Political News

పార్టీ అభిప్రాయమే ఫైనల్ అంటోన్న నాగబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాలపై ఎవ్వరూ మాట్లాడవద్దని జనసేన హై కమాండ్ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా జనసేన నేతలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అదే తరహాలో కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దవద్దని, పార్టీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

అంతేకాదు, ఎటువంటి వివాదాలు, గొడవల జోలికి వెళ్ళవద్దని, పార్టీ అధిష్ఠానం ఆదేశించిన దాని ప్రకారం చేయాలని ఆదేశించారు. జనసేనలో చేరిన కొందరు నేతలకు కండువా కప్పి ఆహ్వానించిన నాగబాబు వారికి పలు సూచనలు చేశారు. అధికారం చేతిలో ఉందని దుర్వినియోగం చేయకూడదని, ప్రజలకు వీలైనంత మంచి చేసే విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం తప్ప వేరే ఏది తాము ఆశించలేదని గుర్తు చేశారు.

ఇక, జనసేనలో పని చేసే ప్రతి కార్యకర్త అత్యున్నతమైన స్థానానికి వెళ్ళేందుకు పార్టీ అవకాశం కల్పిస్తుందని, ఇక్కడ మా వాడా, మా ఇంటి కుర్రాడా అనేవి ఉండవని చెప్పారు. నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే పార్టీలో ఉన్నత శిఖరాలకు వెళతారని అన్నారు. స్వలాభం కోసం పార్టీలో చేరితే అటువంటి ఆలోచనలు పక్కనపెట్టాలని, అయితే, నిజంగా అవసరం ఉన్న సమయంలో ప్రభుత్వం తరపున సాయం చేస్తామని జనసేనలో చేరిన వారికి నాగబాబు చెప్పారు. ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago