Political News

80 :15 : 5… ఏమిటిది?

ఈ అంకెలేమిటి? వాటి మధ్య పర్సంటేజీలను గుర్తు చేస్తున్నట్లుగా ఆ డాట్స్ ఏమిటి? ఏమైనా గణిత పాఠాలు చెబుతున్నారా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇదేమీ మ్యాథ్స్ క్లాస్ కాదు గానీ… ఏపీలోని కూటమిలోని పార్టీల మధ్య కుదిరిన పదవుల పందేరానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం. అసలే మూడు పార్టీలు… అన్ని పార్టీల్లో వందల సంఖ్యలో ఆశావహులు. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కదా. అదే సమయంలో ఓ పార్టీకి ఎక్కువ పదవులు ఇచ్చి…మరో పార్టీకి తక్కువ పదవులు దక్కితే… అసలుకే ఎసరు తప్పదు. ఆ ముప్పు వద్దని భావించిన మూడు పార్టీల అధిష్ఠానాలు కలిసి కూర్చుని నిర్దేశించేందుకు పదవుల పర్సంటేజీలు ఇవి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో జతకట్టిన జనసేన, బీజేపీలు మూకుమ్మడిగా వైసీపీని చిత్తు చేసి…94 శాతం సక్సెస్ రేటును సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, ఆయన నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ లో మూడు పార్టీలకు ఆయా పార్టీలకు దక్కిన సీట్లు, ఓట్ల ఆధారంగా బెర్తులు దక్కాయి. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా నామినేడెట్ పదవుల భర్తీ జరిగినా… ఈ దఫా భర్తీ కాబోతున్న పదవులు చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. అందుకే… మిత్రపక్షాల మధ్య పొరపొచ్చాలు లేకుండా పదవులను పర్సంటేజీల ఆధారంగా పంచుకోవాలని తీర్మానించుకున్నారు.

కూటమికి కెప్టెన్ గానే కాకుండా కీలక ప్లేయర్ టీడీపీనే. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే… జనసేన, బీజేపీల సపోర్టు లేకుండానే సంపూర్ణ మెజారిటీ ఉంది. అయినా పొత్తు ధర్మాన్ని టీడీపీ గౌరవించింది. ప్రస్తుతం టీడీపీకి అసెంబ్లీలో 135 సీట్లు ఉండగా… జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన నామినేటెడ్ పోస్టులను కూడా పంచుకోవాలని కూటమి పార్టీలు తీర్మానించినట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం పదవులు దక్కనున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 50 దాకా కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వాటిలో అత్యధికంగా 30 నుంచి 35 పదవుల మేరకు మాత్రమే భర్తీ చేయాలని కూటమి పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇప్పుడు భర్తీ కానున్న పదవుల్లో రాష్ట్ర మహిళా కమిషన్, కనకదుర్గమ్య ఆలయ కమిటి, స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ, మార్కెటింగ్ కమిటీలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా పార్టీల నుంచి పదవులు ఆశించే నేతలు కూడా అదికంగానే ఉన్నారు. ఈ కారణంగానే పార్టీల మధ్య దూరం పెరగకుండా పర్సంటేజీల ఆధారంగా పదవుల పందేరానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.

Satya

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

4 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

5 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

7 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

7 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

7 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

8 hours ago