భారత రాజకీయాల్లో మొనాటనీ రాజ్యమేలుంది,. ఇందుకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. చివరకు నీతి వాక్యాలు వల్లించే వామపక్షాలూ అతీతం కాదు. సీపీఎం, సీపీఐ పార్టీల్లో ఇప్పటికీ వృద్ధ సింహాలనే రాజ్యం. ఆ పార్టీలకు ఎప్పటినుంచో ఒకే నేత నేతృత్వం వహిస్తున్న వైనం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వామపక్షాలంటేనే.. కారత్, రాజా, ఏచూరీ, నారాయణ, వీరభద్రం అంతే…ఇతర నేతల పేర్లు వినిపిస్తే ఒట్టు.
ఇప్పుడు ఆ పార్టీలు కూడా కొత్త పంథాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ద్వితీయ స్థాయి నేతలకు కూడా అవకాశం కల్పిద్దామనుకున్నారో… ఏమో తెలియదు గానీ… ఇప్పుడు సీపీఎం తెలంగాణ శాఖ ఓ కీలక అడుగు వేసింది. 70 ఏళ్ల వయసు పైబడ్డ వారిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోరాదని ఓ కండీషన్ ను గట్టిగానే అమలు చేసింది. ఫలితంగా… సీపీఎం తెలంగాణ శాఖలో ఎంతోకాలంగా పాతుకుపోయిన తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావు వంటి వారికి రాష్ట్ర కిమటీలో చోటు దక్కలేదు.
సీపీఎం తెలంగాణ శాఖకు మంగళవారం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 70 ఏళ్ల నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఫలితంగా సీనియర్లంతా రేసు నుంచి తప్పుకోగా… పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జాన్ వెస్లీకి పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు దక్కాయి. సీపీఎం తెలంగాణ శాఖ కార్యదర్శిగా వెస్లీని ఎన్నుకున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
This post was last modified on January 28, 2025 7:42 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…