టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్… రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకూ మిడ్ డే మీల్స్ ను విస్తరించిన లోకేశ్.. తాజాగా మరో కీలక సంస్కరణకు తెర తీశారు. పాఠశాలల విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమన్న భావనతో… వారంతో ఓ రోజు నో బ్యాగ్ డే అమలు చేయాలని లోకేశ్ తీర్మానించారు. అంతేకాకుండా ఈ నో బ్యాగ్ డేను ప్రతి శనివారం అమలు చేయాలని ఆయన నిర్ణయించారు.
నో బ్యాగ్ డే నాడు విద్యను పక్కన పెట్టేసి… విద్యార్థులు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద దృష్టి పెడితే… వారిలో మానసిక వికాసం పెరుగుతుందన్నది లోకేశ్ భావన. ఈ కొత్త విధానం తన మదిలో మెదిలిన వెంటనే… దానిని విద్యాశాఖ ఉన్నతాధికారుల ముందు పెట్టిన లోకేశ్… దానిపై మరింతగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ తరహా నిర్ణయాలతో విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించే అవకాశాలున్నాయన్న నిపుణుల మాటతో ఈ విషయంలో ముందడుగు వేసేందుకే లోకేశ్ నిర్ణయించుకున్నారు.
విద్యా శాఖపై మంగళవారం జరిగిన సమీక్ష సందర్బంగా లోకేశ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నో బ్యాగ్ డేకు అనుగుణంగా పిల్లలకు సరిపడే యాక్టివిటీస్ ను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో ఉపాధ్యాయులకు మరింత తోడ్పాటు అందించడంతో పాటుగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉపాధ్యాయులు అనేక యాప్ లను వినియోగించాల్సి వస్తోందని… దీనిని నివారించేందుకు ఒకే ఒక యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on January 28, 2025 9:24 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…