Political News

లోకేశ్ ను ఫేస్ చేయాలంటే చాలా కష్టం గురూ..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది పడేవారు. దీంతో కొన్నిమీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆయనను అనవసర ప్రశ్నలు సంధించి ఇబ్బంది పెట్టేందుకు యత్నించేవారు. లోకేశ్ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అలా కాదు. లోకేశ్ ఆరితేరిపోయారు. ఒకింత నాటుగా చెప్పాలంటే… రాటుదేలిపోయారు. ఇప్పుడు లోకేశ్ ను ప్రశ్నించాలంటే కాకలు తీరిన జర్నలిస్టులు కూడా ప్రిపేర్ అయి మరీ వెళ్లక తప్పదు. లేదంటే… లోకేశ్ చేతిలో చీవాట్లు తినక తప్పదు.

మొన్నటిదాకా లోకేశ్ ఎక్కడికి వెళ్లినా… జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియా ప్రతినిధులు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు రెడీగా ఉండేవారు. అయితే ఇప్పుడు లోకేశ్ వస్తున్నారంటే… మనం ఎందుకు వెళ్లడం అన్నట్లుగా సాక్షిజర్నలిస్టులు జంకుతున్నారు. ప్రెస్ మీట్ మొదలు కాగానే… సాక్షి ఎక్కడ? అంటూ లోకేశ్ కామెంట్ చేస్తున్నారు. నేనే అంటూ సదరు ప్రతినిధులు చేతులెత్తితే సరేసరి.. అలా చేతులు లేవకపోతే… ఆ రోజు సాక్షి మీడియా లోకేశ్ సెటైర్ల వర్షంలో వణికి పోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే… సాక్షి మీడియాలోను లోకేశ్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పక తప్పదు. సోమవారం విశాఖ వెళ్లిన సందర్భంగానూ లోకేశ్ ఇదే తరహాలో సాక్షిపై మాస్ ర్యాగింగ్ కు దిగారు.

సాక్షినే కాదు… విషయాలపై అవగాన లేకుండా తనను అనవసర ప్రశ్నలతో సతాయించే జర్నలిస్టులను కూడా లోకేశ్ వదిలిపెట్టడం లేదు. సోమవారం నాటి విశాఖ టూర్ లో ఇది స్పష్టంగా కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి లోకేశ్ ఎంత చెబుతున్నా… పదే పదే అదే ప్రశ్న సంధించిన ఓ విలేకరి తీరుపై ఆయన ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఇలాగైతే కాదు స్వామీ,…మీరు కాస్తంత చదువుకుని రావాలి అంటూ సదరు విలేకరికి లోకేశ్ చురకలు అంటించిన వైనం నిజంగానే లోకేశ్ సత్తాకు నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి.

మీడియా ప్రతినిధులతో పెట్టుకోవాలంటే భయపడని నేత అంటూ ఉండరు. వారితో మనకెందుకులే అన్న రీతిలోనే అందరూ సాగుతూ ఉంటారు. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఆయా విషయాలపై సమగ్ర అవగాహన, తప్పులు చేయకుండా సాగడం, అబద్ధాలు అసలే చెప్పకపోవడం, నిజాయతీగా సాగడం వంటి విషయాల్లో ఆరితేరిన లోకేశ్ మీడియాను చూసి భయపడటం లేదు. లోకేశ్ ను చూస్తే మీడియా ప్రతినిధులే కాస్తంత భయపడిపోయేంతగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు. అవగాహన కలిగిన జర్నలిస్టులను అక్కడికక్కడే మెచ్చుకునే లోకేశ్… విషయాలపై అవగాహన లేని వారిని మాత్రం ఓ ఆట ఆడుకునే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందుకే…లోకేశ్ ను ఫేస్ చేయాలంటే ఒకింత కష్టమేనని చెప్పక తప్పదు.

This post was last modified on January 27, 2025 9:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

47 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago