Political News

జ‌గ‌న్ మాదిరి త‌ప్పించుకోం: నారా లోకేష్‌

మంత్రి నారా లోకేష్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ముఖ్య‌మంత్రి.. ఏపీ విధ్వంస‌కారి అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ పై ఆయ‌న నిప్పులు చెరిగారు. అంతేకాదు.. త‌ప్పులు చేసి.. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని.. వైసీపీ మంత్రులపై ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేశారు. “ఆయ‌న‌(జ‌గ‌న్‌) లాగా మేం త‌ప్పులు చేసి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయం. మేం ఏదైనా త‌ప్పులు చేస్తే.. వాటిని గౌర‌వంగా అంగీక‌రిస్తాం. త‌ప్పులు స‌రిదిద్దుకునేందుకు మాకు మేం ప్ర‌య‌త్నం చేస్తాం. ఎవ‌రైనా వ‌చ్చి మీరు త‌ప్పు చేస్తున్నారు.. అని చెప్పినా కేసులు పెట్టం. పెట్టించం. వారు చెప్పే త‌ప్పుల‌ను లెక్క‌లు వేసుకుంటాం. స‌రిచేసుకుంటాం.” అని వ్యాఖ్యానించారు.

అంతిమంగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జ‌వాబు దారీగా ఉంటుంద‌ని నారా లోకేష్ చెప్పారు. కూట‌మిలో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌జ‌లకు బాధ్యులేన‌న్న ఆయ‌న‌.. ఎవ‌రూ స్వతంత్ర నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితి లేద‌న్నారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా మాట్లాడుకుని విధానప‌ర‌మైన నిర్ణ‌యాల‌పై ఒక విధానం పాటిస్తామ‌ని చెప్పారు. “గ‌తంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఒకే ఒక్క విధ్వంస‌కారుడు తీసుకున్న నిర్ణ‌యంతో అమ‌రావ‌తి ఆగిపోయింది. పెట్టుబ‌డి దారులు ప‌రార‌య్యారు. ఉద్యోగాలు రాలేదు. ఉపాధి లేదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమ‌య్యాయో కూడా తెలియ‌దు. అంతా అరాచ‌కం. మేం రాజ‌కీయాల కోసం ఈ మాట అన‌డం లేదు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. కాగ్ కూడా గ‌ణాంకాల‌తో స‌యితంగా వివ‌రించింది” అని లోకేష్ చెప్పుకొచ్చారు.

తాజాగా సోమ‌వారం సాయంత్రం రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు.. మంత్రి నారా లోకేష్‌ను క‌లుసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా క‌ళాశాల‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వారు విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ వారితో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే.. పాల‌న ప‌ట్టాలెక్కుతోంద‌న్నారు. రాష్ట్రంపై పెట్టుబ‌డి దారుల‌కు న‌మ్మ‌కం క‌లుగుతోంద‌ని తెలిపారు. విదేశీ విద్యార్థులు కూడా ఒక‌ప్పుడు ఏపీని వెతుక్కుని వ‌చ్చార‌ని.. కానీ, గ‌త ఐదేళ్ల విధ్వంస పాల‌న చూసిన త‌ర్వాత పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయార‌ని చెప్పారు. త‌ప్పులు చేసి.. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేశార‌ని.. వాటిని చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం నిల‌బెడుతోంద‌న్నారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల విడుద‌ల‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేస్తార‌ని నారా లోకేష్ చెప్పారు. అన్ని విష‌యాల‌ను కూట‌మిలోని ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుని ఒక నిర్ణ‌యానికి వ‌స్తార‌ని తెలిపారు. తాను ఒక్క‌డినే ఒక నిర్ణ‌యం తీసుకుని.. త‌ర్వాత‌.. వేరే వారు మ‌రో నిర్ణ‌యం ప్ర‌క‌టించే సంస్కృతి.. నిరంకుశ విధానం కూట‌మి ప్ర‌భుత్వంలో ఉండ‌బోవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విష‌యంపైనైనా కూట‌మి ప్ర‌భుత్వంలోని మంత్రులు అంద‌రూ స‌మ‌ష్టిగా నిర్ణ‌యం తీసుకున్నాకే.. వెల్ల‌డిస్తామ‌ని.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ కోడ్ అమ‌ల్లో ఉన్నందున ఈ విష‌యంపై ఇంత‌క‌న్నా ఎక్కువ మాట్లాడ‌డం త‌గ‌ద‌ని వారికి చెప్పారు.

This post was last modified on February 4, 2025 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఔను.. మేం త‌ప్పు చేశాం.. మోడీ ముందు ఒప్పుకొన్న రాహుల్‌!

అధికార ప‌క్షం ముందు ప్ర‌తిప‌క్షం బింకంగానే ఉంటుంది. అది కేంద్ర‌మైనా.. రాష్ట్ర‌మైనా.. ఒక్క‌టే రాజ‌కీయం. మంచి చేసినా.. చెడు చేసినా..…

8 hours ago

ఈ రెడ్డి గారికి ఎవరితోనూ పొసగట్లేదు!

చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి… ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్లమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత. ఆదిలో కాంగ్రెస్, వైసీపీల్లో…

9 hours ago

ఓటీటీలో మార్కో… ఇంకా ఎక్కువ డోస్

మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…

10 hours ago

మూడు కొత్త సినిమాల కబుర్లు…

సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్‌ కోసం టాలీవుడ్ బాగానే…

11 hours ago

రానా నాయుడు 2 – భలే టైమింగ్ దొరికిందే

విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…

11 hours ago

ఫస్ట్ ఛాయిస్ అవుతున్న సందీప్ కిషన్

ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…

12 hours ago