గుమ్మనూరు జయరాం… కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆదిలో కాంగ్రెస్ తో రాజకీయాలు మొదలుపెట్టిన ఈయన… ఆ తర్వాత వైసీపీతో కలిసి నడిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోని గుంతకల్లుకు మారినా…. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా, కూటమి పార్టీలకు చెందిన నేతగా సాగుతున్న జయరాం… మీడియాకు వార్నింగ్ లు ఇస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన తప్పు ఉంటే తల వంచుతానని చెబుతూనే… తనపై అసత్యాలు రాస్తే మాత్రం మీడియా అని కూడా చూడనని ఆయన ఆయా సంస్థల మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అంతటితో ఆగని జయరాం… తానేదో గతంలో రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్యలు చేసినట్లుగా మీడియానే చెప్పింది కదా… ఇప్పుడు కూడా అలా రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి తనకేమీ అభ్యంతరం లేదని, తాను ఎవరికీ భయపడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన స్థానిక నేతలను వెంటేసుకుని గ్రామాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా బుధవారం ఉదయం జయరాం ఈ వ్యాఖ్యలు చేశారు. మీడయా ప్రతినిదులను హెచ్చరిస్తూ జయరాం సాగిపోతూ ఉంటే… ఆయన అనుచరులు, సోదరుడు అలా చూస్తుండిపోయారు. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు జయరాంపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎప్పుడు ఇలా ఆయన మీడియాను బెదిరించిన దాఖలా కనిపించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జయరాం ఈ తరహాలో మీడియాపైనే బెదిరింపులకు దిగిన తీరుపై విమర్శలు రేగుతున్నాయి.
This post was last modified on January 29, 2025 11:40 am
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…