Political News

బండి బాటలో విష్ణు.. గద్దర్ నరహంతకుడని కామెంట్

ప్రజా గాయకుడిగా తెలుగు ప్రజల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకున్న గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు డిమాండ్.. దానికి బీజేపీ ప్రతిస్పందించిన తీరుతో నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు మాటల యుద్ధమే జరుగుతోంది. నిన్నటికి నిన్న తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్.. బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రచ్చకు శ్రీకారం చుట్టారు.

బండి వ్యాఖ్యలపై మూకుమ్మడి దాడికి దిగిన టీ కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి కేంద్ర మంత్రిపై విరుచుకుపడిపోయారు. టీపీసీసీ అయితే ఏకంగా గద్దర్ మరణించిస సందర్భంగా ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ గద్దర్ సతీమణికు ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను బయటపెట్టి మరీ ఎదురు దాడికి దిగింది. గద్దర్ బతికుండగా…ఆయనను బండి సంజయ్ ఆలింగనం చేసుకున్న వీడియోలను కూడా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి బీజేపీపై ఏకంగా ర్యాగింగ్ కే పాల్పడింది.

కాంగ్రెస్ ఇంతగా కార్నర్ చేస్తున్నా… బీజేపీలో ఎంతమాత్రం మార్పు రావడం లేదు. నిన్న తెలంగాణకు చెందిన బండి సంజయ్ ఈ వివాదానికి తెర తీస్తే… ఇప్పుడు ఏపీకి చెందిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దానికి మరింత ఆజ్యం పోశారు. బండి సంజయ్ ను మించి గద్దర్ పై విస్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. బండి మాదిరిగానే విష్ణు కూడా గద్దర్ కు పద్మ అవార్డు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి పారేశారు.

అయినా విష్ణు ఏమన్నారన్న విషయానికి వస్తే.. గద్దర్ పై అనేక కేసులు ఉన్నాయని విష్ణు అన్నారు. గద్దర్ అనేక మంది ప్రాణాలను తీశారని, ఈ లెక్కన గద్దర్ నరహంతుకుడేనని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్న గద్దర్ కు అవార్డు ఎలా ఇవ్వమంటారని ఆయన ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్య విధానాలకు గద్దర్ వ్యతిరేకన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. గద్దర్ కు ఎల్టీటీఈకి పెద్దగా తేడా లేదని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎల్టీటీఈ చేతిలోనే రాజీవ్ హత్యకు గురైన విషయాన్ని ఈ సందర్భంగా విష్ణు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే… ఎల్టీటీఈ ఉగ్రవాదులకు కూడా పద్మ అవార్డులు ఇవ్వమంటారేమోనని విష్ణు వ్యంగ్యం ప్రదర్శించారు.

This post was last modified on January 28, 2025 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago