Political News

లోకేష్ కొత్త అలోచన తో పిల్లలకు పండగే

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకూ మిడ్ డే మీల్స్ ను విస్తరించిన లోకేశ్.. తాజాగా మరో కీలక సంస్కరణకు తెర తీశారు. పాఠశాలల విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్న భావనతో… వారంతో ఓ రోజు నో బ్యాగ్ డే అమలు చేయాలని లోకేశ్ తీర్మానించారు. అంతేకాకుండా ఈ నో బ్యాగ్ డేను ప్రతి శనివారం అమలు చేయాలని ఆయన నిర్ణయించారు.

నో బ్యాగ్ డే నాడు విద్యను పక్కన పెట్టేసి… విద్యార్థులు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే… వారిలో మానసిక వికాసం పెరుగుతుందన్నది లోకేశ్ భావన. ఈ కొత్త విధానం తన మదిలో మెదిలిన వెంటనే… దానిని విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందు పెట్టిన లోకేశ్… దానిపై మరింతగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ తరహా నిర్ణయాలతో విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించే అవకాశాలున్నాయన్న నిపుణుల మాటతో ఈ విషయంలో ముందడుగు వేసేందుకే లోకేశ్ నిర్ణయించుకున్నారు.

విద్యా శాఖపై మంగళవారం జరిగిన సమీక్ష సందర్బంగా లోకేశ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నో బ్యాగ్ డేకు అనుగుణంగా పిల్లలకు సరిపడే యాక్టివిటీస్ ను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు మరింత తోడ్పాటు అందించడంతో పాటుగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయులు అనేక యాప్ లను వినియోగించాల్సి వస్తోందని… దీనిని నివారించేందుకు ఒకే ఒక యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on January 28, 2025 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

2 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

3 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

8 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

8 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

9 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

9 hours ago