మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులకు ఎక్కారు. ఇప్పటిదాకా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల… తాజాగా శనివారం 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డులకు ఎక్కారు.వాస్తవానికి గతేడాదే నిర్మల ఈ రికార్డును చేరుకున్నారు గానీ.. ఎన్నికల తర్వాత ఆమె ప్రవేశపెట్టింది మధ్యంతర బడ్జెట్టే కదా. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే… శనివారం నాటి బడ్జెట్ ఆమెను రికార్డులకు ఎక్కించింది. తమిళనాడుకు చెందిన నిర్మల… ఏపీకి చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో 10 బడ్జెట్ లు ప్రవేశపెట్టిన నేతలు కూడా ఉన్నా…వరుసబెట్టి ఇన్నేసి బడ్జెట్ లు ప్రవేశపెట్టిన విషయంలో మాత్రం నిర్మలదే తొలి స్థానం. గతంలో మొరార్జీ దేశాయ్ ఏకంగా 10 బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. అయితే అవన్నీ ఆయన వరుసగా ప్రవేశపెట్టినవి కావు. 6 బడ్జెట్ లను వరుసగా ప్రవేశపెట్టిన దేశాయ్..మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మిగిలిన 4 బడ్జెట్ లను .ప్రవేశపెట్టారు. ఇక నిర్మల పుట్టినిల్లు తమిళనాడుకు చెందిన పి.చిదంబరం 9 బడ్జెట్ లను ప్రవేశపెట్టినా… ఆయన కూడా మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా 8 బడ్జెట్ లను ప్రవేశపెట్టినా… ఆయనకూ కొంత గ్యాప్ వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 5 బడ్జెట్ లను వరుసబెట్టి ప్రవేశపెట్టారు.
నిర్మలమ్మను ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలోనే తన కేబినెట్ లోకి తీసుకున్నా… 2014లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పదవి ఇచ్చారు. ఆ తర్వాత వాణిజ్య శాఖ మంత్రిగా అదే ఏడాదిలో ప్రమోషన్ దక్కించుకున్న నిర్మల… 2017లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా టాప్ పొజిషన్ లోకి వచ్చారు. ఇక 2019లో మోదీ వరుసగా రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల… మోదీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఫలితంగానే వరుసగా మోదీ మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నిర్మలకే ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు దక్కాయి. మరో రెండు బడ్జెట్ లు ప్రవేశపెడితే… దేశంలో అత్యధిక సంఖ్యలో బడ్జెట్ లను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటారు.
This post was last modified on February 1, 2025 11:22 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…