ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో టీడీపీ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రినారా లోకేస్లు పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. ఒప్పందాలు చేసుకోలేదు కానీ.. పారిశ్రామిక వేత్తలను ఒప్పించారు. దీనికి సంబంధించిన ఫలాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించకపోయినా.. కేంద్రం నుంచి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.గత నెలలో విశాఖకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోడీ నేరుగా విశాఖకు వచ్చి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇక, ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. కూటమి పార్టీల ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తనదైన పంథాలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా జనసేన నాయకుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వరంలో పర్యాటక పెట్టుబడుల వేట ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సదస్సును విశాఖలో సోమవారం నుంచి ప్రారం భిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యాటక పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అడ్వెంచర్, క్రూయిజ్, ఎకోటూరిజం, అరకు టూరిజం రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువ చ్చేందుకు మంత్రి కందుల ప్రయ త్నిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యాటకం అభివృద్ది చెందడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది మంత్రి చెబుతున్న మాట. మొత్తానికి జనసేన ప్రయత్నంతో పర్యాటక పెట్టుబడుల్లో ఊపు వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…