Political News

చంద్ర‌బాబు చ‌ల‌వ‌: మాజీ ఐపీఎస్ ఏబీవీకి కీల‌క ప‌ద‌వి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురై.. దాదాపు ఐదేళ్ల‌పాటు స‌స్పెన్ష‌న్ లో ఉన్న ఆలూరి బాల వెంక‌టేశ్వ‌రావు(ఏబీవీ) వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు ఇజ్రాయెల్ నుంచి అక్ర‌మ వ్యాపారం చేశార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ హ‌యాంలో స‌స్పెండ్ చేశారు. దీనిపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. అదేవిధంగా క్యాట్‌ను కూడా ఆశ్ర‌యించారు. దీంతో ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ స‌ర్కారు త‌న క‌క్ష సాధింపులు కొన‌సాగించింది.

కోర్టు ఆదేశాల‌తో ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ డీజీగా నియ‌మించినా.. త‌ర్వాత విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మ‌రోసారి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసింది. అయితే.. త‌న‌కు క‌నీసం స‌గం జీత‌మైనా ఇవ్వాల‌ని.. త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని ఏబీవీ ప‌లు మార్లు విన్న‌వించారు. కానీ, ప‌ట్టించుకోలేదు. ఇక‌, రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ముందు ఏబీవీ పై ఉన్న అన్ని కేసుల‌ను కోర్టులు కొట్టేశాయి. దీంతో వైసీపీ హ‌యాంలోనే ఆయ‌న త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చివ‌రి రోజు పోస్టు తెచ్చుకున్నా రు. కానీ, అదే రోజు ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

కూట‌మి స‌ర్కారు కొలువు దీరిన త‌ర్వాత‌.. ఇటీవ‌ల ఏబీవీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ హ‌యాంలో ఆయన‌ పై న‌మోదు చేసిన కేసులు వీగిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న స‌స్పెన్ష‌న్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనం ఇవ్వ‌డంతోపాటు ఇత‌ర భ‌త్యాలు కూడా చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో సుమారు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగానే ఏబీవీకి ఆర్థిక శాఖ అందించింది. ఇప్పుడు మ‌రోసారి.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రిటైరైన ఏబీవీకి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఆయ‌న‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వాస్త‌వానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. గ‌తంలో విజ‌య‌వాడ కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నాగుల్ మీరా చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న క్యూలో ఉన్నారు. అదే విధంగా మ‌రో మాజీ ఎమ్మెల్యే, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ త్యాగం చేసిన కృష్ణాజిల్లాకు చెందిన నాయ‌కుడు కూడా.. బ‌రిలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏబీవీ కి ఈ ప‌ద‌విని ఇస్తూ..సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న నియామ‌కం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ప‌దవి చేప‌ట్టి స‌మ‌యం నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతార‌ని స్ప‌ష్టం చేశారు.

Satya

Recent Posts

వివాదాలు ఎన్ని ఉన్నా అవకాశాలకు లోటు లేదు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…

1 minute ago

టాక్సిక్ ఫిక్సు… పోటీ సినిమాలకు చిక్కు

అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…

1 hour ago

సీఐ నాగ‌రాజుకు మహిళల మద్దతు

విజ‌య‌వాడ కృష్ణ‌లంక పోలీసు స్టేషన్ సీఐ నాగ‌రాజుపై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించి.. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే..…

1 hour ago

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

2 hours ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

2 hours ago