తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే… శుక్రవారం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారో… ఆ మరుక్షణమే తెలంగాణలో ఒక్కసారిగా హీట్ తారాస్థాయికి చేరింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టారు.
కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత షాద్ నగర్ లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి… కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చిన రేవంత్… చెల్లని నోటుతో స్నేహం జైలు పాలు చేస్తుందని సెటైర్లు సంధించారు. కేసీఆర్ తో జనానికి బంధాలు తెగిపోయాయని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలను బలంగా కొడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన రేవంత్… కొట్టుడు కాదు కనీసం కేసీఆర్ చక్కగా నిలబడగలరా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నామన్న రేవంత్… దమ్ముంటే ఆ సమావేశాలకు కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రస్ పై కేసీఆర్ చేసిన సెటైర్లను వరుసబెట్టి గుర్తు చేసిన రేవంత్.. వాటన్నింటికీ అదిరిపోయే కౌంటర్లు ఇచ్చారు.
రేవంత్ కంటే ముందే కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి.. ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఢిల్లీలో మాదిరే కేరళలోనూ కవిత లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మాటలు చెప్పుడు కాదు దమ్ముంటే… కేసీఆర్ బయటకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఇక రేవంత్ స్పందన తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి… కేసీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేతుల్లోనే బలం ఉండదన్న జగ్గారెడ్డి… ఆయన బలమంతా నోటిలోనే ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు ఊదే గాలిలో కేసీఆర్ కొట్టుకుని పోతారని కూడా జగ్గారెడ్డి వ్యంగ్యాస్త్రాన్నిసంధించారు. మొత్తంగా అటువైపు నుంచి కేసీఆర్ ఒక్కరు వస్తే… ఇటు వైపు కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కట్టడం గమనార్హం.
This post was last modified on January 31, 2025 7:04 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…