Political News

వైసీపీని వాయించేస్తున్నారు.. ఉక్కిరిబిక్కిరే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీని కూటమి పార్టీలు వాయించేస్తున్నాయి. అవ‌కాశం ఉన్న చోటే కాదు.. అవకాశం వెతికి మ‌రీ వైసీపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ప్ర‌ధానంగా బీజేపీ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ, జ‌న‌సేన‌లు మాత్రం త‌మ‌దైన పంథాతోనే ముందుకు సాగుతున్నాయి. ఆది నుంచి వైసీపీ నాయ‌కుడు.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని వ్య‌తిరేకించే టీడీపీ.. జ‌న‌సేన‌లు.. తాజాగా టార్గెట్ చేశాయి. ఈ క్ర‌మంలోనే అట‌వీ భూముల్లో ఇంటి నిర్మాణం, రోడ్డు నిర్మాణాల‌పై విచార‌ణ‌కు ఆదేశించాయి.

అయితే.. విష‌యం అక్క‌డితో అయిపోలేదు. పెద్దిరెడ్డితోపాటు వైసీపీని కూడా టార్గెట్ చేస్తూ.. జ‌న‌సేన కీల‌క వ్యూహం ప‌న్నింది. పెద్దిరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో జ‌న‌సేన జెండాను ఎగ‌రేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఫిబ్ర‌వ‌రి 3ను ముహూర్తంగా పేర్కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు పుంగ‌నూరులో వేరే జెండా ఎగ‌రాలంటేనే ఆలోచించే ప‌రిస్థితి నుంచి ఇప్పుడు జ‌న‌సేన ఏకంగా 50 వేల నుంచి ల‌క్ష మందితో స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది.

దీనికి యువ‌త‌ను పెద్ద ఎత్తున స‌మీక‌రించ‌నుంది. ముఖ్యంగా మెగా అభిమానుల‌ను పెద్ద సంఖ్య‌లో త‌రలించేందుకు ప‌క్కా వ్యూహం రెడీ చేసుకున్న‌ట్టు తెలిసింది. మొత్తంగా పుంగ‌నూరులో జ‌న‌సేన రాజ‌కీయా లు స్టార్ట్ అవుతున్నాయి. అంటే.. పెద్దిరెడ్డి ఇలాకాలో జ‌నసేన పుంజుకునే వ్యూహానికి పునాదులు ప‌డుతు న్నాయ‌న్న‌మాట‌. ఆదివారం నిర్వ‌హించే స‌భ‌ను పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. సీమ‌లో ఉన్న నాయ‌కుల‌ను అంద‌రినీ రావాలంటూ ఆహ్వానాలు పంపించింది.

ఇక‌, వైసీపీకి ఎదురైన మ‌రో పెద్ద దెబ్బ‌.. టీడీపీ నుంచే వ‌స్తోంది. క‌డ‌ప‌లో మ‌హానాడును నిర్వ‌హించాలన్న‌ది ఆ పార్టీ వ్యూహం. ఇదే జ‌రిగితే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లాలో టీడీపీ దూకుడు మ‌రింత పెర‌గ‌డం ఖాయం. ఇలా.. ఇరు పార్టీలు కూడా వైసీపీకి ఊపిరి ఆడ‌కుండా చేస్తున్నాయ‌న్న‌ది తాజాగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. అటు జ‌న‌సేన‌, ఇటు టీడీపీ దూకుడుతో వైసీపీకి రెండు ప‌క్క‌లా వాచిపోతోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ముఖ్య నాయ‌కులు వెళ్లిపోవ‌డం.. ఉన్న‌వారు కూడా కేసుల్లో ఇరుక్కోవ‌డంతో వైసీపీకి రాబోయే రోజుల్లో గ‌డ్డు ప‌రిస్థితి ఎదురు కానుంద‌ని అంటున్నారు.

This post was last modified on February 2, 2025 12:12 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

28 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

38 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

57 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago