Political News

చంద్ర‌బాబు చ‌ల‌వ‌: మాజీ ఐపీఎస్ ఏబీవీకి కీల‌క ప‌ద‌వి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురై.. దాదాపు ఐదేళ్ల‌పాటు స‌స్పెన్ష‌న్ లో ఉన్న ఆలూరి బాల వెంక‌టేశ్వ‌రావు(ఏబీవీ) వ్య‌వ‌హారం.. రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు ఇజ్రాయెల్ నుంచి అక్ర‌మ వ్యాపారం చేశార‌ని ఆరోపిస్తూ.. వైసీపీ హ‌యాంలో స‌స్పెండ్ చేశారు. దీనిపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. అదేవిధంగా క్యాట్‌ను కూడా ఆశ్ర‌యించారు. దీంతో ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ స‌ర్కారు త‌న క‌క్ష సాధింపులు కొన‌సాగించింది.

కోర్టు ఆదేశాల‌తో ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ డీజీగా నియ‌మించినా.. త‌ర్వాత విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మ‌రోసారి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేసింది. అయితే.. త‌న‌కు క‌నీసం స‌గం జీత‌మైనా ఇవ్వాల‌ని.. త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డం ఇబ్బందిగా మారింద‌ని ఏబీవీ ప‌లు మార్లు విన్న‌వించారు. కానీ, ప‌ట్టించుకోలేదు. ఇక‌, రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు ముందు ఏబీవీ పై ఉన్న అన్ని కేసుల‌ను కోర్టులు కొట్టేశాయి. దీంతో వైసీపీ హ‌యాంలోనే ఆయ‌న త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు చివ‌రి రోజు పోస్టు తెచ్చుకున్నా రు. కానీ, అదే రోజు ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

కూట‌మి స‌ర్కారు కొలువు దీరిన త‌ర్వాత‌.. ఇటీవ‌ల ఏబీవీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైసీపీ హ‌యాంలో ఆయన‌ పై న‌మోదు చేసిన కేసులు వీగిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న స‌స్పెన్ష‌న్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనం ఇవ్వ‌డంతోపాటు ఇత‌ర భ‌త్యాలు కూడా చెల్లించాల‌ని ఆదేశించింది. దీంతో సుమారు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగానే ఏబీవీకి ఆర్థిక శాఖ అందించింది. ఇప్పుడు మ‌రోసారి.. చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రిటైరైన ఏబీవీకి పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఆయ‌న‌ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

వాస్త‌వానికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. గ‌తంలో విజ‌య‌వాడ కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు నాగుల్ మీరా చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఇప్పుడు కూడా ఆయ‌న క్యూలో ఉన్నారు. అదే విధంగా మ‌రో మాజీ ఎమ్మెల్యే, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ త్యాగం చేసిన కృష్ణాజిల్లాకు చెందిన నాయ‌కుడు కూడా.. బ‌రిలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏబీవీ కి ఈ ప‌ద‌విని ఇస్తూ..సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న నియామ‌కం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ప‌దవి చేప‌ట్టి స‌మ‌యం నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతార‌ని స్ప‌ష్టం చేశారు.

This post was last modified on February 1, 2025 9:21 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago