చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి… ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్లమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత. ఆదిలో కాంగ్రెస్, వైసీపీల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత టీడీపీలో కూడా కొనసాగారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రెడ్డి… మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగానే విజయం సాదించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అడుగులు పెట్టిన ఈయనకు… ఆయా పార్టీలతో మంచి సంబంధాలే ఉంటాయిలే అనుకుంటాం. అయితే ఏ ఒక్క పార్టీకి చెందిన నేతలతోనూ ఆయనకు పొసగడం లేదు. వెరసి ఇప్పుడు ఈ రెడ్డిగారు ఏకాకిగా మిగిలిపోయారు.
మొన్నటికి మొన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెందిన ప్లై యాష్ తరలింపు విషయంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేతతో ఓ రేంజిలో వివాదం చెలరేగింది. ఇరువురు నేతలు డీ అంటే డీ అన్నట్లుగా సాగగా… చివరకు చంద్రబాబు దూతలు వచ్చి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు. ఈ వివాదంలో ఆదిపై జేసీదే పైచేయిగా నిలిచినట్టు సమాచారం. వాస్తవానికి ఆర్టీపీపీ జమ్మలమడుగు పరిధిలో ఉంది. ఈ లెక్కన దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆది వాదన నెగ్గి తీరాలి. అయినా కూడా పొరుగు జిల్లా నేత ఆదికి షాకిచ్చారు. పలితంగా ఆది పరువు పోయినట్టైందట.
తాజాగా జమ్మలమడుగు క్లబ్ లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేశ్ నేరుగా కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకే ఫిర్యాదు చేశారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేశ్ స్వస్థలం కడప జిల్లానే. ఈ క్రమంలోనే తన సొంత జిల్లాకు చెందిన వ్యవహారం కాబట్టి… జమ్మలమడుగు క్లబ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అదికార యంత్రాంగం రమేశ్ ఫిర్యాదు నిజమేనని నిర్ధారించి క్లబ్ ను మూసేశారు. ఈ విషయంలో ఆది నారాయణ రెడ్డి వాదనను అధికారులు అస్సలు పరిగణనలోకి తీసుకోలేదట. ఇదిలా ఉంటే… ఆది, రమేశ్ ఇద్దరూ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. అంటే నిన్న మిత్రపక్షం నేత చేతిలో షాక్ తగిలితే… తాజాగా ఆదికి సొంత పార్టీ నేత నుంచే షాక్ తప్పలేదట.
This post was last modified on February 4, 2025 9:55 am
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…