ఈ అంకెలేమిటి? వాటి మధ్య పర్సంటేజీలను గుర్తు చేస్తున్నట్లుగా ఆ డాట్స్ ఏమిటి? ఏమైనా గణిత పాఠాలు చెబుతున్నారా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఇదేమీ మ్యాథ్స్ క్లాస్ కాదు గానీ… ఏపీలోని కూటమిలోని పార్టీల మధ్య కుదిరిన పదవుల పందేరానికి సంబంధించిన ఓ కీలక ఒప్పందం. అసలే మూడు పార్టీలు… అన్ని పార్టీల్లో వందల సంఖ్యలో ఆశావహులు. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కదా. అదే సమయంలో ఓ పార్టీకి ఎక్కువ పదవులు ఇచ్చి…మరో పార్టీకి తక్కువ పదవులు దక్కితే… అసలుకే ఎసరు తప్పదు. ఆ ముప్పు వద్దని భావించిన మూడు పార్టీల అధిష్ఠానాలు కలిసి కూర్చుని నిర్దేశించేందుకు పదవుల పర్సంటేజీలు ఇవి.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో జతకట్టిన జనసేన, బీజేపీలు మూకుమ్మడిగా వైసీపీని చిత్తు చేసి…94 శాతం సక్సెస్ రేటును సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, ఆయన నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ లో మూడు పార్టీలకు ఆయా పార్టీలకు దక్కిన సీట్లు, ఓట్ల ఆధారంగా బెర్తులు దక్కాయి. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా నామినేడెట్ పదవుల భర్తీ జరిగినా… ఈ దఫా భర్తీ కాబోతున్న పదవులు చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. అందుకే… మిత్రపక్షాల మధ్య పొరపొచ్చాలు లేకుండా పదవులను పర్సంటేజీల ఆధారంగా పంచుకోవాలని తీర్మానించుకున్నారు.
కూటమికి కెప్టెన్ గానే కాకుండా కీలక ప్లేయర్ టీడీపీనే. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే… జనసేన, బీజేపీల సపోర్టు లేకుండానే సంపూర్ణ మెజారిటీ ఉంది. అయినా పొత్తు ధర్మాన్ని టీడీపీ గౌరవించింది. ప్రస్తుతం టీడీపీకి అసెంబ్లీలో 135 సీట్లు ఉండగా… జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన నామినేటెడ్ పోస్టులను కూడా పంచుకోవాలని కూటమి పార్టీలు తీర్మానించినట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం పదవులు దక్కనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 50 దాకా కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వాటిలో అత్యధికంగా 30 నుంచి 35 పదవుల మేరకు మాత్రమే భర్తీ చేయాలని కూటమి పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇప్పుడు భర్తీ కానున్న పదవుల్లో రాష్ట్ర మహిళా కమిషన్, కనకదుర్గమ్య ఆలయ కమిటి, స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ, మార్కెటింగ్ కమిటీలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయా పార్టీల నుంచి పదవులు ఆశించే నేతలు కూడా అదికంగానే ఉన్నారు. ఈ కారణంగానే పార్టీల మధ్య దూరం పెరగకుండా పర్సంటేజీల ఆధారంగా పదవుల పందేరానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.
This post was last modified on January 28, 2025 10:45 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…