Political News

బాబుకు బిగ్ రిలీఫ్‌.. ఒక్క‌రోజే 1200 కోట్ల రాక‌!

ఏపీలోని కూట‌మి స‌ర్కారును న‌డిపిస్తున్న‌ సీఎం చంద్ర‌బాబుకు శుక్ర‌వారం బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఒక్క‌రోజే 1200 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూరాయి. అయితే.. ఇదేదో అప్పుగానో.. లేక గ్రాంటుగా కేంద్రం నుంచో వ‌చ్చిన సొమ్ములు కావు. రాష్ట్ర ప్ర‌జ‌లు క‌ట్టిన సొమ్ములు. ఔను.. రాష్ట్ర‌ వ్యాప్తంగా శుక్ర‌వారం ఒక్క‌రోజే భూములు, పొలాలను రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌వారు క‌ట్టిన సొమ్ము. అది కూడా సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స‌ర్కారుకు జ‌మ అయిన సొమ్ముల‌ని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు. శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి 1) నుంచి రాష్ట్రంలో భూముల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేష‌న్ చార్జీల‌ను కూడా పెంచుతున్నారు.

ఈ విష‌యం గ‌త నాలుగు రోజులుగా మీడియా ప్ర‌ధానంగా వెలుగులోకితెచ్చింది. మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యం లో రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌లు, భూముల ధ‌ర‌లు పెరిగితే.. మ‌రింత భారం అవుతుంద‌ని అనుకున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త వ‌ర్గాల ప్ర‌జ‌లు శుక్ర‌వారం కొత్త కొనుగోళ్ల‌కు తెర‌దీశారు. ‘ముందు.. రిజిస్ట్రేష‌న్ చేసేయ్‌!’ అంటూ స్థానిక స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు పోటెత్తారు. వీటిలో విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు(కొత్త‌గా చేరింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్న నేప‌థ్యంలో), రాజ‌మండ్రి, ఏలూరు, కాకినాడ వంటి ప్ర‌ధాన న‌గారాల్లో సాయంత్రం ఐదు గంట‌లు దాటాక కూడా.. రిజిస్ట్రార్ కార్యాల‌యాలు కిక్కిరిసే ఉన్నాయి.

మాఘ‌మాసం, అందునా శుక్ర‌వారం మంచి రోజు కావ‌డం, తెల్ల‌వారితో ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో భూములు కొనేవారు, అపార్ట్‌మెంటు ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు వ‌రుస పెట్టి క్యూ క‌ట్టారు. దీంతో రెవెన్యూ శాఖ‌కు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌మ అయిన‌.. సొమ్ము 12325 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే అందిన‌ట్టు అధికారులు తెలిపారు. అయితే.. మ‌రింత మంది వెయిటింగులో ఉన్నార‌ని.. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చార్జీల‌ను అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తించే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దీంతో మ‌రో రెండు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేశారు.

ఇలా ఒకే రోజు వెయ్యి కోట్ల రూపాయ‌ల ఆదాయం ఇటీవలకాలంలో ఇదే మొద‌టి సారి. దీంతో ప్ర‌స్తుతం స‌ర్కారుకు ఆర్థిక ఊపిరి అందిన‌ట్టు అయింది. పైగా ఈ సొమ్ము అచ్చంగా స‌ర్కారుకే చెంద‌డంతో పాటు.. ఎవ‌రికీ ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డంతో మ‌రింత వెసులుబాటు ద‌క్కిన‌ట్టు అయింద‌ని రెవెన్యూ వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే..చంద్ర‌బాబు విజ‌న్ 2047, అభివృద్ధి నేప‌థ్యంలో భూములు కొనుగోలుచేసేవారు పెరిగారు. అదేవిధంగా అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉండ‌గానే వాటికి సైతం రెక్క‌లు రావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 31, 2025 7:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జాన్వీ కపూర్ చెల్లికి హిట్టు కష్టాలు

దేవరతో టాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్ డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇది నిర్మాణంలో ఉండగానే ఆర్సి…

13 minutes ago

భారీ ఆదాయం భారత్ వల్లే.. ఇంగ్లండ్ కు స్ట్రాంగ్ కౌంటర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు చేరకపోవడం అక్కడి మాజీ క్రికెటర్లకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. అయితే తమ…

37 minutes ago

పోసానిని కాపాడేది అనారోగ్యం ఒక్కటేనట!

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజంపేట జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి…

1 hour ago

భాగ్యశ్రీ బోర్సే – 5 ప్యాన్ ఇండియా సినిమాలు

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఎవరైనా వాళ్ళ కెరీర్ ని నిర్దేశించేది సక్సెసే. ఒక ఫ్లాప్ తో కనుమరుగైన వాళ్లున్నారు. ఒక…

1 hour ago

వైరల్ వీడియో… కన్నీరు ఆపుకోలేకపోయిన మాజీ మంత్రి

శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఓ ఘటన నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాల్లో తూటాల్లాంటి మాటలను పేల్చడమే కాకుండా……

2 hours ago

“ఓపెన్ హెయిమర్ స్థాయిలో రామాయణం”

ప్రపంచంలోని బెస్ట్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పమంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలు కొందరికి…

2 hours ago