రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని.. పెద్ద ఎత్తున యాగీ చేస్తున్న విషయం రెండు రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే.. తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు.
పైగా వైసీపీ ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ప్రజలను కోరుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రం లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. మరి దీనిని సద్వి నియోగం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా? ప్రభుత్వంపై ప్రజల్లో నిజంగానే వ్యతిరేకత ఉంటే.. ఈ ఎన్నికలను ఆసరా చేసుకుని వైసీపీ దానిని నిరూపించే అవకాశం ఉంటుంది. ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ, వైసీపీ ఈ విషయంలో చేతులు ఎత్తేసింది.
రెండు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోస్టుకు ఎన్నికలు జరగనున్నా.. వైసీపీ నుంచి ఉలుకు పలుకు లేకుండా పోయింది. ఎవరూ కూడా పోటీ చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అంటే.. ఒకరకంగా వైసీపీ ఈ ఎన్నికలను వదిలేసుకున్నట్టే అయింది. దీంతో స్వల్ప పోటీ మినహా.. కూటమి మద్దతుతో రంగంలోకి దిగిన.. అభ్యర్థుల విజయం దాదాపు ఖరారైంది. వాస్తవానికి నామినేషన్లకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో వైసీపీ పోటీకి దిగి.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపించుకునే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
కానీ, అలా చేయకుండా కేవలం మీడియా ముందు మాత్రమే కొన్ని కామెంట్లు చేసి.. చేతులు దులుపుకొం టే పార్టీపై విశ్వసనీయత మరింత మృగ్యమవుతుందని అంటున్నారు. ఇక, ఆ తర్వాత.. జగన్ చెప్పే విశ్వసనీయత, విలువలు వంటివాటికి చాపచుట్టేయడమే బెటర్ అన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. ఈ విషయంలో వైసీపీ వేసే అడుగులు పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయని కూడా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on January 30, 2025 10:32 am
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…