తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది.
ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా ఓ ఉపాధ్యాయ (టీచర్) ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక తెలంగాణలో రెండు టీచర్ స్థానాలతో పాటుగా ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో మూడేసి శాసన మండలి స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 3న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే నెల 27న ఈ ఎన్నికల్లో కీలక ఘట్టమమైన పోలింగ్ జరగనుండగా… మార్చి 3న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే… రెండు రాష్ట్రాల్లోనూ ఇటీవలే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.
This post was last modified on January 29, 2025 3:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…