ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో టీడీపీ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రినారా లోకేస్లు పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. ఒప్పందాలు చేసుకోలేదు కానీ.. పారిశ్రామిక వేత్తలను ఒప్పించారు. దీనికి సంబంధించిన ఫలాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి.
ఇక, బీజేపీ విషయానికి వస్తే.. నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించకపోయినా.. కేంద్రం నుంచి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.గత నెలలో విశాఖకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని మోడీ నేరుగా విశాఖకు వచ్చి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇక, ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. కూటమి పార్టీల ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తనదైన పంథాలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా జనసేన నాయకుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వరంలో పర్యాటక పెట్టుబడుల వేట ప్రారంభమైంది. దీనికి సంబంధించిన సదస్సును విశాఖలో సోమవారం నుంచి ప్రారం భిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యాటక పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అడ్వెంచర్, క్రూయిజ్, ఎకోటూరిజం, అరకు టూరిజం రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకువ చ్చేందుకు మంత్రి కందుల ప్రయ త్నిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యాటకం అభివృద్ది చెందడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది మంత్రి చెబుతున్న మాట. మొత్తానికి జనసేన ప్రయత్నంతో పర్యాటక పెట్టుబడుల్లో ఊపు వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…