Political News

నాడు ఈ గవర్నెన్స్… నేడు వాట్సాప్ గవర్నెన్స్

1995…ఉమ్మడి ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో నాడు యువ నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన వారంతా ఫక్తు రాజకీయ నాయకులే.

పెద్దగా టెక్నాలజీపై అవగాహన లేని వారే. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలకు సరికొత్త పాలనను అందించారు. అప్పటిదాకా కరెంటు బిల్లు కట్టేందుకు వచ్చిన వారితో విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు భారీ క్యూలు కనిపించగా… చంద్రబాబు వాటిని మాయం చేశారు.

అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని అందిపుచ్చుకున్న చంద్రబాబు… మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ ఏపీ పాలనను సమూలంగా ప్రక్షాళన చేసింది. అందుబాటులోకి వచ్చిన ఐటీని సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు ఈ సేవా సెంటర్ల పేరిట వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కరెంటు బిల్లులతో పాటు ఇతరత్రా శాఖల సేవలు కూడా ఈ కేంద్రాల ద్వారా జనానికి ఈజీగా అందేలా చర్యలు చేపట్టారు. చంద్రబాబు దూరదృష్టితో ప్రారంభించిన ఈ సేవా సెంటర్లు సక్సెస్ కావడంతో… అదే తరహా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి.

తాజాగా ఇప్పుడు ఐటీని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డామినేట్ చేస్తోంది. 1995లో ఐటీ విజృంభిస్తున్న వేళ చంద్రబాబు ఎలా అయితే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో… అలాగే ఇప్పుడు ఏఐ తన ప్రభావం చూపడం మొదలుపెట్టిన 2025లోనూ చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఇంకేముంది నాడు ఐటీని వాడుకున్నట్లుగానే… ఇప్పుడు ఏఐని వాడుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. అది కూడా అందరి కంటే ముందుగా ఏఐపై చంద్రబాబు దృష్టి సారించారు. పలితంగా ఏపీలో గురువారం వాట్సాప్ గవర్నెన్స్ లాంఛనంగా ప్రారంభమైంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నూతన తరమా పాలనా విధానాన్ని ప్రారంభించారు.

నాడు ఈ సేవా కేంద్రాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో… నేడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా డబుల్ సక్సెస్ కావడం ఖాయమేనని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు ఇంటిలో కూర్చునే… దాదాపుగా అన్ని రకాల పౌర సేవలను తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా అందుకోనున్నారు. ఏ ఒక్క సేవ కోసం కూడా జనం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

అంతేకాకుండా జవాబుదారీ తనం కూడా పెరుగుతుంది. నకిలీల బెడద తగ్గుతుంది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు మాత్రమే అందనున్నా… భవిష్యత్తులో అన్ని రకాల పౌర సేవలు దీని ద్వారానే అందనున్నాయి. అంటే… నాడు ఐటీతో పాలనను సమూలంగా మార్చేసిన చంద్రబాబు… ఇప్పుడు ఏఐతో ప్రభుత్వ పాలనను మరింతగా సులభతరం చేయనున్నారన్న మాట.

This post was last modified on January 30, 2025 7:48 pm

Share

Recent Posts

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

11 minutes ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

59 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

1 hour ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

1 hour ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago