బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాన్నాళ్ల తర్వాత తన గళాన్ని విప్పారు. 2023 ఆకరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనకు తెర పడిపోయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి చేరగా.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే ఎందుకనో గానీ… కేసీఆర్ చాలాకాలంగా బయటకే రావడం లేదు. ఎర్రవలిలోని తన ఫామ్ హౌజ్ లోనే ఉంటున్న కేసీఆర్…ఏది ఉన్నానేతలను అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నేతృత్వంలో పలువురు పార్టీ ప్రముఖులు కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవలికి వెళ్లారు. వీరితో పాటు వారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలోనే ఎర్రవలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అందరినీ చూసి సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్.. వారితో ముచ్చటించేందుకు వచ్చారు. హరీశ్ సహా అక్కడికి వచ్చిన మిగిలిన నేతలతో పలు అంశాలపై మాట్లాడిన కేసీఆర్… ఆ తర్వాత అందరినీ ఉద్దేశించి మైకులో ప్రసంగించారు.
ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత కేసీఆర్ వాయిస్ ఒకింత గట్టిగానే వినిపించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనా తీరుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. గతంలో తెలంగాణ కోసం పోరాటం సాగించామని గుర్తు చేసిన కేసీఆర్… ఇప్పుడు ప్రజలకు న్యాయం చేసేందుకు మరోమారు పోరాటం చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా సమయంలో కూడా తాను రైతు బంధును ఆపలేదన్నారు. రైతు బంధుతో లక్షలాది మంది రైతులకు మేలు జరిగిందన్నారు కాంగ్రెస్ పాటనలో రైతు బందుకు రాంరాం పలికారని సెటైర్లు వేశారు..
రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు, నీటి కష్టాలు మొదలయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని విమర్శించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలను వాడుకుందని ఆరోపించారు. గురుకులాల్లో అన్నీ సమస్యలే రాజ్యమేలుతున్నాయన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ముంచిందన్నారు. సంగేశ్వర,బసవేశ్వర ప్రాజెక్టుకు టెండర్లు ఎందుకు పిలవరని ప్రశ్నించారు. ఇక లాభం లేదన్న కేసీఆర్… మళ్లీ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాల్సిందేనని పిలుపునిచ్చారు. హరీశ్ రావు ఆధ్వర్యంలో నిరసనలకు తెర తీయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
This post was last modified on January 31, 2025 3:44 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…