Political News

ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే… టీ కాంగ్ లో కొత్త రచ్చ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే నిలుచుంటే…మరోవైపు మాజీ ఎమ్మెల్యే నిలుచుని బస్తీ మే సవాల్ అనే రీతిలో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వీరిలో ఒకరు మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ సీనియర్ నేత, మీడియా సంస్థ అధినేత గడ్డం వివేక్ వెంటకస్వామి ఒకరు కాగా… పార్టీలో మంచి మైలేజీ ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరొకరు.

ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నేతలే. ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే వివేక్ ఎస్సీలోని మాల వర్గానికి చెందిన వారు కాగా… సంపత్ అదే ఎస్సీలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సారూప్యతలే వీరి మధ్య కొత్త చిచ్చును రాజేసింది.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుకూలమే. అయితే ఒక్క మాల సామాజిక వర్గం మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తోంది.

ఈ క్రమంలో మాల సామాజిక వర్గానికి చెందిన వారిని ఏకం చేసేలా వివేక్ మొన్న ఓ సభ నిర్వహించారు. ఈ సభపై సంపత్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలమేనన్న సంపత్.. మాలలతో సభ పెట్టి వివేక్ పార్టీ లైన్ దాటారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీ అదిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. సంపత్ ఫిర్యాదుపై భగ్గుమన్న వివేక్…తాను నిర్వహించిన సభలో మాదిగలకు గానీ, వర్గీకరణకు గానీ తాను వ్యతిరేకంగా మాట్లాడలేన్నారు.

అయినా తాను ఒక్క సభ పెట్టుకుంటూనే ఇంత రాద్దాంతం చేయాలా? అని వివేక్ ఫైర్ అయ్యారు. అయినా తాను పార్టీ లైన్ ను ఎప్పుడూ దాటనని, ఈ విషయంలో పార్టీ తనపై ఏ రకమైన చర్యలు తీసుకున్నా తాను సిద్ధమేనని ప్రకటించారు. మొత్తంగా ఈ ఇద్దరు ఎస్సీ నేతల మధ్య నెలకొన్న వివాదం పార్టీ అధిష్ఠానానికి కూడా పెను సమస్యగానే పరిణమించిందని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

51 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago