వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి సీఐ వరకు ఉన్నారు. ఈ పరిణామాలతో మరోసారి వివేకా కేసు సంచలనంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా దారుణ హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే.
అయితే.. తాను బయటకు వచ్చిన తర్వాత.. జైల్లో ఉన్నప్పుడు కూడా. వేధించారంటూ కొందరిపై దస్తగిరి ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హయాంలో ఎవరూ ఈయన ఫిర్యాదులను స్వీకరించలేదు. పైగా అప్రూవర్గా మారిన దస్తగిరిని తక్షణమే జైలుకు పంపించాలని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించా రు. దీంతో అప్పట్లో తనకు న్యాయం జరగడం లేదని దస్తగిరి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక, ఇప్పుడు తాజాగా కూటమి సర్కారు హయాంలో దస్తగిరి మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తాజాగా నలుగురిపై కేసులు నమోదయ్యాయి. దస్తగిరిని బెదిరించడం.. చంపేస్తామని హెచ్చరించ డం, వేధింపులకు గురి చేయడం వంటి కారణాలతో సెక్షన్లు నమోదు చేశారు. ఆ వెంటనే పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో గత మూడేళ్లుగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం.
కేసులు వీరిపైనే..
This post was last modified on February 5, 2025 3:17 pm
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…