడా సహా నిందితుడిగా ఉన్నారు. ఇద్దరూ ఒకేసారి జైల్లో కాలం వెళ్లదీశారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం… దానిపై జగన్ ఘాటుగా స్పందించడం… దానిపై సాయి రెడ్డి అంతకు మించిన ఘాటు వ్యాఖ్యలతో బదులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

This post was last modified on February 7, 2025 1:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

32 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago