జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అంతకుముందు 2019లో పవన్ రెండు చోట్ల నిలుచున్నా…ఎమ్మెల్యేగా ఎన్నికల కాలేకపోయారు. అయితే 2024లో మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే పోటీ చేశారు. పిఠాపురం ఓటర్లు పవన్ ను బంపర్ మెజారిటీతో గెలిపించారు. పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏకంగా డిప్యూటీ సీఎంగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలో పిఠాపురం అంటే పవన్ కు ఎనలేని అభిమానం ఉంది. ఈ సంక్రాంతి వేడుకలను ఆయన పిఠాపురం వేదికగానే జరుపుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ఏం కావాలంటే… అది క్షణాల్లో జరిగిపోతోంది. పవన్ డిప్యూటీ సీఎం కావడంతో నిజంగానే పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల లభ్యత కూడా దక్కింది. ఇంకేం కావాలి? ఓ ఏడాదో, రెండేళ్లో కళ్లు మూసుకుంటే సరి… పిఠాపురం రూపు రేఖలే మారిపోవడం ఖాయమేనని చెప్పాలి.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా… పిఠాపురం మునిసిపల్ కౌన్సిల్ మాత్రం పవన్ రాక కోసం గడచిన 7 నెలలుగా పరితపిస్తోందట. 7 నెలలుగా పవన్ అడ్రెస్ కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం పిఠాపురం మునిసిపాలిటీ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన మునిసిపల్ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిఠాపురం అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ చర్చలో కౌన్సిలర్లంతా యమా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు.
అయితే బోసు బాబు అనే ఓ కౌన్సిలర్ లేచి..లోకల్ ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. 7 నెలలుగా పవన్ కౌన్సిల్ సమావేశానికి వస్తారేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. పవన్ వస్తే.. పిఠాపురం అభివృద్ధిపై చర్చిద్దామని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. కౌన్సిల్ లోని సభ్యులందరం పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అయినా పవన్ కు కౌన్సిల్ సమావేశాల గురించి సమాచారం ఇస్తున్నారా? లేదా? అని ఆయన అదికారులను నిలదీశారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ప్రతి కౌన్సిల్ సమావేశం గురించిన సమాచారాన్ని పవన్ కు చేరవేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
This post was last modified on January 29, 2025 7:55 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…