వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనాామా చేయాల్సింది మాత్రమే మిగిలి ఉంది. అది కూడా అయిపోతే… సాయిరెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లే. ఆ రాజీనామా ఎప్పుడు చేస్తారో తెలియదు గానీ… తాను చెప్పినట్లుగానే వ్యవసాయంలోకి ఆయన అప్పుడే దిగిపోయారు.
ఈ మేరకు సోమవారం రాత్రి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిరెడ్డి… తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రదేశం ఎక్కడిదన్న విషయాన్ని మాత్రం సాయిరెడ్డి చెప్పలేదు గానీ… సాయిరెడ్డి పెద్ద ఫామ్ ల్యాండ్ నే కొనుగోలు చేసినట్లున్నారు. ఎంచక్కా టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ లోకి మారిపోయిన సాయిరెడ్డి మోడర్న్ ఫార్మర్ లుక్ లో దర్శనమిస్తున్నారు. మిలిటరీ టైపు జీపులో తన ఫామ్ ల్యాండ్ కు వెళ్లిన సాయిరెడ్డి… అందులోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…