ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది. ఈ మ్యానిఫెస్టోలో యువత, మహిళలు, కిరాయిదారులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికీ ఆకర్షణీయమైన హామీలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల మన్ననలు పొందే విధంగా తమ ఎజెండాను రూపొందించింది.
ఆప్ మ్యానిఫెస్టోలో యువతకు ప్రాధాన్యతను ఇస్తూ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేకంగా హామీ ఇచ్చింది. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే, మహిళల కోసం ‘మహిళా సమ్మాన్ యోజన’ పేరిట నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. వృద్ధులకు ప్రత్యేకమైన ‘సంజీవని పథకం’ కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. నీటి సరఫరా బిల్లులు మాఫీ చేయడం, 24 గంటల నీటి సరఫరాను అందించడంపై కూడా దృష్టి సారించింది.
మ్యానిఫెస్టోలో మరో ప్రధానమైన హామీ రోడ్ల నిర్మాణం. యూరప్ తరహాలో రోడ్లను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పిన ఆప్, ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50% రాయితీతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీ ఇచ్చింది. యమునా నదిని శుభ్రం చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18,000 అందించడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
కిరాయిదారులకు ఉచిత కరెంట్, నీటి సౌకర్యం కల్పించడం వంటి హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మ్యానిఫెస్టోను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆటో, టాక్సీ డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్, వివాహాల కోసం ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రకటించడం ద్వారా ఆ వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
గత ఎన్నికల విజయాలను పునరావృతం చేయడమే లక్ష్యంగా ఈసారి కూడా ఆప్ ఎలాంటి లోటు లేకుండా తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. 2015లో 67 సీట్లతో, 2020లో 62 సీట్లతో ఘనవిజయం సాధించిన ఆప్, మూడోసారి కూడా అధికారం దక్కించుకునే పట్టుదలతో నడుస్తోంది. మ్యానిఫెస్టోలోని హామీలు ప్రజల మన్ననలను పొందుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
This post was last modified on January 27, 2025 9:05 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…