గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు తాజాగా రిలీఫ్ దక్కింది. గత 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం… తాజాగా బుధవారం ఉదయం 7 గంటల సమయంలో గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చారు. అయితే.. ఆయన వెంటనే కాలర్ బోన్ చికిత్స నిమిత్తం విజయవాడకు తరలి వెళ్లారు. గత కొన్నాళ్లుగా నందిగం కాలర్ బోన్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన చికిత్స పొందారు.
ఎందుకీ జైలు!
అమరావతి ప్రాంతం పరిధిలోని ఓఎస్సీ కాలనీలో మాదిగ, మాల సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలు ఉంటున్నాయి. ఈ కాలనీకి ముందు భాగంలో భారీ ఆర్చి నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మాల-మాదిగ సామాజిక వర్గాల కుటుంబాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇది అప్పటి ఎంపీ నందిగం వరకు చేరింది. ఈయన మాదిగ సామాజిక వర్గానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని గొడవలు చెలరేగి.. మరియమ్మ అనే మహిళ చనిపోయింది.
ఇది వైసీపీ హయాంలోనే జరిగినా.. కేసు నమోదు చేసినా.. పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక.. మరియమ్మ కుమారుడు నారా లోకేష్ను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నందిగంను అరెస్టు చేసి .. జిల్లా జైలుకు తరలించారు. ఇక, తనపై కేసు కొట్టేయాలంటూ.. ఆయన హైకోర్టు సుప్రీంకోర్టుల వరకు వెళ్లినా.. నేర చరిత్రను సొంతం చేసుకున్నారంటూ.. న్యాయస్థానాలు వ్యాఖ్యానించారు. చివరకు తాజాగా 145 రోజుల అనంతరం.. అనారోగ్య కారణాలతో బెయిల్ తెచ్చుకున్నారు.
అయితే.. తాజాగా విజయవాడ కృష్ణ లంక పోలీసులు మరో కేసును తెరమీదికి తెచ్చారు. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసులో తాజాగా నందిగం సురేష్కు నోటీసులు ఇవ్వనున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పట్లో నందిగం అనుచరులు మద్యం తాగి.. విజయవాడ బస్టాండ్ వద్ద హల్చల్ చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసిన అప్పటి ఎంపీ సురేష్ తెల్లవారు జామున స్టేషన్కు వచ్చి.. పోలీసులను దుర్భాషలాడారని.. పోలీసుల అదుపులో ఉన్న తన అనుచరులను బలవంతంగా తీసుకువెళ్లారన్నది అభియోగం. ఈ కేసు తాజాగా తెరమీదికి వచ్చింది. దీంతో నందిగం మరోసారి జైలుకు వెళ్లక తప్పదా? అనే చర్చ సాగుతోంది.
This post was last modified on January 29, 2025 9:51 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…