టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకూ మిడ్ డే మీల్స్ ను విస్తరించిన లోకేశ్.. తాజాగా మరో కీలక సంస్కరణకు తెర తీశారు. పాఠశాలల విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్న భావనతో… వారంతో ఓ రోజు నో బ్యాగ్ డే అమలు చేయాలని లోకేశ్ తీర్మానించారు. అంతేకాకుండా ఈ నో బ్యాగ్ డేను ప్రతి శనివారం అమలు చేయాలని ఆయన నిర్ణయించారు.
నో బ్యాగ్ డే నాడు విద్యను పక్కన పెట్టేసి… విద్యార్థులు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే… వారిలో మానసిక వికాసం పెరుగుతుందన్నది లోకేశ్ భావన. ఈ కొత్త విధానం తన మదిలో మెదిలిన వెంటనే… దానిని విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందు పెట్టిన లోకేశ్… దానిపై మరింతగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ తరహా నిర్ణయాలతో విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించే అవకాశాలున్నాయన్న నిపుణుల మాటతో ఈ విషయంలో ముందడుగు వేసేందుకే లోకేశ్ నిర్ణయించుకున్నారు.
విద్యా శాఖపై మంగళవారం జరిగిన సమీక్ష సందర్బంగా లోకేశ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నో బ్యాగ్ డేకు అనుగుణంగా పిల్లలకు సరిపడే యాక్టివిటీస్ ను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు మరింత తోడ్పాటు అందించడంతో పాటుగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయులు అనేక యాప్ లను వినియోగించాల్సి వస్తోందని… దీనిని నివారించేందుకు ఒకే ఒక యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on January 28, 2025 9:24 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…