తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది.
ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా ఓ ఉపాధ్యాయ (టీచర్) ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక తెలంగాణలో రెండు టీచర్ స్థానాలతో పాటుగా ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో మూడేసి శాసన మండలి స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 3న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమమైన పోలింగ్ జరగనుండగా… మార్చి 3న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే… రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవలే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.
This post was last modified on January 29, 2025 3:17 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…