వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి సీఐ వరకు ఉన్నారు. ఈ పరిణామాలతో మరోసారి వివేకా కేసు సంచలనంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా దారుణ హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే.
అయితే.. తాను బయటకు వచ్చిన తర్వాత.. జైల్లో ఉన్నప్పుడు కూడా. వేధించారంటూ కొందరిపై దస్తగిరి ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హయాంలో ఎవరూ ఈయన ఫిర్యాదులను స్వీకరించలేదు. పైగా అప్రూవర్గా మారిన దస్తగిరిని తక్షణమే జైలుకు పంపించాలని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించా రు. దీంతో అప్పట్లో తనకు న్యాయం జరగడం లేదని దస్తగిరి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక, ఇప్పుడు తాజాగా కూటమి సర్కారు హయాంలో దస్తగిరి మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తాజాగా నలుగురిపై కేసులు నమోదయ్యాయి. దస్తగిరిని బెదిరించడం.. చంపేస్తామని హెచ్చరించ డం, వేధింపులకు గురి చేయడం వంటి కారణాలతో సెక్షన్లు నమోదు చేశారు. ఆ వెంటనే పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో గత మూడేళ్లుగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం.
కేసులు వీరిపైనే..
This post was last modified on February 5, 2025 3:17 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…