వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు. అంతేకాదు, వెంటనే ఆ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని, తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
అడవులను ఏ విధంగా ధ్వంసం చేశా, పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని అటవీ శాఖ అధికారులకు పవన్ చెప్పారు. ఎంత అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైందో తేల్చాలని, అటవీ భూముల రికార్డులు తారుమారు చేశారా? అన్న కోణంలో పరిశీలించాలని ఆదేశించారు. ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరో నివేదికలో పేర్కొనాలని పవన్ చెప్పారు.
కాగా, పెద్దిరెడ్డి తమ భూములను కబ్జా చేశారని గతంలో బాధితులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను బెదిరించి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పవన్ తాజా నిర్ణయంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు.
This post was last modified on January 29, 2025 3:29 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…