టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. ఏం చేసినా.. తనదైన శైలిలో చేసుకుపోతున్న లోకేశ్ పై జనం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సొమ్మును అనవసరంగా ఖర్చు చేసేందుకు ససేమిరా అంటున్న లోకేశ్… తనదైన శైలి ప్రత్యేక మార్గంలో పయనిస్తూ ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో లోకేశ్ లా వ్యవహరించిన నేతలు దేశ చరిత్రలోనే వేళ్లమీద లెక్క పెట్టొచ్చన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
సరే… అసలు విషయంలోకి వెళితే… 2019లో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. చినబాబు చిరుతిండి… 25 లక్షలండి… అన్న శీర్షికన లోకేశ్ పై ఆ పత్రిక ఓ వ్యతిరేక కథనం రాసింది. మంత్రి హోదాలో విశాఖ వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజిలో స్నాక్స్ కోసం ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేశారన్నది ఆ కథనం సారాంశం.
ఈ కథనంపై లోకేశ్ భగ్గుమన్నారు. సాక్షికి నోటీసులు పంపారు. సాక్షి స్పందించకపోవడంతో దానిపై విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం లోకేశ్ విశాఖ వచ్చారు. కేసు విచారణ వాయిదా పడటంతో తిరిగి అమరావతి బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
తాను ప్రస్తుతం మంత్రిగా ఉన్న విషయాన్ని గుర్తు చేసిన లోకేశ్… తాను మంత్రి హోదాలో ఇప్పుడు విశాఖకు రాలేదన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా ఓ పత్రిక రాసిన కథనంపై న్యాయ పోరాటం చేసేందుకు వ్యక్తిగత హోదాలోనే వచ్చానన్నారు. ఈ కారణంగా తన పార్టీకి చెందిన బస్సులో నిద్రించానని, భోజనాన్ని కూడా తన సొంత డబ్బులతోనే తెప్పించుకున్నానని తెలిపారు. కనీసం వాటర్ బాటిల్ కోసం కూడా ప్రజా ధనాన్ని వినియోగించలేదన్నారు. సొంత కారులోనే వచ్చానని, దానిలో పెట్రోల్ కూడా సొంత డబ్బుతోనే పోయించుకున్నానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తాను ఈ దిశగా కీలక అడుగులు వేసేందుకు తన మాతృమూర్తి నారా భువనేశ్వరి కారణమని లోకేశ్ తెలిపారు. ఎక్కడా ప్రభుత్వంపైన ఆదారపడకూడదని తన తల్లి తనకు చిన్నప్పటి నుంచి చెప్పేదని… ఇప్పుడు అదే అలవాటు అయ్యిందని ఆయన తెలిపారు. ఓ వైపు చోటా మోటా పదవులు దక్కినంతనే… సీఎం, పీఎంల మాదిరిగా దర్జా ఒలకబోస్తున్న నేతలు నానాటికీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో లోకేశ్ తన తల్లి మాట మేరకు ప్రజా ధనం దుర్వినియోగానికి మాత్రం పాల్పడేది లేదని లోకేశ్ చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉంటే… సాక్షిపై పరువు నష్టం కేసు విచారణను కోర్టు వాయిదా వేసిందని లోకేశ్ తెలిపారు. ఇప్పటికే నాలుగు వాయిదాలకు తాను హాజరయ్యానని చెప్పిన ఆయన..ఇంకెన్ని వాయిదాలకు రమ్మన్నా వస్తానని తెలిపారు. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని తెలిపారు. నిజం తన వైపు ఉందని, కాస్తంత ఆలస్యం అయినా ఈ కేసులో విజయం తనదేనని కూడా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on January 27, 2025 1:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…