తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది.
ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా ఓ ఉపాధ్యాయ (టీచర్) ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక తెలంగాణలో రెండు టీచర్ స్థానాలతో పాటుగా ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో మూడేసి శాసన మండలి స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 3న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమమైన పోలింగ్ జరగనుండగా… మార్చి 3న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే… రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవలే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.
This post was last modified on January 29, 2025 3:17 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే మూడు తరాల హీరోలు వచ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…