Political News

నాడు-నేడు…. కూట‌మికే కాపీ రైట్‌.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌నా కాలంలో తీసుకువ‌చ్చిన నాడు-నేడు అనే మాట ఇప్పుడు కూట‌మి స‌ర్కారు చ‌క్క‌గా వినియోగించుకుంటోందా? ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను వెన‌క్కి నెట్టేసిందా? ఇక‌, నుంచి ప్ర‌తి విష‌యంలోనూ నాడు-నేడుతోనే జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌నుందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ హ‌యాంలో నాడు-నేడు అనే నినాదం భారీగా మార్మోగింది. పాఠ‌శాల‌ల‌ను గ‌త చంద్ర‌బాబు(2014-19) హ‌యాం క‌న్నా ఎక్కువ‌గా మెరుగు ప‌రిచామ‌ని.. గ‌తంలో ఏం చేయ‌లేదో..ఇ ప్పుడు చేసి చూపిస్తున్నామ‌ని జ‌గ‌న్ అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. దీంతో నాడు-నేడుకు ప్రాధాన్యం పెరిగింది.

అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ నాడు-నేడును కేవ‌లం విద్యా వ్య‌వ‌స్థ‌కు మాత్ర‌మే వాడుకుంటే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు అన్నింటికీ ముడిపెడుతూ.. సంచ‌ల‌న కామెంట్లు చేస్తోంది. ఒక్క విద్యావ్య‌వ‌స్థ‌కే కాకుండా.. జ‌గ‌న్ హ‌యాంలో చేసిన ప్ర‌తి ప‌నికీ నాడు-నేడు ను జోడిస్తోంది. దీంతో ఇప్పుడు నాడు-నేడు నినాదం కూట‌మి ప‌ర‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్రంలో ర‌హ‌దారుల బాగు చేత‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. 2600 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు వెచ్చించారు. దీంతో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ స్థాయిలో ర‌హ‌దారులు అద్దంలా మెరిసిపోతున్నాయి.

ఈ క్ర‌మంలో కూట‌మి స‌ర్కారు.. నాడు ఎలా ఉన్నాయో.. నేడు ఎలా ఉన్నాయో.. చూడాలంటూ ర‌హ‌దారుల అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తోంది. ఇది కూట‌మి స‌ర్కారుకు మంచి మైలేజీ ఇచ్చే అంశంగా ఉంద‌నిప‌రిశీల‌కులు సైతం చెబుతున్నారు. అదేవిధంగా అవినీతి అధికారుల‌ను జైళ్ల‌కు పంపించ‌డంతో పాటు.. స‌క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు అంకిత భావంతో ప‌నిచేసే అధికారుల‌ను నియ‌మిస్తున్న తీరులోనూ నాడు-నేడు నినాదాన్ని వాడుతోంది. ఇక‌, పింఛ‌న్ల పంపిణీలోనూ.. నాడు-నేడు అనే మాట సీఎం చంద్ర‌బాబు నుంచే వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెబుతున్నారు.

నాడు కేవ‌లం వ‌లంటీర్లువస్తే.. నేడు ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నార‌ని, స‌మ‌స్య‌లు కూడా వింటున్నార‌ని ఆయ‌న చెబుతున్నారు. అదేవిధంగా రైతుల‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల విష‌యంలోనూ.. నాడు-నేడు నినాదాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ వాడుతున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో రైతులు ఎదురు చూపులు చూడాల్సి వ‌చ్చేద‌ని.. ఇప్పుడు ప‌రిస్థితిని మార్చి 48 గంటల్లోనే రైతుల‌కు న‌గ‌దు చెల్లిస్తున్నామంటూ.. కూట‌మి నేత‌లు చెబుతున్నారు. ఇలా అనేక విష‌యాల్లో మున్ముందు.. నాడు-నేడు నినాదాన్ని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో ఇక‌పై ఈ నినాదం కూట‌మికి కాపీరైట్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on February 3, 2025 11:31 am

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

33 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

50 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

3 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

3 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

4 hours ago