Political News

బొత్స రెడీ… లోకేశ్ దే లేట్

వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార కూటమి సర్కారుకు పెను సవాలే విసిరారు. మేం తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి బాసూ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శనివారం పార్లమెంటు ముందుకు వచ్చిన కేంద్ర బడ్జెట్ పై స్పందించేందుకు ఆదివారం బొత్స మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కేంద్ర బడ్జెట్ లో మరోమారు ఏపీకి అన్యాయం జరిగిందని బొత్స ఓ రూలింగ్ ఇచ్చేశారు. అదే సమయంలో మరోమారు బీహార్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిందని కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ తరఫున 16 మంది ఎంపీలున్నా… ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన ఆవేన వ్యక్తం చేశారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు కూడా ఏపీలో ఎంపీలున్న విషయాన్ని ప్రస్తావించిన బొత్స… ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే… అందరూ చోద్యం చూశారని మండిపడ్డారు. ఇది రాష్ట్రాభివృద్ధికి మంచి పద్ధతి కాదని కూడా బొత్స వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత వైసీపీ సర్కారులో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై బొత్స స్పందించారు. ఈ సందర్భంగా తాను నిర్వహించిన విద్యా శాఖలో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వైసీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే.. విచారణ చేసి చర్యలు తీసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన విద్యా శాఖలో నాడు-నేడులో తప్పులు జరిగాయంటే తనపైనా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. డిజిటలైజేషన్ లో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వం వహిస్తున్న విద్యా శాఖలో అక్రమాలు, చర్యలపై బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలకు తెర లేపింది.

This post was last modified on February 2, 2025 3:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

59 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago