Political News

ఈ ఎమ్మెల్యే గారు… రైలు పట్టాలపై పండబెడతారట

గుమ్మనూరు జయరాం… కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆదిలో కాంగ్రెస్ తో రాజకీయాలు మొదలుపెట్టిన ఈయన… ఆ తర్వాత వైసీపీతో కలిసి నడిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోని గుంతకల్లుకు మారినా…. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు.

ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా, కూటమి పార్టీలకు చెందిన నేతగా సాగుతున్న జయరాం… మీడియాకు వార్నింగ్ లు ఇస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన తప్పు ఉంటే తల వంచుతానని చెబుతూనే… తనపై అసత్యాలు రాస్తే మాత్రం మీడియా అని కూడా చూడనని ఆయన ఆయా సంస్థల మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అంతటితో ఆగని జయరాం… తానేదో గతంలో రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్యలు చేసినట్లుగా మీడియానే చెప్పింది కదా… ఇప్పుడు కూడా అలా రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి తనకేమీ అభ్యంతరం లేదని, తాను ఎవరికీ భయపడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన స్థానిక నేతలను వెంటేసుకుని గ్రామాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా బుధవారం ఉదయం జయరాం ఈ వ్యాఖ్యలు చేశారు. మీడయా ప్రతినిదులను హెచ్చరిస్తూ జయరాం సాగిపోతూ ఉంటే… ఆయన అనుచరులు, సోదరుడు అలా చూస్తుండిపోయారు. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు జయరాంపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎప్పుడు ఇలా ఆయన మీడియాను బెదిరించిన దాఖలా కనిపించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జయరాం ఈ తరహాలో మీడియాపైనే బెదిరింపులకు దిగిన తీరుపై విమర్శలు రేగుతున్నాయి.

This post was last modified on January 29, 2025 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

25 minutes ago

త్రివిక్రమ్ స్టయిల్లో వెంకీ అట్లూరి

సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్‌గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…

2 hours ago

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు…

3 hours ago

ల‌డ్డూ ఎఫెక్ట్‌: టీటీడీ ఈవో సింఘాల్‌పై చ‌ర్య‌లు

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. ఈ క‌ల్తీ వ్య‌వ‌హారంపై విచార‌ణ…

3 hours ago

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

6 hours ago

ఫ్యాన్స్ సంతోషం సరే… ఇది తప్పు కదా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…

6 hours ago