యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్దిపై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటే అరెస్టై…జగన్ మాదిరే బెయిల్ తీసుకుని సాయిరెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్ పైనే ఉన్నారు. ఈ లెక్కన దేశం వదిలి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తప్పని సరి కదా. మొన్న లండన్ వెళ్లిన జగన్ కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్, నార్వేలలో నెల రోజుల పర్యటనకు వెళుతున్నానని…అందుకు అనుమతించాలంటూ గత వారమే సాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోర్టు.. శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సాయిరెడ్డి ఫారిన్ టూర్ కు ఓకే చెప్పిన కోర్టు.. సాయిరెడ్డి కోరినట్లుగా నెల రోజుల టూర్ కు మాత్రం అంగీకరించలేదు. 15 రోజుల పాటు పర్యటనకు మాత్రమే అనుమతించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్యలో ఈ 15 రోజుల టూర్ ను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
అయినా ఫారిన్ టూర్ కు అనుమతిస్తూనే… నిందితుడు కోరినట్లుగా కాకుండా… టూర్ నిడివిని కోర్టు నిర్ణయించడం సాయిరెడ్డి విషయంలోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూర్ కు కోర్టు అనుమతించకున్నా ఫరవా లేదన్న వాదనలు వినిపస్తున్నాయి. అలా కాకుండా టూర్ కు అంగీకరిస్తూనే…మీ ఇష్టం వచ్చినట్లుగా నెల అంటే కుదరదు… 15 రోజుల్లో టూర్ ను పూర్తి చేసుకుని రమ్మంటూ కోర్టు చెప్పడం నిజంగానే సాయిరెడ్డికి భారీ షాకేనని చెప్పక తప్పదు. ఈ తరహాలో కోర్టులు చాలా అరుదుగా చెబుతుంటాయి. అది ఇప్పుడు తన విషయంలో జరగడంతో సాయిరెడ్డి అసలు టూర్ కు వెళ్లాలా? వద్దా?అన్న డైలమాలో పడిపోయారు.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…