ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది. ఈ మ్యానిఫెస్టోలో యువత, మహిళలు, కిరాయిదారులు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికీ ఆకర్షణీయమైన హామీలు ఉన్నాయి. ఆప్ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల మన్ననలు పొందే విధంగా తమ ఎజెండాను రూపొందించింది.
ఆప్ మ్యానిఫెస్టోలో యువతకు ప్రాధాన్యతను ఇస్తూ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేకంగా హామీ ఇచ్చింది. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ముఖ్యమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే, మహిళల కోసం ‘మహిళా సమ్మాన్ యోజన’ పేరిట నెలకు రూ.2,100 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. వృద్ధులకు ప్రత్యేకమైన ‘సంజీవని పథకం’ కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. నీటి సరఫరా బిల్లులు మాఫీ చేయడం, 24 గంటల నీటి సరఫరాను అందించడంపై కూడా దృష్టి సారించింది.
మ్యానిఫెస్టోలో మరో ప్రధానమైన హామీ రోడ్ల నిర్మాణం. యూరప్ తరహాలో రోడ్లను తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పిన ఆప్, ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50% రాయితీతో పాటు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీ ఇచ్చింది. యమునా నదిని శుభ్రం చేయడంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18,000 అందించడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
కిరాయిదారులకు ఉచిత కరెంట్, నీటి సౌకర్యం కల్పించడం వంటి హామీలతో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మ్యానిఫెస్టోను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆటో, టాక్సీ డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్, వివాహాల కోసం ఆర్థిక సాయం వంటి పథకాలను ప్రకటించడం ద్వారా ఆ వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
గత ఎన్నికల విజయాలను పునరావృతం చేయడమే లక్ష్యంగా ఈసారి కూడా ఆప్ ఎలాంటి లోటు లేకుండా తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. 2015లో 67 సీట్లతో, 2020లో 62 సీట్లతో ఘనవిజయం సాధించిన ఆప్, మూడోసారి కూడా అధికారం దక్కించుకునే పట్టుదలతో నడుస్తోంది. మ్యానిఫెస్టోలోని హామీలు ప్రజల మన్ననలను పొందుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
This post was last modified on January 27, 2025 9:05 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…