తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది.
ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా ఓ ఉపాధ్యాయ (టీచర్) ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక తెలంగాణలో రెండు టీచర్ స్థానాలతో పాటుగా ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో మూడేసి శాసన మండలి స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 3న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమమైన పోలింగ్ జరగనుండగా… మార్చి 3న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే… రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవలే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.
This post was last modified on January 29, 2025 3:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…