వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామపై కక్షగట్టి టార్చర్ పెట్టిన ఆనాటి జగన్ ప్రభుత్వం వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆనాడు కస్టడీలో జరిగిన టార్చర్ గురించి రఘురామ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ ఫెలో సినిమాలో కొట్టినట్లు తనను కొట్టారని రఘురామ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అదృష్టం బాగుండి బతికిపోయానని అన్నారు. ఆ సినిమాలో ఒకడిని కస్టడీలో సీఐ కొడుతుంటే చనిపోతాడని, కానీ, ఆ చనిపోయిన వాడిని ఇంకా బతికి ఉన్నట్లు చూపించాలని, ఫిట్స్ వచ్చినట్లు చూపించి ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ ఫిట్స్ తో చనిపోయినట్లు చూపించమని చెబుతారని గుర్తు చేశారు. ఇక, ఈ కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్ లో పీవీ సునీల్ పాత్రపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశఆరు.
సునీల్ కుమార్ అతి తెలివి ఉపయోగించి యూట్యూబ్లో ఉన్న వీడియోలు డిలీట్ చేయించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి తాను ఒక బాధితుడిగా ఫిర్యాదు చేశానని అన్నారు. సునీల్ కుమార్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగానని తెలిపారు. తన కస్టోడియల్ టార్చర్పై పోరాటం ఆగదని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని, దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.
ఇక, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, తన మనోభావాలు ఏంటో సభలో తెలియజేయాలని చెప్పారు. ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం ఇవ్వరని, ప్రజలు ఇస్తారని చెప్పారు. ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజుల పాటు సభకు రాకుంటే అనర్హత వేటు పడుతుందని అన్నారు. అప్పుడు పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని రఘురామ చెప్పారు.
This post was last modified on February 3, 2025 6:18 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…