Political News

ఈ ఎమ్మెల్యే గారు… రైలు పట్టాలపై పండబెడతారట

గుమ్మనూరు జయరాం… కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నేత. ఆదిలో కాంగ్రెస్ తో రాజకీయాలు మొదలుపెట్టిన ఈయన… ఆ తర్వాత వైసీపీతో కలిసి నడిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. 2024 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జయరాంకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఏకంగా కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోని గుంతకల్లుకు మారినా…. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు.

ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా, కూటమి పార్టీలకు చెందిన నేతగా సాగుతున్న జయరాం… మీడియాకు వార్నింగ్ లు ఇస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన తప్పు ఉంటే తల వంచుతానని చెబుతూనే… తనపై అసత్యాలు రాస్తే మాత్రం మీడియా అని కూడా చూడనని ఆయన ఆయా సంస్థల మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అంతటితో ఆగని జయరాం… తానేదో గతంలో రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్యలు చేసినట్లుగా మీడియానే చెప్పింది కదా… ఇప్పుడు కూడా అలా రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి తనకేమీ అభ్యంతరం లేదని, తాను ఎవరికీ భయపడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన స్థానిక నేతలను వెంటేసుకుని గ్రామాల పర్యటనకు బయలుదేరిన సందర్భంగా బుధవారం ఉదయం జయరాం ఈ వ్యాఖ్యలు చేశారు. మీడయా ప్రతినిదులను హెచ్చరిస్తూ జయరాం సాగిపోతూ ఉంటే… ఆయన అనుచరులు, సోదరుడు అలా చూస్తుండిపోయారు. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు జయరాంపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎప్పుడు ఇలా ఆయన మీడియాను బెదిరించిన దాఖలా కనిపించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా జయరాం ఈ తరహాలో మీడియాపైనే బెదిరింపులకు దిగిన తీరుపై విమర్శలు రేగుతున్నాయి.

This post was last modified on January 29, 2025 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

7 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

32 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

34 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago