Political News

పార్టీ అభిప్రాయమే ఫైనల్ అంటోన్న నాగబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాలపై ఎవ్వరూ మాట్లాడవద్దని జనసేన హై కమాండ్ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా జనసేన నేతలకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అదే తరహాలో కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ మీద రుద్దవద్దని, పార్టీ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

అంతేకాదు, ఎటువంటి వివాదాలు, గొడవల జోలికి వెళ్ళవద్దని, పార్టీ అధిష్ఠానం ఆదేశించిన దాని ప్రకారం చేయాలని ఆదేశించారు. జనసేనలో చేరిన కొందరు నేతలకు కండువా కప్పి ఆహ్వానించిన నాగబాబు వారికి పలు సూచనలు చేశారు. అధికారం చేతిలో ఉందని దుర్వినియోగం చేయకూడదని, ప్రజలకు వీలైనంత మంచి చేసే విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం తప్ప వేరే ఏది తాము ఆశించలేదని గుర్తు చేశారు.

ఇక, జనసేనలో పని చేసే ప్రతి కార్యకర్త అత్యున్నతమైన స్థానానికి వెళ్ళేందుకు పార్టీ అవకాశం కల్పిస్తుందని, ఇక్కడ మా వాడా, మా ఇంటి కుర్రాడా అనేవి ఉండవని చెప్పారు. నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే పార్టీలో ఉన్నత శిఖరాలకు వెళతారని అన్నారు. స్వలాభం కోసం పార్టీలో చేరితే అటువంటి ఆలోచనలు పక్కనపెట్టాలని, అయితే, నిజంగా అవసరం ఉన్న సమయంలో ప్రభుత్వం తరపున సాయం చేస్తామని జనసేనలో చేరిన వారికి నాగబాబు చెప్పారు. ఏ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు.

This post was last modified on January 27, 2025 8:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

42 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago