యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్దిపై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటే అరెస్టై…జగన్ మాదిరే బెయిల్ తీసుకుని సాయిరెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్ పైనే ఉన్నారు. ఈ లెక్కన దేశం వదిలి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తప్పని సరి కదా. మొన్న లండన్ వెళ్లిన జగన్ కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్, నార్వేలలో నెల రోజుల పర్యటనకు వెళుతున్నానని…అందుకు అనుమతించాలంటూ గత వారమే సాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోర్టు.. శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సాయిరెడ్డి ఫారిన్ టూర్ కు ఓకే చెప్పిన కోర్టు.. సాయిరెడ్డి కోరినట్లుగా నెల రోజుల టూర్ కు మాత్రం అంగీకరించలేదు. 15 రోజుల పాటు పర్యటనకు మాత్రమే అనుమతించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్యలో ఈ 15 రోజుల టూర్ ను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
అయినా ఫారిన్ టూర్ కు అనుమతిస్తూనే… నిందితుడు కోరినట్లుగా కాకుండా… టూర్ నిడివిని కోర్టు నిర్ణయించడం సాయిరెడ్డి విషయంలోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూర్ కు కోర్టు అనుమతించకున్నా ఫరవా లేదన్న వాదనలు వినిపస్తున్నాయి. అలా కాకుండా టూర్ కు అంగీకరిస్తూనే…మీ ఇష్టం వచ్చినట్లుగా నెల అంటే కుదరదు… 15 రోజుల్లో టూర్ ను పూర్తి చేసుకుని రమ్మంటూ కోర్టు చెప్పడం నిజంగానే సాయిరెడ్డికి భారీ షాకేనని చెప్పక తప్పదు. ఈ తరహాలో కోర్టులు చాలా అరుదుగా చెబుతుంటాయి. అది ఇప్పుడు తన విషయంలో జరగడంతో సాయిరెడ్డి అసలు టూర్ కు వెళ్లాలా? వద్దా?అన్న డైలమాలో పడిపోయారు.
This post was last modified on January 31, 2025 10:45 pm
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…