Political News

లోకేశ్ ను ఫేస్ చేయాలంటే చాలా కష్టం గురూ..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కాస్తంత ఇబ్బంది పడేవారు. దీంతో కొన్నిమీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఆయనను అనవసర ప్రశ్నలు సంధించి ఇబ్బంది పెట్టేందుకు యత్నించేవారు. లోకేశ్ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అలా కాదు. లోకేశ్ ఆరితేరిపోయారు. ఒకింత నాటుగా చెప్పాలంటే… రాటుదేలిపోయారు. ఇప్పుడు లోకేశ్ ను ప్రశ్నించాలంటే కాకలు తీరిన జర్నలిస్టులు కూడా ప్రిపేర్ అయి మరీ వెళ్లక తప్పదు. లేదంటే… లోకేశ్ చేతిలో చీవాట్లు తినక తప్పదు.

మొన్నటిదాకా లోకేశ్ ఎక్కడికి వెళ్లినా… జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియా ప్రతినిధులు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు రెడీగా ఉండేవారు. అయితే ఇప్పుడు లోకేశ్ వస్తున్నారంటే… మనం ఎందుకు వెళ్లడం అన్నట్లుగా సాక్షిజర్నలిస్టులు జంకుతున్నారు. ప్రెస్ మీట్ మొదలు కాగానే… సాక్షి ఎక్కడ? అంటూ లోకేశ్ కామెంట్ చేస్తున్నారు. నేనే అంటూ సదరు ప్రతినిధులు చేతులెత్తితే సరేసరి.. అలా చేతులు లేవకపోతే… ఆ రోజు సాక్షి మీడియా లోకేశ్ సెటైర్ల వర్షంలో వణికి పోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే… సాక్షి మీడియాలోను లోకేశ్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పక తప్పదు. సోమవారం విశాఖ వెళ్లిన సందర్భంగానూ లోకేశ్ ఇదే తరహాలో సాక్షిపై మాస్ ర్యాగింగ్ కు దిగారు.

సాక్షినే కాదు… విషయాలపై అవగాన లేకుండా తనను అనవసర ప్రశ్నలతో సతాయించే జర్నలిస్టులను కూడా లోకేశ్ వదిలిపెట్టడం లేదు. సోమవారం నాటి విశాఖ టూర్ లో ఇది స్పష్టంగా కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి లోకేశ్ ఎంత చెబుతున్నా… పదే పదే అదే ప్రశ్న సంధించిన ఓ విలేకరి తీరుపై ఆయన ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఇలాగైతే కాదు స్వామీ,…మీరు కాస్తంత చదువుకుని రావాలి అంటూ సదరు విలేకరికి లోకేశ్ చురకలు అంటించిన వైనం నిజంగానే లోకేశ్ సత్తాకు నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి.

మీడియా ప్రతినిధులతో పెట్టుకోవాలంటే భయపడని నేత అంటూ ఉండరు. వారితో మనకెందుకులే అన్న రీతిలోనే అందరూ సాగుతూ ఉంటారు. అయితే ఆ తరహా వైఖరికి లోకేశ్ పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఆయా విషయాలపై సమగ్ర అవగాహన, తప్పులు చేయకుండా సాగడం, అబద్ధాలు అసలే చెప్పకపోవడం, నిజాయతీగా సాగడం వంటి విషయాల్లో ఆరితేరిన లోకేశ్ మీడియాను చూసి భయపడటం లేదు. లోకేశ్ ను చూస్తే మీడియా ప్రతినిధులే కాస్తంత భయపడిపోయేంతగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు. అవగాహన కలిగిన జర్నలిస్టులను అక్కడికక్కడే మెచ్చుకునే లోకేశ్… విషయాలపై అవగాహన లేని వారిని మాత్రం ఓ ఆట ఆడుకునే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అందుకే…లోకేశ్ ను ఫేస్ చేయాలంటే ఒకింత కష్టమేనని చెప్పక తప్పదు.

This post was last modified on January 27, 2025 9:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

15 minutes ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

49 minutes ago

బాలయ్య మూవీ అంటే కొరటాలకు సవాలే

దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…

1 hour ago

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

6 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు రాష్ట్రంలో అన్యాయంగా…

7 hours ago