Political News

జ‌గ‌న్ మాదిరి త‌ప్పించుకోం: నారా లోకేష్‌

మంత్రి నారా లోకేష్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ముఖ్య‌మంత్రి.. ఏపీ విధ్వంస‌కారి అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ పై ఆయ‌న నిప్పులు చెరిగారు. అంతేకాదు.. త‌ప్పులు చేసి.. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని.. వైసీపీ మంత్రులపై ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు. “ఆయ‌న‌(జ‌గ‌న్‌) లాగా మేం త‌ప్పులు చేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయం. మేం ఏదైనా త‌ప్పులు చేస్తే.. వాటిని గౌర‌వంగా అంగీక‌రిస్తాం. త‌ప్పులు స‌రిదిద్దుకునేందుకు మాకు మేం ప్ర‌య‌త్నం చేస్తాం. ఎవ‌రైనా వ‌చ్చి మీరు త‌ప్పు చేస్తున్నారు.. అని చెప్పినా కేసులు పెట్టం. పెట్టించం. వారు చెప్పే త‌ప్పుల‌ను లెక్క‌లు వేసుకుంటాం. స‌రిచేసుకుంటాం.” అని వ్యాఖ్యానించారు.

అంతిమంగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జ‌వాబు దారీగా ఉంటుంద‌ని నారా లోకేష్ చెప్పారు. కూట‌మిలో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌జ‌లకు బాధ్యులేన‌న్న ఆయ‌న‌.. ఎవ‌రూ స్వతంత్ర నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితి లేద‌న్నారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా మాట్లాడుకుని విధానప‌ర‌మైన నిర్ణ‌యాల‌పై ఒక విధానం పాటిస్తామ‌ని చెప్పారు. “గ‌తంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఒకే ఒక్క విధ్వంస‌కారుడు తీసుకున్న నిర్ణ‌యంతో అమ‌రావ‌తి ఆగిపోయింది. పెట్టుబ‌డి దారులు ప‌రార‌య్యారు. ఉద్యోగాలు రాలేదు. ఉపాధి లేదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమ‌య్యాయో కూడా తెలియ‌దు. అంతా అరాచ‌కం. మేం రాజ‌కీయాల కోసం ఈ మాట అన‌డం లేదు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. కాగ్ కూడా గ‌ణాంకాల‌తో స‌యితంగా వివ‌రించింది” అని లోకేష్ చెప్పుకొచ్చారు.

తాజాగా సోమ‌వారం సాయంత్రం రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు.. మంత్రి నారా లోకేష్‌ను క‌లుసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా క‌ళాశాల‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వారు విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ వారితో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే.. పాల‌న ప‌ట్టాలెక్కుతోంద‌న్నారు. రాష్ట్రంపై పెట్టుబ‌డి దారుల‌కు న‌మ్మ‌కం క‌లుగుతోంద‌ని తెలిపారు. విదేశీ విద్యార్థులు కూడా ఒక‌ప్పుడు ఏపీని వెతుక్కుని వ‌చ్చార‌ని.. కానీ, గ‌త ఐదేళ్ల విధ్వంస పాల‌న చూసిన త‌ర్వాత పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌ని చెప్పారు. త‌ప్పులు చేసి.. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేశార‌ని.. వాటిని చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం నిల‌బెడుతోంద‌న్నారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల విడుద‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేస్తార‌ని నారా లోకేష్ చెప్పారు. అన్ని విష‌యాల‌ను కూట‌మిలోని ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుని ఒక నిర్ణ‌యానికి వ‌స్తార‌ని తెలిపారు. తాను ఒక్క‌డినే ఒక నిర్ణ‌యం తీసుకుని.. త‌ర్వాత‌.. వేరే వారు మ‌రో నిర్ణ‌యం ప్ర‌క‌టించే సంస్కృతి.. నిరంకుశ విధానం కూట‌మి ప్ర‌భుత్వంలో ఉండ‌బోవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విష‌యంపైనైనా కూట‌మి ప్ర‌భుత్వంలోని మంత్రులు అంద‌రూ స‌మ‌ష్టిగా నిర్ణ‌యం తీసుకున్నాకే.. వెల్ల‌డిస్తామ‌ని.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమ‌ల్లో ఉన్నందున ఈ విష‌యంపై ఇంత‌క‌న్నా ఎక్కువ మాట్లాడ‌డం త‌గ‌ద‌ని వారికి చెప్పారు.

This post was last modified on February 4, 2025 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

2 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

2 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

8 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

10 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

10 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

11 hours ago