Political News

145 రోజుల త‌ర్వాత బెయిల్‌.. అయినా, ఉక్కిరిబిక్కిరి!

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కుడు, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు తాజాగా రిలీఫ్ ద‌క్కింది. గ‌త 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం… తాజాగా బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న వెంట‌నే కాల‌ర్ బోన్ చికిత్స నిమిత్తం విజ‌య‌వాడకు త‌ర‌లి వెళ్లారు. గ‌త కొన్నాళ్లుగా నందిగం కాల‌ర్ బోన్ స‌మ‌స్య‌తో బాధ‌పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో జైల్లో ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న చికిత్స పొందారు.

ఎందుకీ జైలు!

అమ‌రావ‌తి ప్రాంతం ప‌రిధిలోని ఓఎస్సీ కాల‌నీలో మాదిగ‌, మాల సామాజిక వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాలు ఉంటున్నాయి. ఈ కాల‌నీకి ముందు భాగంలో భారీ ఆర్చి నిర్మాణం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యంలో మాల‌-మాదిగ సామాజిక వ‌ర్గాల కుటుంబాల మ‌ధ్య వివాదం చోటు చేసుకుంది. ఇది అప్ప‌టి ఎంపీ నందిగం వ‌ర‌కు చేరింది. ఈయ‌న మాదిగ సామాజిక వ‌ర్గానికి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ క్ర‌మంలో మ‌రిన్ని గొడ‌వ‌లు చెల‌రేగి.. మ‌రియ‌మ్మ అనే మ‌హిళ చ‌నిపోయింది.

ఇది వైసీపీ హ‌యాంలోనే జ‌రిగినా.. కేసు న‌మోదు చేసినా.. పెద్ద‌గా పట్టించుకోలేదు. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. మ‌రియ‌మ్మ కుమారుడు నారా లోకేష్‌ను ఆశ్ర‌యించ‌డంతో కేసు న‌మోదు చేశారు. నందిగంను అరెస్టు చేసి .. జిల్లా జైలుకు త‌ర‌లించారు. ఇక‌, త‌న‌పై కేసు కొట్టేయాలంటూ.. ఆయ‌న హైకోర్టు సుప్రీంకోర్టుల వ‌ర‌కు వెళ్లినా.. నేర చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్నారంటూ.. న్యాయ‌స్థానాలు వ్యాఖ్యానించారు. చివ‌ర‌కు తాజాగా 145 రోజుల అనంత‌రం.. అనారోగ్య కార‌ణాల‌తో బెయిల్ తెచ్చుకున్నారు.

అయితే.. తాజాగా విజ‌య‌వాడ కృష్ణ లంక పోలీసులు మ‌రో కేసును తెర‌మీదికి తెచ్చారు. వైసీపీ హ‌యాంలో న‌మోదైన ఈ కేసులో తాజాగా నందిగం సురేష్‌కు నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. అప్ప‌ట్లో నందిగం అనుచ‌రులు మ‌ద్యం తాగి.. విజ‌య‌వాడ బ‌స్టాండ్ వ‌ద్ద హ‌ల్చ‌ల్ చేశారు. ఈ క్ర‌మంలో వారిని పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ విష‌యం తెలిసిన అప్ప‌టి ఎంపీ సురేష్ తెల్ల‌వారు జామున స్టేష‌న్‌కు వ‌చ్చి.. పోలీసుల‌ను దుర్భాష‌లాడార‌ని.. పోలీసుల అదుపులో ఉన్న త‌న‌ అనుచ‌రుల‌ను బ‌ల‌వంతంగా తీసుకువెళ్లార‌న్న‌ది అభియోగం. ఈ కేసు తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో నందిగం మ‌రోసారి జైలుకు వెళ్లక త‌ప్ప‌దా? అనే చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on January 29, 2025 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

51 minutes ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

2 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

2 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

2 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago