యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్దిపై నమోదైన అక్రమాస్తుల కేసులన్నింటిలో సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటే అరెస్టై…జగన్ మాదిరే బెయిల్ తీసుకుని సాయిరెడ్డి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంకా బెయిల్ పైనే ఉన్నారు. ఈ లెక్కన దేశం వదిలి వెళ్లాలంటే కోర్టుల అనుమతి తప్పని సరి కదా. మొన్న లండన్ వెళ్లిన జగన్ కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్, నార్వేలలో నెల రోజుల పర్యటనకు వెళుతున్నానని…అందుకు అనుమతించాలంటూ గత వారమే సాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కోర్టు.. శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సాయిరెడ్డి ఫారిన్ టూర్ కు ఓకే చెప్పిన కోర్టు.. సాయిరెడ్డి కోరినట్లుగా నెల రోజుల టూర్ కు మాత్రం అంగీకరించలేదు. 15 రోజుల పాటు పర్యటనకు మాత్రమే అనుమతించింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్యలో ఈ 15 రోజుల టూర్ ను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
అయినా ఫారిన్ టూర్ కు అనుమతిస్తూనే… నిందితుడు కోరినట్లుగా కాకుండా… టూర్ నిడివిని కోర్టు నిర్ణయించడం సాయిరెడ్డి విషయంలోనే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టూర్ కు కోర్టు అనుమతించకున్నా ఫరవా లేదన్న వాదనలు వినిపస్తున్నాయి. అలా కాకుండా టూర్ కు అంగీకరిస్తూనే…మీ ఇష్టం వచ్చినట్లుగా నెల అంటే కుదరదు… 15 రోజుల్లో టూర్ ను పూర్తి చేసుకుని రమ్మంటూ కోర్టు చెప్పడం నిజంగానే సాయిరెడ్డికి భారీ షాకేనని చెప్పక తప్పదు. ఈ తరహాలో కోర్టులు చాలా అరుదుగా చెబుతుంటాయి. అది ఇప్పుడు తన విషయంలో జరగడంతో సాయిరెడ్డి అసలు టూర్ కు వెళ్లాలా? వద్దా?అన్న డైలమాలో పడిపోయారు.
This post was last modified on January 31, 2025 10:45 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…