ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది. ఈ మ్యానిఫెస్టోలో యువత, మహిళలు, కిరాయిదారులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికీ ఆకర్షణీయమైన హామీలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల మన్ననలు పొందే విధంగా తమ ఎజెండాను రూపొందించింది.
ఆప్ మ్యానిఫెస్టోలో యువతకు ప్రాధాన్యతను ఇస్తూ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేకంగా హామీ ఇచ్చింది. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే, మహిళల కోసం ‘మహిళా సమ్మాన్ యోజన’ పేరిట నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. వృద్ధులకు ప్రత్యేకమైన ‘సంజీవని పథకం’ కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. నీటి సరఫరా బిల్లులు మాఫీ చేయడం, 24 గంటల నీటి సరఫరాను అందించడంపై కూడా దృష్టి సారించింది.
మ్యానిఫెస్టోలో మరో ప్రధానమైన హామీ రోడ్ల నిర్మాణం. యూరప్ తరహాలో రోడ్లను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పిన ఆప్, ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50% రాయితీతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీ ఇచ్చింది. యమునా నదిని శుభ్రం చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18,000 అందించడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
కిరాయిదారులకు ఉచిత కరెంట్, నీటి సౌకర్యం కల్పించడం వంటి హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మ్యానిఫెస్టోను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆటో, టాక్సీ డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్, వివాహాల కోసం ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రకటించడం ద్వారా ఆ వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
గత ఎన్నికల విజయాలను పునరావృతం చేయడమే లక్ష్యంగా ఈసారి కూడా ఆప్ ఎలాంటి లోటు లేకుండా తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. 2015లో 67 సీట్లతో, 2020లో 62 సీట్లతో ఘనవిజయం సాధించిన ఆప్, మూడోసారి కూడా అధికారం దక్కించుకునే పట్టుదలతో నడుస్తోంది. మ్యానిఫెస్టోలోని హామీలు ప్రజల మన్ననలను పొందుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
This post was last modified on January 27, 2025 9:05 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…