యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్దిపై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటే అరెస్టై…జగన్ మాదిరే బెయిల్ తీసుకుని సాయిరెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్ పైనే ఉన్నారు. ఈ లెక్కన దేశం వదిలి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తప్పని సరి కదా. మొన్న లండన్ వెళ్లిన జగన్ కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్, నార్వేలలో నెల రోజుల పర్యటనకు వెళుతున్నానని…అందుకు అనుమతించాలంటూ గత వారమే సాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోర్టు.. శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సాయిరెడ్డి ఫారిన్ టూర్ కు ఓకే చెప్పిన కోర్టు.. సాయిరెడ్డి కోరినట్లుగా నెల రోజుల టూర్ కు మాత్రం అంగీకరించలేదు. 15 రోజుల పాటు పర్యటనకు మాత్రమే అనుమతించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్యలో ఈ 15 రోజుల టూర్ ను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
అయినా ఫారిన్ టూర్ కు అనుమతిస్తూనే… నిందితుడు కోరినట్లుగా కాకుండా… టూర్ నిడివిని కోర్టు నిర్ణయించడం సాయిరెడ్డి విషయంలోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూర్ కు కోర్టు అనుమతించకున్నా ఫరవా లేదన్న వాదనలు వినిపస్తున్నాయి. అలా కాకుండా టూర్ కు అంగీకరిస్తూనే…మీ ఇష్టం వచ్చినట్లుగా నెల అంటే కుదరదు… 15 రోజుల్లో టూర్ ను పూర్తి చేసుకుని రమ్మంటూ కోర్టు చెప్పడం నిజంగానే సాయిరెడ్డికి భారీ షాకేనని చెప్పక తప్పదు. ఈ తరహాలో కోర్టులు చాలా అరుదుగా చెబుతుంటాయి. అది ఇప్పుడు తన విషయంలో జరగడంతో సాయిరెడ్డి అసలు టూర్ కు వెళ్లాలా? వద్దా?అన్న డైలమాలో పడిపోయారు.
This post was last modified on January 31, 2025 10:45 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…