Political News

ఇక‌, జ‌న‌సేన పెట్టుబ‌డుల వేట‌… నిజం!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువ‌చ్చేందుకు.. గ‌త ప్రాభ‌వం నిల‌బెట్టేందుకు కూట‌మి పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీటిలో టీడీపీ దూకుడుగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్‌లో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రినారా లోకేస్‌లు పెట్టుబ‌డుల కోసం ప్ర‌య‌త్నించారు. ఒప్పందాలు చేసుకోలేదు కానీ.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఒప్పించారు. దీనికి సంబంధించిన ఫ‌లాలు త్వ‌ర‌లోనే రాష్ట్రానికి రానున్నాయి.

ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. నేరుగా పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోయినా.. కేంద్రం నుంచి పెట్టుబడులు వ‌చ్చేందుకు కృషి చేస్తున్న విష‌యం తెలిసిందే.గ‌త నెల‌లో విశాఖ‌కు రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ప్ర‌ధాని మోడీ నేరుగా విశాఖ‌కు వ‌చ్చి శంకుస్థాప‌న‌లు కూడా చేశారు. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన వంతు వ‌చ్చింది. కూట‌మి పార్టీల ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌కంగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు త‌న‌దైన పంథాలో పెట్టుబ‌డులు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

దీనిలో భాగంగా జ‌న‌సేన నాయ‌కుడు, రాష్ట్ర‌ ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వ‌రంలో ప‌ర్యాట‌క పెట్టుబ‌డుల వేట ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన స‌ద‌స్సును విశాఖ‌లో సోమ‌వారం నుంచి ప్రారం భిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జ‌రిగే ఈ ప‌ర్యాట‌క పెట్టుబ‌డుల స‌ద‌స్సు ద్వారా రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క రంగంలో అగ్రగామిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

అడ్వెంచర్, క్రూయిజ్, ఎకోటూరిజం, అరకు టూరిజం రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువ చ్చేందుకు మంత్రి కందుల ప్ర‌య త్నిస్తున్నారు. త‌ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప‌ర్యాట‌కం అభివృద్ది చెంద‌డంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్న‌ది మంత్రి చెబుతున్న మాట‌. మొత్తానికి జ‌న‌సేన ప్ర‌య‌త్నంతో ప‌ర్యాట‌క పెట్టుబడుల్లో ఊపు వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on January 27, 2025 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

44 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

1 hour ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

3 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

6 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago