భారత రాజకీయాల్లో మొనాటనీ రాజ్యమేలుంది,. ఇందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. చివరకు నీతి వాక్యాలు వల్లించే వామపక్షాలూ అతీతం కాదు. సీపీఎం, సీపీఐ పార్టీల్లో ఇప్పటికీ వృద్ధ సింహాలనే రాజ్యం. ఆ పార్టీలకు ఎప్పటినుంచో ఒకే నేత నేతృత్వం వహిస్తున్న వైనం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వామపక్షాలంటేనే.. కారత్, రాజా, ఏచూరీ, నారాయణ, వీరభద్రం అంతే…ఇతర నేతల పేర్లు వినిపిస్తే ఒట్టు.
ఇప్పుడు ఆ పార్టీలు కూడా కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ద్వితీయ స్థాయి నేతలకు కూడా అవకాశం కల్పిద్దామనుకున్నారో… ఏమో తెలియదు గానీ… ఇప్పుడు సీపీఎం తెలంగాణ శాఖ ఓ కీలక అడుగు వేసింది. 70 ఏళ్ల వయసు పైబడ్డ వారిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోరాదని ఓ కండీషన్ ను గట్టిగానే అమలు చేసింది. ఫలితంగా… సీపీఎం తెలంగాణ శాఖలో ఎంతోకాలంగా పాతుకుపోయిన తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావు వంటి వారికి రాష్ట్ర కిమటీలో చోటు దక్కలేదు.
సీపీఎం తెలంగాణ శాఖకు మంగళవారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 70 ఏళ్ల నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఫలితంగా సీనియర్లంతా రేసు నుంచి తప్పుకోగా… పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జాన్ వెస్లీకి పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు దక్కాయి. సీపీఎం తెలంగాణ శాఖ కార్యదర్శిగా వెస్లీని ఎన్నుకున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
This post was last modified on January 28, 2025 7:42 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…