తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే… శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారో… ఆ మరుక్షణమే తెలంగాణలో ఒక్కసారిగా హీట్ తారాస్థాయికి చేరింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టారు.
కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత షాద్ నగర్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చిన రేవంత్… చెల్లని నోటుతో స్నేహం జైలు పాలు చేస్తుందని సెటైర్లు సంధించారు. కేసీఆర్ తో జనానికి బంధాలు తెగిపోయాయని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలను బలంగా కొడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన రేవంత్… కొట్టుడు కాదు కనీసం కేసీఆర్ చక్కగా నిలబడగలరా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నామన్న రేవంత్… దమ్ముంటే ఆ సమావేశాలకు కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రస్ పై కేసీఆర్ చేసిన సెటైర్లను వరుసబెట్టి గుర్తు చేసిన రేవంత్.. వాటన్నింటికీ అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు.
రేవంత్ కంటే ముందే కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి.. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఢిల్లీలో మాదిరే కేరళలోనూ కవిత లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మాటలు చెప్పుడు కాదు దమ్ముంటే… కేసీఆర్ బయటకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఇక రేవంత్ స్పందన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి… కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేతుల్లోనే బలం ఉండదన్న జగ్గారెడ్డి… ఆయన బలమంతా నోటిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు ఊదే గాలిలో కేసీఆర్ కొట్టుకుని పోతారని కూడా జగ్గారెడ్డి వ్యంగ్యాస్త్రాన్నిసంధించారు. మొత్తంగా అటువైపు నుంచి కేసీఆర్ ఒక్కరు వస్తే… ఇటు వైపు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టడం గమనార్హం.
This post was last modified on January 31, 2025 7:04 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…