టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకూ మిడ్ డే మీల్స్ ను విస్తరించిన లోకేశ్.. తాజాగా మరో కీలక సంస్కరణకు తెర తీశారు. పాఠశాలల విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్న భావనతో… వారంతో ఓ రోజు నో బ్యాగ్ డే అమలు చేయాలని లోకేశ్ తీర్మానించారు. అంతేకాకుండా ఈ నో బ్యాగ్ డేను ప్రతి శనివారం అమలు చేయాలని ఆయన నిర్ణయించారు.
నో బ్యాగ్ డే నాడు విద్యను పక్కన పెట్టేసి… విద్యార్థులు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే… వారిలో మానసిక వికాసం పెరుగుతుందన్నది లోకేశ్ భావన. ఈ కొత్త విధానం తన మదిలో మెదిలిన వెంటనే… దానిని విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందు పెట్టిన లోకేశ్… దానిపై మరింతగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ తరహా నిర్ణయాలతో విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించే అవకాశాలున్నాయన్న నిపుణుల మాటతో ఈ విషయంలో ముందడుగు వేసేందుకే లోకేశ్ నిర్ణయించుకున్నారు.
విద్యా శాఖపై మంగళవారం జరిగిన సమీక్ష సందర్బంగా లోకేశ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నో బ్యాగ్ డేకు అనుగుణంగా పిల్లలకు సరిపడే యాక్టివిటీస్ ను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు మరింత తోడ్పాటు అందించడంతో పాటుగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయులు అనేక యాప్ లను వినియోగించాల్సి వస్తోందని… దీనిని నివారించేందుకు ఒకే ఒక యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on January 28, 2025 9:24 pm
నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…