వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు. అంతేకాదు, వెంటనే ఆ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని, తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
అడవులను ఏ విధంగా ధ్వంసం చేశా, పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని అటవీ శాఖ అధికారులకు పవన్ చెప్పారు. ఎంత అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైందో తేల్చాలని, అటవీ భూముల రికార్డులు తారుమారు చేశారా? అన్న కోణంలో పరిశీలించాలని ఆదేశించారు. ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరో నివేదికలో పేర్కొనాలని పవన్ చెప్పారు.
కాగా, పెద్దిరెడ్డి తమ భూములను కబ్జా చేశారని గతంలో బాధితులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను బెదిరించి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పవన్ తాజా నిర్ణయంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు.
This post was last modified on January 29, 2025 3:29 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…