వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సమగ్ర విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ సమాచారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు. అంతేకాదు, వెంటనే ఆ వ్యవహారంపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పి.సి.సి.ఎఫ్.కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని, తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
అడవులను ఏ విధంగా ధ్వంసం చేశా, పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని అటవీ శాఖ అధికారులకు పవన్ చెప్పారు. ఎంత అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైందో తేల్చాలని, అటవీ భూముల రికార్డులు తారుమారు చేశారా? అన్న కోణంలో పరిశీలించాలని ఆదేశించారు. ఒకవేళ రికార్డులు తారుమారు చేస్తే అందుకు బాధ్యులెవరూ? తద్వారా లబ్ధి పొందింది ఎవరో నివేదికలో పేర్కొనాలని పవన్ చెప్పారు.
కాగా, పెద్దిరెడ్డి తమ భూములను కబ్జా చేశారని గతంలో బాధితులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమను బెదిరించి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పవన్ తాజా నిర్ణయంతో పెద్దిరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు.
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…