వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి సీఐ వరకు ఉన్నారు. ఈ పరిణామాలతో మరోసారి వివేకా కేసు సంచలనంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా దారుణ హత్య కేసులో ఆయన డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే.
అయితే.. తాను బయటకు వచ్చిన తర్వాత.. జైల్లో ఉన్నప్పుడు కూడా. వేధించారంటూ కొందరిపై దస్తగిరి ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హయాంలో ఎవరూ ఈయన ఫిర్యాదులను స్వీకరించలేదు. పైగా అప్రూవర్గా మారిన దస్తగిరిని తక్షణమే జైలుకు పంపించాలని కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించా రు. దీంతో అప్పట్లో తనకు న్యాయం జరగడం లేదని దస్తగిరి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక, ఇప్పుడు తాజాగా కూటమి సర్కారు హయాంలో దస్తగిరి మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తాజాగా నలుగురిపై కేసులు నమోదయ్యాయి. దస్తగిరిని బెదిరించడం.. చంపేస్తామని హెచ్చరించ డం, వేధింపులకు గురి చేయడం వంటి కారణాలతో సెక్షన్లు నమోదు చేశారు. ఆ వెంటనే పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో గత మూడేళ్లుగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం.
కేసులు వీరిపైనే..
This post was last modified on February 5, 2025 3:17 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…