Political News

పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విచారణకు పవన్ ఆదేశం

వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు. అంతేకాదు, వెంటనే ఆ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని, తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

అడవులను ఏ విధంగా ధ్వంసం చేశా, పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని అటవీ శాఖ అధికారులకు పవన్ చెప్పారు. ఎంత అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైందో తేల్చాలని, అటవీ భూముల రికార్డులు తారుమారు చేశారా? అన్న కోణంలో పరిశీలించాలని ఆదేశించారు. ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరో నివేదికలో పేర్కొనాలని పవన్ చెప్పారు.

కాగా, పెద్దిరెడ్డి తమ భూములను కబ్జా చేశారని గతంలో బాధితులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను బెదిరించి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పవన్ తాజా నిర్ణయంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు.

This post was last modified on January 29, 2025 3:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

3 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

9 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

12 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

14 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

15 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

16 hours ago