కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పీకల్లోతు చిక్కుల్లో పడిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించి రికార్డులకెక్కిన సోనియా గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. అధికార పక్షం బీజేపీకి చెందిన 40 మంది ఎంపీలు మూకుమ్మడిగా ఆమెపై ఈ నోటీసులను ప్రతిపాదించారు. ఈ నోటీసుల ఆదారంగా సోనియాపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై సోనియా గాంధీ ఘాటుగా స్పందించారు. ఎన్డీఏ సర్కారు రాసి ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగాన్ని చదివేందుకు ముర్ము నానా తిప్పలు పడ్డారని సోనియా గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. అంతేకాకుండా ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావించిన ముర్ము ప్రసంగం సభ్యుల సహనాన్ని పరీక్షించేలా ఉందని కూడా ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై తొలుత రాష్ట్రపతి భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనియా వ్యాఖ్యలను నిరసిస్తూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.
తాజాగా సోనియా వ్యాఖ్యలపై బీజేపీ ఒకింత సీరియస్ గా స్పందించింది. దేశ ప్రథమ పౌరురాలిగా ఉన్న రాష్ట్రపతి ముర్ము ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేస్తారా? అంటూ సోనియాపై బీజేపీ కస్సుమంది. రాజ్యసభ సభ్యురాలిగా ఉండి కూడా రాష్ట్రపతి గౌరవ మర్యాదలపై అవగాహన లేకుండా ప్రవర్తించిన సోనియా సభా హక్కులను ఉల్లంఘించినట్టేనని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో సోనియాపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ చైర్మన్ కు 40 మంది బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే… రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్ అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేసిన తన కుమారుడు రాహుల్ గాంధీని వారించి సారీ చెప్పించిన సోనియా… ఇప్పుడు తాను ఈ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
This post was last modified on February 4, 2025 10:21 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…