భారత రాజకీయాల్లో మొనాటనీ రాజ్యమేలుంది,. ఇందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. చివరకు నీతి వాక్యాలు వల్లించే వామపక్షాలూ అతీతం కాదు. సీపీఎం, సీపీఐ పార్టీల్లో ఇప్పటికీ వృద్ధ సింహాలనే రాజ్యం. ఆ పార్టీలకు ఎప్పటినుంచో ఒకే నేత నేతృత్వం వహిస్తున్న వైనం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వామపక్షాలంటేనే.. కారత్, రాజా, ఏచూరీ, నారాయణ, వీరభద్రం అంతే…ఇతర నేతల పేర్లు వినిపిస్తే ఒట్టు.
ఇప్పుడు ఆ పార్టీలు కూడా కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ద్వితీయ స్థాయి నేతలకు కూడా అవకాశం కల్పిద్దామనుకున్నారో… ఏమో తెలియదు గానీ… ఇప్పుడు సీపీఎం తెలంగాణ శాఖ ఓ కీలక అడుగు వేసింది. 70 ఏళ్ల వయసు పైబడ్డ వారిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోరాదని ఓ కండీషన్ ను గట్టిగానే అమలు చేసింది. ఫలితంగా… సీపీఎం తెలంగాణ శాఖలో ఎంతోకాలంగా పాతుకుపోయిన తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావు వంటి వారికి రాష్ట్ర కిమటీలో చోటు దక్కలేదు.
సీపీఎం తెలంగాణ శాఖకు మంగళవారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 70 ఏళ్ల నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఫలితంగా సీనియర్లంతా రేసు నుంచి తప్పుకోగా… పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జాన్ వెస్లీకి పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు దక్కాయి. సీపీఎం తెలంగాణ శాఖ కార్యదర్శిగా వెస్లీని ఎన్నుకున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
This post was last modified on January 28, 2025 7:42 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…