ప్రజా గాయకుడిగా తెలుగు ప్రజల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు డిమాండ్.. దానికి బీజేపీ ప్రతిస్పందించిన తీరుతో నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధమే జరుగుతోంది. నిన్నటికి నిన్న తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్.. బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రచ్చకు శ్రీకారం చుట్టారు.
బండి వ్యాఖ్యలపై మూకుమ్మడి దాడికి దిగిన టీ కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి కేంద్ర మంత్రిపై విరుచుకుపడిపోయారు. టీపీసీసీ అయితే ఏకంగా గద్దర్ మరణించిస సందర్భంగా ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ గద్దర్ సతీమణికు ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను బయటపెట్టి మరీ ఎదురు దాడికి దిగింది. గద్దర్ బతికుండగా…ఆయనను బండి సంజయ్ ఆలింగనం చేసుకున్న వీడియోలను కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి బీజేపీపై ఏకంగా ర్యాగింగ్ కే పాల్పడింది.
కాంగ్రెస్ ఇంతగా కార్నర్ చేస్తున్నా… బీజేపీలో ఎంతమాత్రం మార్పు రావడం లేదు. నిన్న తెలంగాణకు చెందిన బండి సంజయ్ ఈ వివాదానికి తెర తీస్తే… ఇప్పుడు ఏపీకి చెందిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దానికి మరింత ఆజ్యం పోశారు. బండి సంజయ్ ను మించి గద్దర్ పై విస్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. బండి మాదిరిగానే విష్ణు కూడా గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు.
అయినా విష్ణు ఏమన్నారన్న విషయానికి వస్తే.. గద్దర్ పై అనేక కేసులు ఉన్నాయని విష్ణు అన్నారు. గద్దర్ అనేక మంది ప్రాణాలను తీశారని, ఈ లెక్కన గద్దర్ నరహంతుకుడేనని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్న గద్దర్ కు అవార్డు ఎలా ఇవ్వమంటారని ఆయన ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. గద్దర్ కు ఎల్టీటీఈకి పెద్దగా తేడా లేదని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎల్టీటీఈ చేతిలోనే రాజీవ్ హత్యకు గురైన విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే… ఎల్టీటీఈ ఉగ్రవాదులకు కూడా పద్మ అవార్డులు ఇవ్వమంటారేమోనని విష్ణు వ్యంగ్యం ప్రదర్శించారు.
This post was last modified on January 28, 2025 11:45 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…