ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో టీడీపీ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రినారా లోకేస్లు పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. ఒప్పందాలు చేసుకోలేదు కానీ.. పారిశ్రామిక వేత్తలను ఒప్పించారు. దీనికి సంబంధించిన ఫలాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించకపోయినా.. కేంద్రం నుంచి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.గత నెలలో విశాఖకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోడీ నేరుగా విశాఖకు వచ్చి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇక, ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. కూటమి పార్టీల ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తనదైన పంథాలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా జనసేన నాయకుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వరంలో పర్యాటక పెట్టుబడుల వేట ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సదస్సును విశాఖలో సోమవారం నుంచి ప్రారం భిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యాటక పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అడ్వెంచర్, క్రూయిజ్, ఎకోటూరిజం, అరకు టూరిజం రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువ చ్చేందుకు మంత్రి కందుల ప్రయ త్నిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యాటకం అభివృద్ది చెందడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది మంత్రి చెబుతున్న మాట. మొత్తానికి జనసేన ప్రయత్నంతో పర్యాటక పెట్టుబడుల్లో ఊపు వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 27, 2025 3:52 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…