Political News

చంద్ర‌బాబు చ‌ల‌వ‌: మాజీ ఐపీఎస్ ఏబీవీకి కీల‌క ప‌ద‌వి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురై.. దాదాపు ఐదేళ్ల‌పాటు స‌స్పెన్ష‌న్ లో ఉన్న ఆలూరి బాల వెంక‌టేశ్వ‌రావు(ఏబీవీ) వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు ఇజ్రాయెల్ నుంచి అక్ర‌మ వ్యాపారం చేశార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ హ‌యాంలో స‌స్పెండ్ చేశారు. దీనిపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. అదేవిధంగా క్యాట్‌ను కూడా ఆశ్ర‌యించారు. దీంతో ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ స‌ర్కారు త‌న క‌క్ష సాధింపులు కొన‌సాగించింది.

కోర్టు ఆదేశాల‌తో ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ డీజీగా నియ‌మించినా.. త‌ర్వాత విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మ‌రోసారి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసింది. అయితే.. త‌న‌కు క‌నీసం స‌గం జీత‌మైనా ఇవ్వాల‌ని.. త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని ఏబీవీ ప‌లు మార్లు విన్న‌వించారు. కానీ, ప‌ట్టించుకోలేదు. ఇక‌, రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ముందు ఏబీవీ పై ఉన్న అన్ని కేసుల‌ను కోర్టులు కొట్టేశాయి. దీంతో వైసీపీ హ‌యాంలోనే ఆయ‌న త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చివ‌రి రోజు పోస్టు తెచ్చుకున్నా రు. కానీ, అదే రోజు ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

కూట‌మి స‌ర్కారు కొలువు దీరిన త‌ర్వాత‌.. ఇటీవ‌ల ఏబీవీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ హ‌యాంలో ఆయన‌ పై న‌మోదు చేసిన కేసులు వీగిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న స‌స్పెన్ష‌న్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనం ఇవ్వ‌డంతోపాటు ఇత‌ర భ‌త్యాలు కూడా చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో సుమారు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగానే ఏబీవీకి ఆర్థిక శాఖ అందించింది. ఇప్పుడు మ‌రోసారి.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రిటైరైన ఏబీవీకి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఆయ‌న‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వాస్త‌వానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. గ‌తంలో విజ‌య‌వాడ కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నాగుల్ మీరా చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న క్యూలో ఉన్నారు. అదే విధంగా మ‌రో మాజీ ఎమ్మెల్యే, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ త్యాగం చేసిన కృష్ణాజిల్లాకు చెందిన నాయ‌కుడు కూడా.. బ‌రిలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏబీవీ కి ఈ ప‌ద‌విని ఇస్తూ..సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న నియామ‌కం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ప‌దవి చేప‌ట్టి స‌మ‌యం నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతార‌ని స్ప‌ష్టం చేశారు.

This post was last modified on February 1, 2025 9:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

28 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago