జనసేన కీలక నేత, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ రాకతో ఏపీ పర్యాటక శాఖకు బూస్ట్ వచ్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని రీతిలో టూరిజం శాఖలో సరికొత్త కార్యక్రమాలను చేపడుతున్న దుర్గేశ్… టూరిజం డెవలప్ మెంట్ కోసం నయా పంథాను అనుసరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర పర్యాటక రంగంలో నూతన పెట్టుబడులు రావడం మొదలైంది. ఈ రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యేక సదస్సుల దిశగా సరికొత్త అడుగు వేసిన దుర్గేశ్.. తాజాగా మరో కొంగొత్త నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాంధ్రలోని అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏటా ఇక్కడికి వేలాది మంది పర్యాటకుల వస్తున్నారు. అయితే వారి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలా లేదనే చెప్పాలి. తాజాగా కూటమి అధికారం చేపట్టాక.. దుర్గేశ్ పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టాక… అరకును మరింతగా ప్రొజెక్ట్ చేయాలన్న దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగా అరకులో చలి పండుగ పేరిట 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని తీర్మానం జరిగింది.
ఈ చలి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1 కోటి నిధులను విడుదల చేసింది. సాధారణంగా టూరిజం రిలేటెడ్ ప్రోగ్రామ్ లను స్పాన్సర్ షిప్ లతోనే సరిపెట్టేస్తుంటారు. సర్కారీ నిధులు పెద్దగా విడుదల కావు. ఈ కారణంగా ఈ తరహా వేడుకలపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టదు. స్పాన్సరర్ల పెత్తనమే రాజ్యమేలుతుంది. ఫలితంగా వచ్చే ఆదాయం అంతా వారి జేబుల్లోకే వెళుతుంది.ఇకపై అలా కాకూడదన్న భావనతో దుర్గేశ్… సీఎం చంద్రబాబుతో తన ప్లాన్ ను వివరించి నిధుల కోసం అభ్యర్థించారు.
టూరిజం డెవలప్ మెంట్ పై దుర్గేశ్ దూరదృష్టిని గ్రహించిన చంద్రబాబు…దుర్గేశ్ కోరిన మేరకు అరకు చలి పండుగకు రూ.1 కోటి కేటాయించారు. దీని కంటే ముందు ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ కు కూడా రూ.1 కోటి విడుదల చేశారు. చంద్రబాబు నుంచి అందిన ప్రోత్సాహంతో అరకు చలి పండుగను సరికొత్త తరహాలో నిర్వహించేందుకు దుర్గేశ్ పకడ్బందీ ప్రణాళికలు రచించినట్లుగా సమాచారం. ఈ పండుగతో అరకుకు మరింత మంది పర్యాటకుల రాక ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…