Political News

చంద్ర‌బాబు చ‌ల‌వ‌: మాజీ ఐపీఎస్ ఏబీవీకి కీల‌క ప‌ద‌వి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురై.. దాదాపు ఐదేళ్ల‌పాటు స‌స్పెన్ష‌న్ లో ఉన్న ఆలూరి బాల వెంక‌టేశ్వ‌రావు(ఏబీవీ) వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు ఇజ్రాయెల్ నుంచి అక్ర‌మ వ్యాపారం చేశార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ హ‌యాంలో స‌స్పెండ్ చేశారు. దీనిపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. అదేవిధంగా క్యాట్‌ను కూడా ఆశ్ర‌యించారు. దీంతో ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ స‌ర్కారు త‌న క‌క్ష సాధింపులు కొన‌సాగించింది.

కోర్టు ఆదేశాల‌తో ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ డీజీగా నియ‌మించినా.. త‌ర్వాత విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మ‌రోసారి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసింది. అయితే.. త‌న‌కు క‌నీసం స‌గం జీత‌మైనా ఇవ్వాల‌ని.. త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని ఏబీవీ ప‌లు మార్లు విన్న‌వించారు. కానీ, ప‌ట్టించుకోలేదు. ఇక‌, రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ముందు ఏబీవీ పై ఉన్న అన్ని కేసుల‌ను కోర్టులు కొట్టేశాయి. దీంతో వైసీపీ హ‌యాంలోనే ఆయ‌న త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చివ‌రి రోజు పోస్టు తెచ్చుకున్నా రు. కానీ, అదే రోజు ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

కూట‌మి స‌ర్కారు కొలువు దీరిన త‌ర్వాత‌.. ఇటీవ‌ల ఏబీవీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ హ‌యాంలో ఆయన‌ పై న‌మోదు చేసిన కేసులు వీగిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న స‌స్పెన్ష‌న్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనం ఇవ్వ‌డంతోపాటు ఇత‌ర భ‌త్యాలు కూడా చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో సుమారు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగానే ఏబీవీకి ఆర్థిక శాఖ అందించింది. ఇప్పుడు మ‌రోసారి.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రిటైరైన ఏబీవీకి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఆయ‌న‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వాస్త‌వానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. గ‌తంలో విజ‌య‌వాడ కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నాగుల్ మీరా చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న క్యూలో ఉన్నారు. అదే విధంగా మ‌రో మాజీ ఎమ్మెల్యే, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ త్యాగం చేసిన కృష్ణాజిల్లాకు చెందిన నాయ‌కుడు కూడా.. బ‌రిలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏబీవీ కి ఈ ప‌ద‌విని ఇస్తూ..సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న నియామ‌కం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ప‌దవి చేప‌ట్టి స‌మ‌యం నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతార‌ని స్ప‌ష్టం చేశారు.

This post was last modified on February 1, 2025 9:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

3 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

6 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

7 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

8 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

8 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

8 hours ago