తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారన్న వార్తలు శనివారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ భేటీ జరిగిన మాట వాస్తవమేనని శనివారానికే తేలిపోయింది. ఈ బేటీకి వెండి కొండ అని జనమంతా చెప్పుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వం వహించారట. ఈ మాటను అనిరుధ్ రెడ్డి మాటలే చెప్పేశాయి. ఈ భేటీపై భారీ ఎత్తున ప్రచారం జరుగుతుండగా… ఆదివారం స్వయంగా అనిరుధ్ బయటకు వచ్చారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ భేటీ గురించి ఆయనే పూర్తి వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో తాము 8 మంది ఎమ్మెల్యేం భేటీ అయిన మాట వాస్తవమేనని అనిరుధ్ చెప్పారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించిన ఆయన…ఒకే పార్టీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలం అయినంత మాత్రాన తాము ప్రత్యేకంగా భేటీ కాకూడదా? అని కూడా ప్రశ్నించారు. తాము స్నేహపూర్వకంగానే భేటీ అయ్యామని ఆయన చెప్పారు. ఈ భేటీలో రాజకీయ అంశాలను కూడా చర్చించుకున్నామని కూడా ఆయన తెలిపారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలపై చర్చించుకోకుండా ఎలా ఉంటామని కూడా ఆయన ప్రశ్నించారు.
అంతటితో ఆగని అనిరుధ్.. తనపై రెవెన్యూ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏదో ఫైల్ తీసుకుని రెవెన్యూ మంత్రి వద్దకు వెళ్లినట్లుగా మంత్రితో పాటు పార్టీ సీనియర్ నేత మల్లు రవి చెబుతున్నారన్నారు. తాను ఏ ఫైల్ తీసుకుని వెళ్లానో రెవెన్యూ మంత్రి, మల్లు రవి వెల్లడించాలని అనిరుధ్ డిమాండ్ చేశారు. త్వరలోనే ఈ వ్యవహారంపై పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీని కలుస్తానని… ఆ తర్వాత అన్నీ బయటపెడతానని తెలిపారు. ఎవరి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసునన్న అనిరుధ్… మంత్రి గారి చరిత్రను కూడా బయటపెడతానని సంచలన కామెంట్ చేశారు.
This post was last modified on February 2, 2025 3:33 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…